Wednesday, December 11, 2013

బలాన్ని ఇచ్చే బాదం

బలాన్ని ఇచ్చే బాదం బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం. ఎలా వాడితే మంచిది?
వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.
బాదంపాలు: బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.
మంచి టానిక్‌: బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.
కొన్ని సూచనలు: ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.

Friday, December 6, 2013

యోగాతో లాభాలెన్నో...

యోగాతో లాభాలెన్నో... యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్నకొద్దీ శరీరం తేలికవుతుంది, ఆలోచనలు దారికి వస్తాయి, జీవనశైలిలో మంచి మార్పొస్తుంది. యోగా వల్ల కలిగే ముఖ్యమైన తొమ్మిది లాభాలు ఇవే...
ఆల్‌రౌండ్ ఫిట్‌నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతౌల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారనే దే ఆరోగ్యానికి కొలమానం.
ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం - ఇవన్నీ కలిసి ఒక ప్యాకేజ్‌గా దానికి దోహదపడతాయి.
బరువు తగ్గడం : దరికీ కావాల్సిందిదే. సూర్యనమస్కారాలు, కపాలభాతి ప్రాణాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా యోగా చేసేటపుడు మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఒత్తిడి నివారణ : ఉదయాన్నే కొద్దిసేపు యోగా చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. శరీరంలోని మలినాలను వదిలించడంతో పాటు మనస్సు పరిశుభ్రంగా ఉండటానికి యోగా ఉపయోగపడుతుంది.
ప్రశాంతత : ప్రకృతిలోని ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశాలంటే మన అందరికీ ఇష్టమే. కాని ప్రశాంతత కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు, అది మనలోనే ఉంటుంది. రోజుకోసారి లోపలికి ప్రయాణించి దాన్ని అనుభూతి చెందవచ్చు. అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కుదుటపరచడానికి యోగాను మించిన సాధనమేదీ లేనేలేదు.
రోగనిరోధక శక్తి : శరీరం, మనసు, మేథ - అన్నీ కలిస్తేనే ఆరోగ్యం. యోగా అవయవాలకు సరిపడా శక్తినిస్తుంది, కండరాలను దృఢం చేస్తుంది. శ్వాస టెక్నిక్‌లు, ధ్యానం ద్వారా స్ట్రెస్ తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అవగాహన : మన ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. గతం, భవిష్యత్తులకు సంబంధించిన అనేక అంశాలతో అది పరుగులు పెడుతూ ఉంటుందేగాని వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. యోగ, ప్రాణాయామాల వల్ల ఈ సత్యం అవగాహనలోకి వస్తుంది. దాంతో ఆలోచనలను నియంత్రించడం సులువు అవుతుంది. అప్పుడే వర్తమానం మీద ఫోకస్ చెయ్యగలుగుతాం.
మెరుగైన సంబంధాలు : జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు - ఇలా చుట్టూ ఉన్న అన్ని బంధాలనూ మెరుగు చెయ్యడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రశాంతమైన మనసు, అదుపులో ఉండే భావోద్వేగాల వల్ల ప్రేమ, అనుబంధాలు దృఢమవుతాయి.
ఎక్కువ శక్తి : ఒకేసారి నాలుగు రకాల పనులు చెయ్యడంతో రోజంతా పనిచేసిన తర్వాత పూర్తిగా అలసిపోయి, శక్తినెవరో లాగేసినట్టు అయిపోతారు చాలామంది. కొద్దిసేపు యోగా చేస్తే మళ్లీ తాజాగా, ఉత్సాహంగా ఉంటారు.
ఫ్లెక్సిబిలిటీ : ఉరుకులుపరుగులు నిండిన జీవనశైలి వల్ల చిన్నాపెద్దా అందరికీ సాయంత్రానికల్లా ఒంటి నొప్పులు సాధారణమైపోయాయి. యోగా కండరాలను బలోపేతం చేసి టోన్ చేస్తుంది. నడిచినా, నిలబడినా, కూర్చున్నా సరైన భంగిమలో ఉండేలా తీర్చిదిద్దుతుంది. దానితో ఒంటి నొప్పులు ద రికి చేరవు.

