Thursday, February 6, 2014

క్యారెట్ జ్యూస్ వలన ప్రయోజనాలు:-

క్యారెట్ జ్యూస్ వలన ప్రయోజనాలు:-
*చర్మానికి: ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్‌ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్‌ రసం తోడ్పడుతుంది.
*శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్‌ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. *శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.
* కంటికి కూడా చాల మంచిది. ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ ని సేవించిన ఎడల కళ్ళజోడు తో అవసరమే ఉండదు. కంటికి సంబంధిచిన జబ్బులని ప్రాలదోలుతుంది.

Sunday, February 2, 2014

బరువు తగ్గేందుకు అద్భుత ఔషధం

బరువు తగ్గేందుకు అద్భుత ఔషధం

బరువు పెరగడానికి ప్రధాన కారణం శరీరంలో జీవ(న)క్రియలు సక్రమంగా పని చేయకపోవడమే. శరీరంలో జీవ(న) క్రియలను సక్రమపరిచి స్థూల కాయాన్ని తగ్గించే అపురూప ఔషధం అమృతం స్లిమిన్.

నేటి జీవన పరిస్థితుల్లో బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేస్తే మోకాళ్లు అరిగిపోతున్నాయి. కొత్తగా నొప్పులొస్తున్నాయి. తిండి తగ్గిస్తే శరీరంలో పోషకాలు తగ్గిపోయి ఇతర వ్యాధులు వస్తున్నాయి. 'ఆహా ఏమి రుచి? తినరా మ
ైమరిచి..' అని పాడుకుంటూ జిహ్వచాపల్యంతో లాగించేస్తే వస్తోంది ఒబేసిటి. దీంతో జీవితం భారమైపోతోంది. శరీరం 'లేవలేని అత్తకు వంగలేని కోడలు' అన్నట్టు తయారవుతుంది. అందుకే మీ కోసం... మీసమస్య పరిష్కారం కోసం సూక్ష్మంలో మోక్షంలా.. అమృతం ఆయుర్వేద నిలయం. లావు, బరువు తగ్గడానికి ఓ దివ్యౌషధాన్ని అందిస్తోంది. అదే 'అమృతం స్లిమిన్'!
బరువు పెరగకుండ ఉండాలని అందరికీ ఉన్నా ఎలాంటి జాగ్రత్తలు పాటించరు. ఒకవేళ పెరిగినా దానిని ఎలా తగ్గించుకోవాలో తెలియదు. అతి బరువును ఆయుర్వేద పరంగా స్థూలకాయం అంటారు. ఈ రోగాన్ని ఆయుర్వేదంలో కఫరోగాలలో మొట్టమొదటి రోగంగా చెప్పారు. ఇలాంటిది ఒక స్థాయి దాటిన తరువాత తగ్గడం అసాధ్యం అని కూడా చెప్పారు. అందుకే అసాధ్య స్థాయికి చేరకుండా ముందు జాగ్రత్త పడితే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. స్థూలకాయం అనేది ఒక రోగం దానికి సరైన ఔషధం వాడకుండా ఎన్ని ప్రయాసలు పడ్డా వాకింగ్ చేసినా, డైటింగ్ చేసినా బరువు తగ్గడం సాధ్యపడదు.
బరువు పెరగ డానికి కారణమయ్యే వాటికి దూరంగా ఉండి తగ్గడానికి సక్రమమైన మార్గాలు తెలుసుకుంటేనే సాధ్యపడుతుంది. వ్యాధి ఏదైనా వస్తే దానికి చికిత్స ఏమిటి? అనేది ముందుగా తెలుసుకోవాఇ. అలాకాకుండా ఇది వాడిచూద్దాం. అది వాడి చూద్దాం అని ఏదో ఒకటి వాడుతూ కాలక్షేపం చేస్తే ఆలోపు వ్యాధి ముదిరిపోయి అసాధ్యస్థాయికి చేరిపోతుంది. అప్పుడు ఏ చికిత్సకూ లొంగకుండా పోతుంది. నిజంగా స్థూలకాయం లేని వారికి గాలిలో ఎగిరి పోవాలనిపిస్తుంది. ఏ మాత్రం స్థూలకాయం ఉన్నా లేవడానికి సైతం కిందకు చేతులు ఆనిచ్చి నాలుగుకాళ్ల జంతువులా పనిచేస్తుంది.
శరీరం బరువు పెరగడానికి కారణాలు అనేకం
వ్యాయామం చేయకపోవడం, తినే ఆహారం శరీరానికి అనుకూలంగా జీర్ణం కాకపోవడం, శరీరంలో జీవ(న)క్రియలు (మెటబాలిజమ్)సక్రమంగా జరగకపోవడం వల్ల, పోషకాలుగానూ, వ్యర్థాలుగానూ విచ్చిన్నక్రియ జరగదు. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసి పోషకాలను తీసుకుని వ్యర్థాలను వదిలేసే విభజన ప్రక్రియ సక్రమంగా చేయలేకపోవడమే లావు పెరగడానికి ప్రధానకారణం. దీనిని ఆయుర్వేదపరంగా సారభాగం, కిట్ట భాగం సక్రమంగా విచ్ఛిన్నం కాకపోవడం అంటారు.
అతి బరువు వల్ల వచ్చే రోగాలు
ఆయుష్షు క్షీణించుట, ఉత్సాహం తగ్గుట, లైంగిక శక్తి తగ్గుట, సంతానసమస్యలు, శరీరం దుర్గంధం రావడం, అధిక ఆకలి, అధిక దప్పిక, ఆయాసం, అధిక నిద్ర, గురక, స్వరం మారుట, శరీరం ఆకారం మారుట, బీపీ, షుగర్ ఇంకా మరెన్నో...
పరిష్కారాలుబరువు తగ్గడానికి మందులు లేవు అని అందరూ చెప్పవచ్చు. మార్కెట్లో మభ్యపెట్టేవి ఎన్నో ఉండవచ్చు. ఈ ఒక్క నిజం అందరికీ తెలియాలి. బరువు పెరగడం అనేది ఒక వ్యాధి. దీనిని సాధారణ సమస్యగా పరిగణించలేము. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి తప్పనిసరిగా ఒక ఔషధం వాడాలి. అలాంటి ఆహార ఔషధం 'అమృతం స్లిమిన్' చాలా మంది ఆహారం బాగా తింటారు. అదనంగా చిరుతిళ్లు, ఫలహారాలు తింటుంటారు. కాని బరువు పెరగరు. కొంతమంది మాత్రం తక్కువగా తింటారు. ఎలాంటి అదనపు ఆహారాలు తినకపోయినా నెలనెలా బరువు పెరుగుతుంటారు.

