Friday, January 24, 2014

‘త్రిఫలచూర్ణం’


కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను కలిసి ‘త్రిఫలాలు’ అంటారు. వాటిని ఎండబెట్టి, విడివిడిగా పొడిచేసి, సమానంగా కలుపుకుంటే చక్కటి ‘త్రిఫలచూర్ణం’ తయారవుతుంది.
ఇలా చేయండి.. కళ్లు ఎంత రిలాక్స్ అవుతాయో.. సైట్ ఎలా తగ్గుతుందో మీరే చూడండి!!
చిన్న ఏజ్‌లోనే భూతద్ధాల్లాంటి కళ్లజోడ్లు వాడాల్సిన పరిస్థితి చాలామందికి ఏర్పడుతోంది... ముఖ్యంగా ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్‌లూ గంటల తరబడి వాడేసేయడం, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహారం లోపించడం వంటి కారణాల వల్ల దాదాపు అన్ని వయస్సుల వారూ ఎంతోకొంత దృష్టి సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు.
మనం చాలా తక్కువ పట్టించుకునేది eyes. కారణం అవి ఎప్పుడూ ప్లాబ్లెం రావు, చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లు వచ్చినా ఏ జెంటామైసిన్ వంటి dropsనో కళ్లల్లో వేసుకుంటే తగ్గిపోతాయన్న నమ్మకం కొద్దీ వాటి పట్ల శ్రద్ధ పెట్టనే పెట్టం.

సరైన పోషణ లేకపోయినా చాలా ఎక్కువ రోజులు మనకు కోపరేట్ చేసే విజన్ ఒక్కసారి తగ్గడం మొదలెడితే దాన్ని ఆపడం చాలా కష్టం, ఎంత కళ్లజోడు పవర్ పెంచుకుంటూ పోయినా..
సో, భారతీయులకు ప్రాచీనకాలం నుండి కళ్ల విషయంలో వస్తున్న ఓ అద్భుతమైన సొల్యూషన్ త్రిఫల పౌడర్‌తో కళ్లని bath చేయించడం.
చేయాల్సింది ఇలా..
త్రిఫల పౌడర్ ప్రతీ ఆయుర్వేదిక్ స్టోర్‌లో లభిస్తుంది.. ప్రతీ రోజూ ఉదయం పూట దీన్ని ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అర టీస్పీన్ పౌడర్‌ని ఓ కప్ వాటర్‌లో వేసి గోరువెచ్చగా boil చేసి నైట్ వరకూ అలాగే ఉంచాలి. నైట్ పడుకోబోయే ముందు దాన్ని వడగట్టి రెండు కాటన్ ముక్కలు తీసుకుని ఆ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకుని కళ్లల్లోకి త్రిఫల వాటర్ వెళ్లే విధంగా కాటన్ ని వేళ్లతో ప్రెస్ చేస్తుండాలి. కాసేపటికి కళ్లు డ్రై అవగానే మళ్లీ కాటన్ ప్రెస్ చేస్తే మరికొన్ని చుక్కలు కాటన్ నుండి కళ్లల్లో పడతాయి.
ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత ఓ 20-25 నిముషాలు టివి గానీ, మోనిటర్ గానీ, ఫోన్ స్క్రీన్ గానీ చూడకండి. అందుకే పడుకోబోయే ముందు ఇలా చేస్తే ఇంకా బెటర్.
లాభాలివి: త్రిఫల bath వల్ల కంటి నరాలు బలపడతాయి. విజన్ మెరుగుపడుతుంది, వయస్సుతో పాటు దృష్టి తగ్గడం అన్న సమస్యలే రావు. పెద్ద వాళ్లకైతే కేటరాక్ట్ వంటి సమస్యలూ తొలగిపోతాయి.
ఇలా ఓ 4-5 రోజులు ఫాలో అయ్యాక స్వయంగా మీకే తేడా తెలుస్తుంది, నమ్మకం వస్తుంది. . సో కావాలంటే ట్రై చేయండి. త్రిఫల వాటర్ తాగడం వల్ల వేరే ఉపయోగాలూ ఉన్నాయి
నల్లమోతు శ్రీధర్

Sunday, January 19, 2014

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్ పౌష్టికాహార లోపం, కాలుష్యాలు దాడి చేయడం వల్ల, షాంపూలు, తలకు వేసుకునే రంగులతో రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల జుట్టు ఊడగొట్టుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. మరి దీన్ని ఆపడం ఎలా? అది మీ చేతుల్లోనే ఉంది. అందుకు బెస్ట్ మెడిసిన్ కూరల్లో వాడే కరివేపాకు. అదెలాగంటే...
పొడవు, మందం బట్టి జుట్టుకు సరిపడా కరివేపాకులు తీసుకుని మెత్తగా రుబ్బాలి. ఇందులో నానబెట్టిన మెంతుల్ని ఆ నీళ్లతో సహా కలపొచ్చు. ఈ పేస్ట్‌ను మాడుకు రాసుకుని రెండు గంటల పాటు ఉంచుకోవాలి. రాసుకున్న మిశ్రమం త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకోవాలి. జుట్టు జిడ్డుగా అతుక్కున్నట్టు ఉంటుంది గాని ఆరిన తరువాత బాగానే ఉంటుంది. ఒకవేళ మరీ జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తే మైల్డ్ షాంపూ వాడొచ్చు.
జుట్టు ఆరిన తరువాత దువ్వితే జుట్టుకు కరివేపాకులేమైనా ఉంటే వచ్చేస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి జుట్టుకు వేసుకుంటే పట్టుకుచ్చులా మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం. అంతేకాదు ఎక్కువ జుట్టు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది.

Sunday, January 12, 2014

ఔషధమూలిక గోరింటాకు

గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.
గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.
ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.