Saturday, November 2, 2013

అల్పాహారం ........ ఎంత అయితే అంత ఆరోగ్యం...!

అల్పాహారం ........
ఎంత అయితే అంత ఆరోగ్యం...!
అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.

అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.

Tuesday, October 15, 2013

Drs Chandu

మన చర్మం రంగు అనేక కారణాల వల్ల తన సహజత్వాన్ని కోల్పోతుంది ఈ చర్మపు రంగు మారడానికి గల కొన్ని కారణాలు ... చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు., ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి కొన్ని చిట్కాలు #

1) కేరెట్ గుజ్జును, ముల్తానా మట్టితో (ఫుల్లర్ మట్టి) కలిపి ఒక చిక్కటి గుజ్జుగా తయారు చేయండి. ఒక విటమిన్ సి బిళ్ళను పొడి చేసి కలపండి. మీ ముఖం పైన పూసి, కడగడానికి ముందు ఇరవై నిముషాల పాటు ఉంచండి. ఇలా ప్రతి వారం చేయండి.
2) 4 టీ స్పూనుల పాల పిండిని తీసుకొని, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కలిపి పేస్ట్ లా చేయండి. దీనికి గ్లిసరిన్ కలిపి చర్మం రంగు మారిన ప్రదేశాలలో పూయండి. దీనిని 15-20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరిన్ ఔషధాల దుకాణాల్లో సులువుగా లభ్యమౌతాయి.
3) ఒక బంగాళదుంపను తోలు తీసి కొన్ని చుక్కల నీటిని దాని పైన వేయండి. చర్మం పైన మచ్చలుగా ఉన్న ప్రాంతంలో రుద్దండి. బంగాళదుంప రసం చర్మం పై ఉన్న మచ్చల రంగును తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
4) ఓట్ మీల్ పొడిని, పెరుగుతో కలిపి కొన్ని చుక్కల నిమ్మరసం, టమోటా రసం కూడా కలపండి. ఆశించిన ఫలితాలను సాధించడానికి వారానికొకసారి దీనిని ప్రభావిత ప్రాంతాలలో పూయండి.
5) తులసి ఆకులను, నిమ్మరసంతో కలిపి చర్మం రంగులోని మచ్చలను తగ్గించడానికి ప్రభావితప్రాంతాలలో పూయండి.
6) ఆలివ్ ఆయిల్ లో కలిపిన పంచదారతో మీ శరీర౦ పై రుద్దండి. పంచదార పూర్తిగా కరిగే దాక రుద్దాలి. దీన్ని మీ చేతులు, కాళ్ళు, మెడ, శరీరంలోని ఇతర ప్రభావిత ప్రాంతాలలో వాడవచ్చు.
7) నిమ్మరసం, తేనే, బాదం నూనె ప్రతీదీ ఒక టీ స్పూన్ తీసుకోండి. సహజసిద్ధమైన మెరిసే చర్మం కోసం దీనిని మీ ముఖంపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయండి.
తగినన్ని మంచి నీళ్ళు తాగడం వలన మీ శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. తద్వారా అన్ని చర్మ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది
9) పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స.
10) మజ్జిగతో మొహాన్ని కడగడం వలన కూడా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు.

Drs Chandu

సున్ని పిండి తయారు చేసుకునే పద్ధతి
 సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం.
శనగపిండి, పెసరపిండి వీటికి తోడు కచ్చూరాలని బజారులో దొరుకుతాయి వాటిని కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడి కాని, కుంకుడు కాయ పొడి కాని కలిపివాడుకోవచ్చు.
దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.
సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో తల రుద్దు కుంటే జిడ్డు తొందరగా వదులుతుంది.
తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత స్నానం చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది.
మట్టి శరీరం మీద చెమటతో కలిసి నల్లగా పేతుకుపోతుంది, ఇది పోవాలంటే, సబ్బు వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు. మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి శుభ్రపరచు కోవటం కష్టం , అందుకు వారు నూనె రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు సౌందర్యానికి సౌందర్యం
!