కారణం ఏమిటి?

శరీరంలో జీవనక్రియలు సక్రమంగా జరగకపోవడం
కొంతమందికి చిన్న చిన్న జీర్ణసంబంధ సమస్యలు వస్తుంటాయి.

మరికొంతమందికి చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి. మరికొంతమందికి ఆహారం సహించదు. అయినా ఏదోలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి భవిష్యత్తులో పెద్దపెద్ద వ్యాధులకు కారణమవుతుంటాయి. చిన్న సమస్యగా ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

ఆయుర్వేదంపై అపోహలు

ఆయుర్వేద ఔషధం అనగానే కఠోర ప«థ్యాలు చేయాల్సి ఉంటుందని, వేడి చేస్తుందని అనేక రకాల అపోహ లుంటాయి. కాని అమృతం స్లిమిన్ వాడే వారికి అలాంటి పథ్యాలుండవు. వేడి చేయదు. ఇతర దుష్ఫలితాలుండవు. అంతకన్నా దీనిలో వాడిన ఔషధ మూలికలన్నీ మనం నిత్యం ఉపయోగించుకోగలిగేవే. ప్రతి సంవత్సరం సీజనల్‌గా వచ్చినపుడు సేకరించి ఉపయోగించుకోవాలి. దీనిలోని మూలికలు అలాంటి సమయంలో సేకరించడం వల్ల సత్ఫలితాలొస్తున్నాయి. అయితే వాటిని బరువు తగ్గడానికి అనువైన పద్ధతిలో తయారుచేయడంలోనే దాని ఫలితాలు దాగి ఉన్నాయి. అందుకనే దీనిని మీరు ఒక ఆహారంగా పరిగణించాలి. బరువు పెరగడం ఒక వ్యాధి కనుక రోగానికి తగిన ఔషధం అని చెప్పాల్సి వస్తుంది.