Saturday, January 11, 2014

పల్లీల్లో పోషకాలు ఫుల్‌


పల్లీలంటే ఇష్టంగా తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందరికీ ఇష్టమైన పల్లీల్లో బోలెడన్ని పోషకాలున్నాయి. రుచిలో వీటికి సాటి లేదనే చెప్పవచ్చు. చక్కటి రుచితో పచ్చడి, పొడి ఇలా ఏ రూపంలోనైనా పల్లీ టేస్టే వేరు. పోషకాల సంగతి పక్కనపెడితే ఇందులో అధికంగా ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని మంచి పోషకాలుగా అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్‌ కారకాలు పేరుకోకుండా క్యాన్సర్లను అదుపులో ఉంచుతాయి.
పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్‌ అనే పాలిఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసే శక్తిని కలిగివుంటుంది. ప్రతి వందగ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చర్మానికి హానికలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీల్లో రెబోఫ్లేవిన్‌, నియాసిన్‌, థయామిన్‌, విటమిన్‌ బి6, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్‌ను పల్లీలే అందిస్తాయి. కాబట్టి పల్లీలో ఫుల్లుగా పోషకాలు ఉన్నాయని తెలిసిందికదా... చక్కగా మీరూ, మీ పిల్లలూ రోజుకు ఓ గుప్పెడు పల్లీలు తినడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

Wednesday, December 11, 2013

బలాన్ని ఇచ్చే బాదం

బలాన్ని ఇచ్చే బాదం బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం. ఎలా వాడితే మంచిది?
వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.
బాదంపాలు: బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.
మంచి టానిక్‌: బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.
కొన్ని సూచనలు: ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.

Friday, December 6, 2013

యోగాతో లాభాలెన్నో...

యోగాతో లాభాలెన్నో... యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్నకొద్దీ శరీరం తేలికవుతుంది, ఆలోచనలు దారికి వస్తాయి, జీవనశైలిలో మంచి మార్పొస్తుంది. యోగా వల్ల కలిగే ముఖ్యమైన తొమ్మిది లాభాలు ఇవే...
ఆల్‌రౌండ్ ఫిట్‌నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతౌల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారనే దే ఆరోగ్యానికి కొలమానం.
ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం - ఇవన్నీ కలిసి ఒక ప్యాకేజ్‌గా దానికి దోహదపడతాయి.
బరువు తగ్గడం : దరికీ కావాల్సిందిదే. సూర్యనమస్కారాలు, కపాలభాతి ప్రాణాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా యోగా చేసేటపుడు మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఒత్తిడి నివారణ : ఉదయాన్నే కొద్దిసేపు యోగా చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. శరీరంలోని మలినాలను వదిలించడంతో పాటు మనస్సు పరిశుభ్రంగా ఉండటానికి యోగా ఉపయోగపడుతుంది.
ప్రశాంతత : ప్రకృతిలోని ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశాలంటే మన అందరికీ ఇష్టమే. కాని ప్రశాంతత కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు, అది మనలోనే ఉంటుంది. రోజుకోసారి లోపలికి ప్రయాణించి దాన్ని అనుభూతి చెందవచ్చు. అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కుదుటపరచడానికి యోగాను మించిన సాధనమేదీ లేనేలేదు.
రోగనిరోధక శక్తి : శరీరం, మనసు, మేథ - అన్నీ కలిస్తేనే ఆరోగ్యం. యోగా అవయవాలకు సరిపడా శక్తినిస్తుంది, కండరాలను దృఢం చేస్తుంది. శ్వాస టెక్నిక్‌లు, ధ్యానం ద్వారా స్ట్రెస్ తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అవగాహన : మన ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. గతం, భవిష్యత్తులకు సంబంధించిన అనేక అంశాలతో అది పరుగులు పెడుతూ ఉంటుందేగాని వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. యోగ, ప్రాణాయామాల వల్ల ఈ సత్యం అవగాహనలోకి వస్తుంది. దాంతో ఆలోచనలను నియంత్రించడం సులువు అవుతుంది. అప్పుడే వర్తమానం మీద ఫోకస్ చెయ్యగలుగుతాం.
మెరుగైన సంబంధాలు : జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు - ఇలా చుట్టూ ఉన్న అన్ని బంధాలనూ మెరుగు చెయ్యడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రశాంతమైన మనసు, అదుపులో ఉండే భావోద్వేగాల వల్ల ప్రేమ, అనుబంధాలు దృఢమవుతాయి.
ఎక్కువ శక్తి : ఒకేసారి నాలుగు రకాల పనులు చెయ్యడంతో రోజంతా పనిచేసిన తర్వాత పూర్తిగా అలసిపోయి, శక్తినెవరో లాగేసినట్టు అయిపోతారు చాలామంది. కొద్దిసేపు యోగా చేస్తే మళ్లీ తాజాగా, ఉత్సాహంగా ఉంటారు.
ఫ్లెక్సిబిలిటీ : ఉరుకులుపరుగులు నిండిన జీవనశైలి వల్ల చిన్నాపెద్దా అందరికీ సాయంత్రానికల్లా ఒంటి నొప్పులు సాధారణమైపోయాయి. యోగా కండరాలను బలోపేతం చేసి టోన్ చేస్తుంది. నడిచినా, నిలబడినా, కూర్చున్నా సరైన భంగిమలో ఉండేలా తీర్చిదిద్దుతుంది. దానితో ఒంటి నొప్పులు ద రికి చేరవు.

Saturday, November 2, 2013

అల్పాహారం ........ ఎంత అయితే అంత ఆరోగ్యం...!

అల్పాహారం ........
ఎంత అయితే అంత ఆరోగ్యం...!
అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.

అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.