Drs Chandu మెంతి ఔషధ గుణాలు #

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు.
మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
మెంతి ఆకుల ఔషధ గుణాలు #
*‌ ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
*‌ పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
*‌ కామెర్ల వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)
*‌ ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
*‌ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
*‌ ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
*‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.

మెంతి గింజలు #
*‌ రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
*‌ నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
*‌ కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
*‌ పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
*‌ మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
*‌ మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
*‌ మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.

100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు #
పిండిపదార్థాలు 44.1 శాతంప్రోటీన్లు 26.2 శాతంకొవ్వు పదార్థాలు 5.8 శాతంఖనిజ లవణాలు 3 శాతంపీచు పదార్థం 7.2 శాతంతేమ 13.7 శాతం
కాల్షియం, పాస్పరస్‌, కెరోటిన్‌, థయమిన్‌, నియాసిన్‌ కూడా ఉంటాయి. అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. మెంతి ఆకుల్లో ఏ విటమిన్‌ అధికంగా ఉంటుంది.
100 గ్రాముల ఆకుల్లో పోషక విలువలు #
పిండి పదార్థాలు 60 శాతంప్రోటీన్లు 4.4 శాతంకొవ్వు పదార్థాలు 1 శాతంఖనిజ లవణాలు 1.5 శాతంపీచు పదార్థం 1.2 శాతం
మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి.

Drs Chandu ఆకుకూరలతో కలిగే మేలు

ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.
ఆకుకూరలు పిల్లలకు విరేచనాలు కలిగిస్తాయనేది కొందరి అపోహ. ఈ కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలను ఆకుకూరల నుంచి దూరం చేస్తారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. నేల, నీరు ద్వార ఆకుకూరలను సూక్ష్మక్రిములు (బాక్టీరియా), కీటకాలు కలుషితం చేస్తాయి. వీటిని శుభ్రం చేయకుండా వినియోగిస్తే విరేచనాలు కలుగుతాయి. కనుక వినియోగించడానికి ముందు ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వినియోగించినట్లయితే ఎలాంటి రుగ్మతలు రాకుండా నివారించవచ్చు.
వండిన ఆకుకూరలను శిశువులకు తినిపించే ముందు వాటిలో పీచు పదార్ధం లేకుండా జాగ్రత్తపడాలి. ఆకుకూరలను వండిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి వడపోయడం ద్వారా పీచు పదార్ధాన్ని తొలగించవచ్చు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలోకానీ ఎక్కువసేపుగాని వండితే ఆకుకూరల్లోని పోషకాలు నశిస్తాయి. వండిన తర్వాత మిగిలే నీటిని పారేయరాదు. ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి. ఆకుకూరలను ఎండలో ఎండబెట్టరాదు. అలాచేస్తే అందులోని కెరోటిన్ అనే పోషకం నశిస్తుంది. ఆకుకూరలను నూనెలో వేపుడు చేయరాదు.
ఆకుకూరలు పోషకాల పరంగా అత్యంత శ్రేష్టమైనవి.అందరికి అవసరమైనవి.
ఆకుకూరల పెంపకాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి.తద్వారా ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి.పెరటి తోట,ఇంటి డాబా పైన,పాఠశాలలోని తోట,ఆవరణ లాంటి ప్రదేశాలు ఆకుకూరల పెంపకానికి అనువైనవి.మునగ చెట్టు,అవిసె చెట్టు లాంటి వాటిని ఇంటి పెరట్లో నాటి పెంచినట్లయితే, వాటినుంచి ఆకులను సేకరించడం సులువుగా ఉంటుంది.