చాలా మంది కొన్ని రకాల ఔషధాలు వాడి తగ్గక ఇక తగ్గదేమో అని నిశ ్చయానికి వచ్చేసి ఇంకేదిలేదు అనుకుంటుంటారు. ఎవరో తిప్పతీగ చూర్ణం వాడితే తగ్గుతారు అని చెప్పి ఉంటారు. అది వాడి తగ్గకపోతే ఆయుర్వేదం ఇంతే అనుకుంటుంటారు. మీరు స్వయంగా సేకరించి కొన్ని రకాల మూలికలతో ఔషధం తయారుచేసుకుని వాడి చూడండి. తప్పకుండా పనిచేస్తుంది.

అన్నింటికన్నా ప్రధానమైనది ఔషధం వాడే విధానం. ఉదాహరణకు మీకు రోజుకు 2700 క్యాలరీలు కావలసి వస్తే ఆ మాత్రం క్యాలరీలు ఇవ్వగల రెండు మాత్రలను తింటే మీకు పనిచేస్తుందా? చేయదు. భోజనం చేస్తేనే తృప్తి. అలాగే బరువు తగ్గాలంటే తగినవి వాడితేనే పనిచేస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం మాత్రం కష్టమవుతుంది. 5 వేల సంవత్సరాలకు పూర్వమే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో చెప్పిన విధానం మాత్రం అందరూ ఒప్పుకునే విధానం. దానినే నేటి ప్రజలకు అనుకూలంగా తయారేచేసి అందిస్తున్నాం. ఒక్కసారి ఉపయోగించి చూడండి. దీనికి మించినది మరొకటి లేదు అని మీరే అంటారు.

ఆహారనియమాలు

కఠోర ఉపవాసాలు అక్కర్లేదు. మూడు పూటలు తినవచ్చు కూడా. బరువును పెంచేవి మాత్రం తినకూడదు.

అమృతం స్లిమిన్ ప్రత్యేకత ఏమిటి?

నేటి జీవనపరిస్థితుల్లో ఆహారం తక్కువ తీసుకున్నా శరీరం లావుగా తయారు కావడానికి జీవనక్రియలు సక్రమంగా జరగకపోవడం ప్రధానకారణం.

శరీరానికి పోషకంగా ఉపయోగపడని ఆహారం తినడం, అలాంటి ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసి శరీరానికి శక్తిగా మార్చకపోవడం వల్ల జీవనక్రియలు సక్రమంగా పనిచేయకపోగా తక్కువ తిన్నా, వ్యాయామం చేసినా బరువు పెరుగుతారు. అలాంటి జీవనక్రియలను సక్రమపరిచే ఒక అపురూప ఔషధం 'అమృతంస్లిమిన్' ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అనవసరమైన మలినాలు బయటకుపంపడం. రోగకరంగా ఉండే వాటిని ఆరోగ్యకరంగా చేయడం చికిత్సలో ప్రధానభాగం. ఈ పని అమృతం స్లిమిన్ చేస్తుంది. అమృతం స్లిమిన్ కావలసినన్ని తయారు చేయగలిగేది కూడా కాదు. కొన్ని అరుదైన మూలికలు సేకరించి తయారుచేస్తుంది. కనుక అన్ని చోట్ల మార్కెట్లో లభించేలా చేయడానికి వీలుపడదు. ఔషధాన్ని సక్రమంగా తయారేచేయడంలోనే దానిలో రోగాన్ని తగ్గించే గుణం దాగి ఉంటుంది. 'అమృతంస్లిమిన్'లో ఉపయోగించిన మూలికలకు ఒక్కో ప్రత్యేక ఔషధ గుణం ఉంది. వాటిని కఫహరంగా పనిచేసేట్టు తయారుచేయడం వల్ల అవి మరింత ఉత్తేజంగా పనిచేసి బరువు తగ్గిస్తుంది. మీరు సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మళ్లీ బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు.
అమృతంస్లిమిన్ ఉపయోగించే విధానం
'అమృతంస్లిమిన్' ఒక సాచెట్ తీసుకుని మరిగించి దించుకున్న అరలీటర్ లేక ఒక లీటర్ వేడినీటిలో వేయాలి. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ నీటిని కొంత కొంత చొప్పున తాగుతుండాలి. నీరు పూర్తిగా అయిపోయేదాకి సాచెట్‌ను అలాగే నీటిలో ఉంచవచ్చు. రుచించలేని వారు కొద్దిగా తేనెను, నిమ్మరసాన్ని, అల్లంరసాన్ని లేదా పుదీనా కలుపుకోవచ్చు. ఈ ఔషధ పానీయాన్నీ ఉదయం లేచిన దగ్గరి నుంచి సాయంత్రం వరకు ఉపయోగించవచ్చు. ఆహారంకు ముందు, తరువాత ఆహారంతో పాటు కూడా తాగవచ్చు. సాయంత్రం మరో సాచెట్‌ను కూడా అలాగే ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి రోజుకు 3 సాచెట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. 'అమృతంస్లిమిన్' వాడటం వల్ల ఇతర దుష్ఫలితాలు ఎండవు. సైడ్ బె నిఫిట్స్ ఉంటాయి. మెయిన్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తాయి.

