Wednesday, August 12, 2015

ఆరోగ్యఫలం.

పీచూ విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే ఖర్జూరపండ్లను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల పొట్ట, కాలేయ, మూత్రనాళ, క్లోమ, అండాశయ క్యాన్సర్లు రావనీ వచ్చినా వాటిని నివారించే శక్తి కూడా వీటికి ఉందనీ తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఖర్జూరంను పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తక్షణ ఉపశమనం పొందవచ్చు.అంతే కాదు, ఇందలో న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది పీరియడ్స్ లోపాలను తగ్గించడానికిఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
* వారానికి మూడుసార్లు ఖర్జూరాలను తింటే మలబద్ధకం తగ్గుతుందట.
* ఎడారిఫలాల్లో సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం... వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
* ఖర్జూరాల్లోని నికోటిన్ పేగుకు సంబంధించిన వ్యాధుల్ని రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బ్యాక్టీరియా పెరిగేలానూ చేస్తాయివి. ఇందులోని అమైనో ఆమ్లాలు జీర్ణక్రియకూ దోహదపడతాయి.
* ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, రక్తహీనతనీ నివారిస్తాయి. తద్వారా అలసటనీ నీరసాన్నీ తగ్గిస్తాయి.
* ఖర్జూరాల్లో సల్ఫర్ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలూ, సైనస్‌లతో బాధపడేవాళ్లకి ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు.
* ఖర్జూరాల్లో చక్కెరలూ, ప్రొటీన్లూ, విటమిన్లూ సమృద్ధిగా ఉండటంవల్ల బరువు తక్కువగా ఉండేవాళ్లకు పుష్ఠినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి సుమారుగా 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి.
* ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరుని ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకే వయసురీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి మంచి ఆహారం.
* గుండె పనితీరునీ మెరుగుపరుస్తాయివి. ముఖ్యంగా గుండె బలహీనంగా ఉన్నవాళ్లు రాత్రిపూట ఎండుఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్టులా చేసుకుని తినడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృద్రోగాలు రాకుండా చేస్తాయి.
* ఖర్జూరాలు లైంగికశక్తికీ తోడ్పడతాయి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకులపొడి జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు.
* దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడేవాళ్లు ఖర్జూరపండ్లు తింటే, వాటిల్లోని పొటాషియంవల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
* దంతాలమీద ఉండే ఎనామిల్ పూతను సంరక్షించడంలో ఖర్జూరాల్ని మించినవి లేవు. నిజానికి ఈ ఎనామిల్ ఎముకకన్నా దృఢమైన హైడ్రాక్సీఎపటైట్స్ అనే పదార్థాలతో రూపొందుతుంది. అయినప్పటికీ ఆహారంలోని బ్యాక్టీరియా కారణంగా అది కొంచెంకొంచెంగా పోతుంటుంది. అదే ఖర్జూరాల్ని ప్రతిరోజూ తినడంవల్ల అందులోని ఫ్లోరిన్ దంతాలమీద పాచి చేరకుండా చూడటంతోబాటు ఎనామిల్‌తో చర్యపొంది హైడ్రాక్సీఫ్లోరోఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.
* రోజుకో ఖర్జూరం తినడం కళ్లకీ మంచిదే. ఇందులో పుష్కలంగా ఉండే ఎ-విటమిన్ రేచీకటినీ నివారిస్తుంది.
* గర్భిణుల ఆరోగ్యానికి ఎడారిఫలాలు ఎంతో మేలు. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచించేలా చేయడంతోబాటు, బిడ్డపుట్టాక పాలు పడేందుకూ కారణమవుతాయి. గర్భస్థశిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకూ సాయపడతాయి.
* వీటిల్లో ఉండే ఫ్లేవొనాయిడ్ పాలీఫినాలిక్ యాంటీఆక్సిడెంట్లు టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లూ పొట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి. కొత్తిమీర జ్యూస్ హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహఆయపడుతుంది. అలాగే, పీరియడ్స్ లో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

Thursday, August 6, 2015

రాగులతో మేలైన ఆరోగ్యం...!

తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావా ఉంటే శరీరానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. రాగులను మన మెనూలో చేర్చడం ద్వారా ఈ లాభాలు పొందవచ్చు.
రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి.
రాగి జావని డైట్‌లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. శరీరంలో సత్తువ పెంచుతుంది. ప్రతి రోజూ రాగి డైట్‌ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు.
రాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.
బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉంటుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కూడా రాగులు కంట్రోల్‌ చేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో రాగులది ప్రధాన పాత్ర.
రాగుల్లోని అమినోఆమ్లాల వల్ల శరీరంలోని కొవ్వుపదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి హానిచేసే చెడు కొలెసా్ట్రల్‌ను రాగులు పోగొడతాయి. హైపర్‌ టెన్షన్‌, బ్లడ్‌ప్రెషర్‌ని రాగులు చక్కగా నియంత్రిస్తాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్‌, అమినో యాసిడ్స్‌ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రేన్‌ తలనొప్పిలాంటివి దరికి చేరవు. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది.
కాల్షియంతో పాటు ఐరన్‌, నియాసిన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌తో పాటు ముఖ్యమైన అమినోయాసిడ్స్‌ ఉంటాయి. అందుకే రాగులతో చేసిన ఆహారం తినటం వల్ల కండరాలు గట్టిగా ఉంటాయి.
రాగుల్లో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.
వేసవి కాలంలో చలువ చేసే రాగిమాల్ట్‌ మిగతాకాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ్ట్ట