Thursday, September 26, 2013

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.
ఉసిరితో ఎంతో మేలు :
ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ
సమస్యలను తొలిగిస్తుంది.
ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధితఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Sunday, September 22, 2013

'పండ్లు తినండి. ఆరోగ్యంగా జీవించండి'

కొందరికి భోజనం చేస్తూనే పండ్లు తినడం అలవాటు. ఇది మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. కడుపు నిండుగా ఉన్నప్పుడు పండ్లు తింటే, అందులోని పోషకవిలువలు శరీరానికి సరిగా అందవు. త్వరగా జీర్ణం కావు. అందుకే, భోజనానికి కనీసం గంట ముందు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అప్పుడు పండ్లలోని పోషక విలువలు పూర్తీగా శరీరానికి అందుతాయి. ఒకవేళ భోజనం చేశాక పండ్లు తినాలనిపిస్తే.. రెండు గంటలు విరామం ఉండేలా చూసుకోవాలి.
పొద్దున్నే లేస్తూనే గ్లాసు మంచినీళ్లు తాగాక పండ్లు తింటే ఇంకా ఉత్తమం. దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మరింత మెరుగుపడుతుంది. మరికొందరు రకరకాల పండ్ల ముక్కల్ని సలాడ్‌లాగ కలుపుకు తింటుంటారు.
జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్లు, మధుమేహులు ఇలా చేయకపోవడమే మంచిది. ఇలాంటి సమస్యలేవీ లేకపోతే పండ్ల ముక్కల మీద కాస్త ఉప్పు చల్లుకుని తినొచ్చు.
ఒక మనిషి వారంలో ఏ రకమైన పండ్లు తినాలన్న సంగతికొస్తే - నాలుగు రోజుల్లో మూడు అరటి పండ్లు, వారానికి ఒకసారి ఆపిల్, రెండు రోజులకు ఒకసారి సపోటా, బత్తాయి, బొప్పాయి తినవచ్చు. ఏ సీజన్‌లో దొరికే పండును ఆ సీజన్‌లో తింటే బావుంటుంది. వీటితోపాటు మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు వీలైనంత వరకు పండ్లు తగ్గించడం మేలు.

Thursday, September 19, 2013

ఆలుతో ఆరోగ్యం

ఆలు తినేందుకు ఐదు కారణాలు...
- ఆలు అధిక పోషకాల్ని కలిగి ఉండడమే కాకుండా. సహజ శక్తిని అందిస్తుంది. సంక్లిష్ట కార్బొహైడ్రేట్‌ల (స్టార్చ్)ని అధికంగా కలిగి ఉంటుంది. ఆలులో తేలికగా శోషణమయ్యే కార్బొహైడ్రేట్‌లు ఉంటాయి. ఒకే బరువు ఉన్న బ్రెడ్‌తో పోలిస్తే ఆలూలో కార్బొహైడ్రేట్ రెండింతలు తక్కువగా ఉంటుంది. మినరల్స్, బి గ్రూప్ విటమిన్లు, బీటాకెరోటిన్, విటమిన్-సిలతో పాటు నాణ్యమైన ప్రొటీన్లతో నిండి ఉంటుంది ఆలు. ఇందులో ప్రొటీన్ ఏడు శాతం ఉండడమే కాకుండా ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరం తనంతట తానుగా తయారుచేసుకోలేనివి.
- ఆలూని ఉడికించిన పద్ధతి బట్టే కొవ్వు తయారవుతుంది. ఆలూని నూనెలో వేగించినపుడు, గ్రేవీల్లో వేసి ఉడికించినపుడు లేదా వెన్న, మీగడ వంటి వాటితో కలిపినప్పుడు మాత్రమే కొవ్వు పదార్థాల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఆలూని విడిగా ఉడికించుకుని తింటే కొవ్వు ఊసే ఉండదు.
- ఆలూ తినడం వల్ల హైపర్‌టెన్షన్ (అధిక రక్త పీడన సమస్యల్ని) తగ్గుతుంది. అరటిపండ్లతో పోలిస్తే ఆలూలో పొటాషియం మెండుగా ఉంటుంది. సోడియం చాలా తక్కువ ఉంటుంది. బ్రెడ్, అన్నంలతో పోలిస్తే ఆలూలో రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే గుణం చాలా తక్కువ. అందుకని మధుమేహులు కూడా ఆలూని చక్కగా లాగించేయొచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలూని తినాలనుకున్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో తక్కువ కాలరీలు ఉండే ఇతర పదార్థాలు చూసుకోవాలి.
- పచ్చి బంగాళాదుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి. ఈ రసం తాగితే జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తవు. అజీర్ణం, అల్సర్లు, కాలేయ సంబంధిత వ్యాధులు, మూత్రాశయంలో రాళ్లు, మల బద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఆలు మంచి యాంటాసిడ్‌గా పనిచేస్తుంది.
- విటమిన్ సి, బి6, ఐరన్, విటమిన్ల ప్యాకేజి ఆలు. ఇందులో యాంటాక్సిడెంట్‌లు కూడా బాగానే ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను మరమ్మత్తు చేయడమే కాకుండా నాశనం కాకుండా కాపాడతాయి కూడా'' అని చెప్పారు ఇషి.
ఆరోగ్యంగా తినేందుకు
ఆరోగ్యకరమైన పద్ధతిలో ఆలుని ఎలా తినాలి... అని ఆలోచిస్తున్నారా. అందుకు కొన్ని సూచనలు చేశారు న్యూట్రిషనిస్ట్ రాఖీ.
-ఆలుని నూనె, వెన్నల్లో వేసి లేదా వేరే కూరలతో కలిపి వండుకుని తినడాన్ని మానేయండి. నీళ్లలో లేదా ఆవిరికి ఉడికించో లేదా గ్రిల్, రోస్ట్, బేక్ చేసి తినండి.
- కారంకారంగా తినడాన్ని ఇష్టపడే వాళ్లు ఆలుని మొదట మసాలా దినుసులతో కలిపి నూనె వేయకుండా వేగించి తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుని తినొచ్చు.
- ఆలూని తొక్క తీయకుండా తినాలి. ఎందుకంటే తొక్కలో పీచు, ఫ్లేవనాయిడ్స్, ఇతర పోషకాలు ఉంటాయి. ఆలూ పైన టాపింగ్‌కి వాడే పదార్థాల్లో కొవ్వు, ఉప్పు, కాలరీలు తక్కువగా ఉండాలి. చిప్స్, ఫింగర్స్ వెంట పడడం ఆపేసి ఆమె చెప్పిన పద్ధతిలో ఆలు తిని ఆరోగ్యంగా ఉండండి.