అమృతంస్లిమిన్ ఉపయోగాలు

- శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.
- పొట్ట బరువుగా లేకుండా తేలికగా తయారవుతుంది.
- శరీరంలోని జీవక్రియలను క్రమపరుస్తుంది. సక్రమంగా పనిచేయిస్తుంది.
- శరీరంలో అనవరసమైన మలినాలను ఉంచకుండా మూత్రం, మలం, స్వేదం ద్వారా బయటకు పంపుతుంది.
- శరీరరంగును ఇనుమడింపచేస్తుంది, మంగును సైతం తొలగిస్తుంది.
- తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా పూర్తిగా జీర్ణం చేసి పోషకాలను, మలినాలను వేరు చేస్తుంది. నోటి దుర్వాసన తొలగిస్తుంది. గురక తగ్గుతుంది.
- రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దానివల్ల గుండె జబ్బుల బారి నుంచి రక్షణ లభిస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
- చర్మం ముడతలు తగ్గిపోతాయి. వేలాడుతున్నట్లున్నది తగ్గుతుంది.
- ఏ వ్యాధితో బాధపడుతున్నా దీనిని ఉపయోగించవచ్చు.
- ఇతర ఔషధాలు వాడుతున్నా 'అమృతంస్లిమిన్' ఉపయోగించవచ్చు.
- శరీర బరువు వారి శరీరతత్వమును అనుసరించి 90 రోజుల్లో 5 నుంచి 12 కేజీల బరువు వర కు తగ్గవచ్చు.
ఇప్పటికే వాడిన వారి అనుభవాలు
బరువుగా ఉన్నవారు శరీరాన్ని మోస్తున్నట్లు అనుభూతి ఉండేది. అమృతంస్లిమిన్ వాడిన తరువాత ముందుగా చెప్పిన మాట శరీరం తేలికయిందని. మోస్తున్నట్లు అనుభూతి లేదని అంటున్నారు. సక్రమంగా వాడిన వారిలో నెలరోజుల్లోనే 3 నుంచి 4 కేజీల బరువు తగ్గిందంటున్నారు. ఇది సుమారు 600-700 మంది చెప్పిన మాట. వేలాడుతున్నట్లుగా శరీరం కొంత కొంతగా పటిష్టంగా తయారవుతోందని అంటున్నారు. ఇంకేం కావాలి. నిజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఔషధం లేదని ఘంటాపదంగా చెప్పవచ్చు.

Monday, January 27, 2014

కంటి కింది చారలకు కీర....!


చిన్న వయసులోనే కళ్ల కింద నల్లచారలొస్తే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తొలిదశలోనే గుర్తించి ఇంటివైద్యాన్ని చేసుకుంటే తగ్గుముఖం పడతాయి.
- మార్కెట్‌లో నిత్యం మనకందరికీ అందుబాటులో ఉండేవి కీరా దోసకాయలు. తాజా కీర దోసను తీసుకుని అప్పటికప్పుడు ముక్కలుగా కోసి కాసేపు కళ్ల మీద ఉంచుకోవాలి.
- కీర దోస రసాన్ని కళ్ల కింది నల్లచారలకు పట్టించి.. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఉపశమనం లభిస్తుంది.
- దోసరసంలో బంగాళదుంప రసాన్ని కలిపి ఇలాగే చేయొచ్చు. దీనివల్ల కూడా నల్లచారల సమస్య తగ్గుతుంది.
- నల్లచారలకు మరింత మంచి ఫలితాన్ని అందించే జ్యూస్‌లలో టొమాటో జ్యూస్ ఒకటి. టొమాటోలోని ఔషధగుణాలు శరీరం మీదున్న నల్లమచ్చల్ని తొలగించేందుకు సహాయపడతాయి. ఈ జ్యూస్‌తో మర్దన చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలకు నీటితో శుభ్రం చేసుకోవాలి.
- టీ బ్యాగ్స్‌తో కూడా కొంత వరకు ఉపశమనం పొందొచ్చు. చల్లటి నీటిలో టీ బ్యాగ్స్‌ను ముంచి, కళ్ల కింద కాసేపు ఉంచితే మంచిది.
- మార్కెట్‌లో దొరికే ఆల్మండ్ ఆయిల్ చక్కటి ఔషధం. జుట్టుకు మాత్రమే కాదు. కళ్ల కింద నలుపు చారల్ని వదిలించుకునేందుకు ఈ నూనెను వాడుకోవచ్చు.
- ఆరెంజ్ జ్యూస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ జ్యూస్‌లో కాస్త గ్లిజరిన్ కలిపి వారానికి మూడుసార్లు రాసుకుంటే ఊహించని ఫలితం వస్తుంది.
ఇవన్నీ చేస్తూనే మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, కంటినిండా నిద్రపోవడం, సమతులాహారాన్ని తీసుకోవడంతో పాటు వీలైనన్ని మంచినీళ్లను తాగితే కళ్ల చారల సమస్య నుంచి బయట పడవచ్చు అంటున్నారు నిపుణులు.

Friday, January 24, 2014

‘త్రిఫలచూర్ణం’


కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను కలిసి ‘త్రిఫలాలు’ అంటారు. వాటిని ఎండబెట్టి, విడివిడిగా పొడిచేసి, సమానంగా కలుపుకుంటే చక్కటి ‘త్రిఫలచూర్ణం’ తయారవుతుంది.
ఇలా చేయండి.. కళ్లు ఎంత రిలాక్స్ అవుతాయో.. సైట్ ఎలా తగ్గుతుందో మీరే చూడండి!!
చిన్న ఏజ్‌లోనే భూతద్ధాల్లాంటి కళ్లజోడ్లు వాడాల్సిన పరిస్థితి చాలామందికి ఏర్పడుతోంది... ముఖ్యంగా ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్‌లూ గంటల తరబడి వాడేసేయడం, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహారం లోపించడం వంటి కారణాల వల్ల దాదాపు అన్ని వయస్సుల వారూ ఎంతోకొంత దృష్టి సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు.
మనం చాలా తక్కువ పట్టించుకునేది eyes. కారణం అవి ఎప్పుడూ ప్లాబ్లెం రావు, చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లు వచ్చినా ఏ జెంటామైసిన్ వంటి dropsనో కళ్లల్లో వేసుకుంటే తగ్గిపోతాయన్న నమ్మకం కొద్దీ వాటి పట్ల శ్రద్ధ పెట్టనే పెట్టం.

సరైన పోషణ లేకపోయినా చాలా ఎక్కువ రోజులు మనకు కోపరేట్ చేసే విజన్ ఒక్కసారి తగ్గడం మొదలెడితే దాన్ని ఆపడం చాలా కష్టం, ఎంత కళ్లజోడు పవర్ పెంచుకుంటూ పోయినా..
సో, భారతీయులకు ప్రాచీనకాలం నుండి కళ్ల విషయంలో వస్తున్న ఓ అద్భుతమైన సొల్యూషన్ త్రిఫల పౌడర్‌తో కళ్లని bath చేయించడం.
చేయాల్సింది ఇలా..
త్రిఫల పౌడర్ ప్రతీ ఆయుర్వేదిక్ స్టోర్‌లో లభిస్తుంది.. ప్రతీ రోజూ ఉదయం పూట దీన్ని ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అర టీస్పీన్ పౌడర్‌ని ఓ కప్ వాటర్‌లో వేసి గోరువెచ్చగా boil చేసి నైట్ వరకూ అలాగే ఉంచాలి. నైట్ పడుకోబోయే ముందు దాన్ని వడగట్టి రెండు కాటన్ ముక్కలు తీసుకుని ఆ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకుని కళ్లల్లోకి త్రిఫల వాటర్ వెళ్లే విధంగా కాటన్ ని వేళ్లతో ప్రెస్ చేస్తుండాలి. కాసేపటికి కళ్లు డ్రై అవగానే మళ్లీ కాటన్ ప్రెస్ చేస్తే మరికొన్ని చుక్కలు కాటన్ నుండి కళ్లల్లో పడతాయి.
ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత ఓ 20-25 నిముషాలు టివి గానీ, మోనిటర్ గానీ, ఫోన్ స్క్రీన్ గానీ చూడకండి. అందుకే పడుకోబోయే ముందు ఇలా చేస్తే ఇంకా బెటర్.
లాభాలివి: త్రిఫల bath వల్ల కంటి నరాలు బలపడతాయి. విజన్ మెరుగుపడుతుంది, వయస్సుతో పాటు దృష్టి తగ్గడం అన్న సమస్యలే రావు. పెద్ద వాళ్లకైతే కేటరాక్ట్ వంటి సమస్యలూ తొలగిపోతాయి.
ఇలా ఓ 4-5 రోజులు ఫాలో అయ్యాక స్వయంగా మీకే తేడా తెలుస్తుంది, నమ్మకం వస్తుంది. . సో కావాలంటే ట్రై చేయండి. త్రిఫల వాటర్ తాగడం వల్ల వేరే ఉపయోగాలూ ఉన్నాయి
నల్లమోతు శ్రీధర్