కరివేపాకు

కరివేప లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేప లేకపోతే రుచే రాదు. అయితే కరివేప వల్ల వంటకాలకు రుచి, సువాసన మించి దానివల్ల ఉపయోగాలు లేవనుకుంటే అది పొరపాటు. కరివేపలో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. అవి మనకెంతవరకు తెలుసో ఒకసారి చెక్ చేసుకుందాం.
1. కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయని తెలుసు.
2.కరివేప, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
3.బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుందని తెలుసు.
4.కరివేపను మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగానూ మానుతాయని చదివారు.
5.ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేప, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
6.కరివేప రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని చదువుకున్నారు.
7.నీళ్లవిరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయని తెలుసు.
8.తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుందని తెలుసు.
9.మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేప రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటూంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని తెలుసు

Monday, September 9, 2013

దంత సమస్యలు



దంత సమస్యలు రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి నిరంతరం ప్రభావితమవుతుంటా యి. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు నోటి ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడతాయి. అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవలసింది... తినే ఆహారం గురించే! పంటికి అతుక్కుపోయే అహారపదార్థాలు.. అంటే తీపి పదార్థాలైన చాక్లెట్లు, స్వీట్లు, బేకరీలలో ఎక్కువగా దొరికే ఆహారం ఎంతో ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సులభంగా నోట్లో మిగిలిపోకుండా పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా నేరుగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. మధ్య అందరూ ఎక్కువగా తీసుకుంటున్న జంక్ఫుడ్ పంటిపైన, పంటి సందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. దాంతోనే అన్నిరకాల దంత సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక రెండవ విషయం... మన ఇంట్లో రోజువారీ శుభ్రత... మనం రోజూ చేసే బ్రషింగ్ గురించి. ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు. కొంతమంది అతిజాగ్రత్తకు పోయి పళ్లని 15 - 3 0 నిమిషాలపాటు తోమేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. రోజూ నిద్రలేవగానే, తర్వాత పడుకునే ముందు రెండుసార్లు కేవలం నాలుగు నిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగని పళ్లని అడ్డదిడ్డంగా తోమేయడం, బలంగా రుద్దడం సరికాదు. ఖరీదైన పేస్టు, చిత్రమైన బ్రష్ మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టిపెడుతూ శాస్త్రీయపద్ధతిలో వీలైతే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్ల మధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి. టూత్పిక్స్, పిన్నులు లాంటి వాటితో కెలక్కూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటుగా మౌత్వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కనీసం రోజుకొక్కసారి వాడాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి ఇంటిల్లిపాదీ డెంటిస్ట్ను కలిసి చెకప్ చేయించుకోవటం, డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకోవడం అవసరం. రెగ్యులర్గా చేసుకునే పంటి క్లీనింగ్ (స్కేలింగ్), పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను అరవై శాతం వరకు నివారించవచ్చు.