Sunday, January 19, 2014

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్ పౌష్టికాహార లోపం, కాలుష్యాలు దాడి చేయడం వల్ల, షాంపూలు, తలకు వేసుకునే రంగులతో రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల జుట్టు ఊడగొట్టుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. మరి దీన్ని ఆపడం ఎలా? అది మీ చేతుల్లోనే ఉంది. అందుకు బెస్ట్ మెడిసిన్ కూరల్లో వాడే కరివేపాకు. అదెలాగంటే...
పొడవు, మందం బట్టి జుట్టుకు సరిపడా కరివేపాకులు తీసుకుని మెత్తగా రుబ్బాలి. ఇందులో నానబెట్టిన మెంతుల్ని ఆ నీళ్లతో సహా కలపొచ్చు. ఈ పేస్ట్‌ను మాడుకు రాసుకుని రెండు గంటల పాటు ఉంచుకోవాలి. రాసుకున్న మిశ్రమం త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకోవాలి. జుట్టు జిడ్డుగా అతుక్కున్నట్టు ఉంటుంది గాని ఆరిన తరువాత బాగానే ఉంటుంది. ఒకవేళ మరీ జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తే మైల్డ్ షాంపూ వాడొచ్చు.
జుట్టు ఆరిన తరువాత దువ్వితే జుట్టుకు కరివేపాకులేమైనా ఉంటే వచ్చేస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి జుట్టుకు వేసుకుంటే పట్టుకుచ్చులా మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం. అంతేకాదు ఎక్కువ జుట్టు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది.

Sunday, January 12, 2014

ఔషధమూలిక గోరింటాకు

గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.
గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.
ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.

Saturday, January 11, 2014

పల్లీల్లో పోషకాలు ఫుల్‌


పల్లీలంటే ఇష్టంగా తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందరికీ ఇష్టమైన పల్లీల్లో బోలెడన్ని పోషకాలున్నాయి. రుచిలో వీటికి సాటి లేదనే చెప్పవచ్చు. చక్కటి రుచితో పచ్చడి, పొడి ఇలా ఏ రూపంలోనైనా పల్లీ టేస్టే వేరు. పోషకాల సంగతి పక్కనపెడితే ఇందులో అధికంగా ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని మంచి పోషకాలుగా అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్‌ కారకాలు పేరుకోకుండా క్యాన్సర్లను అదుపులో ఉంచుతాయి.
పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్‌ అనే పాలిఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసే శక్తిని కలిగివుంటుంది. ప్రతి వందగ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చర్మానికి హానికలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీల్లో రెబోఫ్లేవిన్‌, నియాసిన్‌, థయామిన్‌, విటమిన్‌ బి6, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్‌ను పల్లీలే అందిస్తాయి. కాబట్టి పల్లీలో ఫుల్లుగా పోషకాలు ఉన్నాయని తెలిసిందికదా... చక్కగా మీరూ, మీ పిల్లలూ రోజుకు ఓ గుప్పెడు పల్లీలు తినడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.