Thursday, September 5, 2013

కొలెస్ట్రాల్ ముప్పునకు చెక్ ....!



గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ప్రధాన కారణం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదమున్న సమస్యను చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చే సుకోవచ్చు. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. మాంసాహారం తక్కువగా తినాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారం బదులుగా చేపలు తీసుకోవచ్చు. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి. కొలెస్ట్రాల్ ముప్పును తప్పించుకోవాలంటే క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలో ఉంది, కొలెస్ట్రాల్ వల్ల ముప్పు ఏర్పడే అవకాశం ఉందా అనే విషయాలు తెలుస్తాయి. తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకుంటే కొవ్వు దరిచేరకుండా ఉంటుంది. నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్శాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ను వాడితే మరీ మంచిది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి వారంలో రెండు, మూడుస్లార్లు చేపను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అదుపులో ఉండటానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. సాయంత్రం సమయంలో ఆకలిగా ఉన్నట్లయితే నట్స్ తీసుకోండి. మిర్చి బజ్జీకి బదులుగా నట్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవ కాశం తగ్గిపోతుంది. కడుపు కూడా నిండుతుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉంటే కొలెస్ట్రాల్ స్థాయి నార్మల్గా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే బరువు తగ్గడానికి వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టండి. పై అంతస్తుకు వెళ్లాలనుకుంటే లిఫ్ట్ను ఉపయోగించకండి. మెట్లను ఉపయోగించండి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి ఇది మంచి మార్గం. శారీరక వ్యాయామం కోసం నడక చాలా మంచిది. చీటికి మాటికి టూ వీలర్ తీయకుండా నడక సాగించండి. మీరు టీ ప్రియులా? రోజూ నాలుగైదు సార్లు టీ తాగుతారా? అయితే రెగ్యులర్ టీకి బదులుగా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. మెనూలో కూరగాయాల భోజనం ఉండేలా చూసుకోండి. వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. అవిసెలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు. అవిసెల్లో(ఫ్లాక్స్ సీడ్) ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. రోజూ సరిపడా సమయం నిద్రపోవాలి. మంచి నిద్ర వల్ల శరీరం తిరిగి పునరుత్తేజం అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ముప్పు తప్పుతుంది. కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలతో పాటు అనేక సమస్యలకు మూల కారణం స్మోకింగ్. పొగతాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి స్మోకింగ్ను మానేయండి. వెల్లుల్లిలో ఆర్గనో సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్ను కాలేయానికి రవాణా చేస్తుంది. అందుకే రోజు రెండు మూడు రెబ్బల వెల్లుల్లి తీసుకోండి. రోజూ కార్డియో ఎక్సర్సైజులు చేయండి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. జాగ్రత్తలు పాటించడం ద్వారా కొలెస్ట్రాల్తో వచ్చే ముప్పుకు చెక్ పెట్టవచ్చనడంలో సందేహం లేదు!

Tuesday, September 3, 2013

కీళ్లనొప్పులకు సరైన విరుగుడు



ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఎంతో మంది కీళ్లనొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. 30-40 సంవత్సరాల లోపే కీళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసే కీళ్ల నొప్పులకు ఆయుర్వేద వైద్యమే సరైన చికిత్స అంటున్నారు నేటి జీవనశైలి మానవ జీవితాన్ని, ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. అందుకే జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులే కీళ్ల నొప్పులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలోని మార్పు. సరైన సమయంలో భోజనం చేయకపోవటం, ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినటం, పోషక విలువలున్న ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవటం, సరైన సమయంలో నిద్రపోకపోవడం(స్వప్న విపర్వం- అంటే పగలు నిద్రపోవడం, రాత్రి మేల్కోవటం) కూడా కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా కీళ్ల నొప్పులకు కారణాలుగా చెప్పుకోవచ్చు. కీళ్ల నొప్పుల్ని ఆయుర్వేద వైద్య విధానంలో మూడు విధాలుగా వర్ణించారు. అవి సంధివాతం, ఆమవాతం, వాతరక్తం. సంధివాతం: దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్గా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. త్రిదోష పరంగా చూసినట్టయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్ల నుండి శబ్దాలు వినిపిస్తాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేష కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వల్ల నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. సమస్య 50-60 సంవత్సరాల వారికి వస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో వ్యాధి ఎక్కువ. ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సొరియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తుంటాయి. ఆహారంలో పోషక విలువల లోపం వల్ల కూడా(విటమిన్-డి, కాల్షియం) వ్యాధి వస్తుంది. ఎక్కువగా ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించడం, అధిక బరువులు మోయడం వల్ల, ఎక్కువ సమయం కంప్యూటర్స్ ముందు గడపడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆమవాతం: రుమాటాయిడ్ ఆర్థరైటిస్ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ఆమ- వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్ల సమస్య వస్తుంది. ఇది మానసిక ఒత్తిడి వల్ల, ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, వ్యాయామం చేయకపోవటం, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలు సమస్యకు దారితీస్తాయి. ముఖ్యంగా విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు, నొప్పి, మందజ్వరం, కీళ్లు బిగుసుకుపోవటం, ఆకలి మందగించటం, మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి అన్ని కీళ్లలోనూ కనిపిస్తుంది.
వాతరక్తం: ఇది మధ్య వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మద్యం తీసుకోవడం, అతిగా మాంసాహారం తీసుకోవడం, పులుపు, ఉప్పు, మసాలాలు, ప్రిజర్వేటిస్, కెమికల్స్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం సమస్యకు ప్రధాన కారణాలు. అలాగే శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వంటి కారణాల వల్ల కూడా వాతం, రక్తం సమస్యలుత్పన్నమవుతాయి. రెండూ కలిసి వాతరక్త సమస్యగా మారుతుంది. క్లినికల్గా చూసినట్టయితే, సమస్యలో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. లక్షణాలు: వాపు, నొప్పి కాలి బొటనవేలు నుండి ప్రారంభమై తర్వాత కీళ్లకు వ్యాపిస్తాయి. సమస్యలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. పరిష్కార మార్గాలు: - నిదాన పరివర్జనం - ఔషధ సేవన - ఆహార-విహార నియమాలు. మూడు పద్ధతుల ద్వారా వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. నిదాన పరివర్జనం: వ్యా«ధి కారణాలను పాటించకుండా ఉండటం ఇందులో ప్రధానమైనది. ఉదా: పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొవటం వంటివి వదిలిపెట్టటం. ఆహార-విహార నియమాలు: సరైన సమయానికి ఆహారం తీసుకోవటం. వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, వ్యాయామం, సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవటం లాంటి నియమాలు పాటించాలి. ఔషధ సేవన: ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఒకటి శమనం, రెండోది శోధనం. శమనం: వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. శోధనం: అంటే..పంచకర్మ. పంచకర్మలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు)తరువాత వమన, విరేచన, వస్తి(ప్రధాన కర్మలు). తరువాత పశ్చాత్కర్మలు చేయించవలసి ఉంటుంది. ఇవి కాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, ఓమ వస్తి, పత్రపోడలీ, వాలుకాస్వేద మొదలైన బాహ్య చికత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.