Monday, November 9, 2015

చేతి వేళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ గుట్టు!

అరచేతి గీతలతో భవిష్యత్తు తెలుస్తుందో లేదో గానీ.. వేళ్ల పొడవును బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు! విచిత్రంగానే అనిపించినా.. చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడవుగా గలవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువని పరిశోధకులు చెబుతుండటమే దీనికి నిదర్శనం. కొన్ని అధ్యయనాలూ దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. అంతమాత్రాన ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారు అప్పుడే భయపడిపోకండి. దీనిపై ఇంకా చాలా అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇతరత్రా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కారకాలు గలవారిలో మాత్రం వేళ్ల తీరును కొట్టిపారేయటానికి లేదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఉంగరం వేళ్ల కన్నా చూపుడు వేళ్లు పొడవుగా గలవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు 33% తక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై మరో కోణంలో అధ్యయనం చేయగా.. చూపుడు వేళ్ల కన్నా ఉంగరం వేళ్లు పొడవుగా గలవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతున్నట్టు తేలింది. దీనికి కారణం లేకపోలేదు. మన శరీరం వృద్ధి చెందటంలో హోక్స్ (హెచ్ఓఎక్స్) జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. పిండస్థ దశలో ప్రోస్టేట్ గ్రంథి, మూత్రపిండాల వంటి అవయవాల విషయంలోనే కాదు.. వేళ్ల అభివృద్ధిలోనూ ఇవి పాలు పంచుకుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ కణితుల్లో హోక్స్ జన్యువుల నిష్పత్తి అస్తవ్యస్తంగా ఉంటున్నట్టూ బయటపడింది. క్యాన్సర్లు తలెత్తటంలో పాలు పంచుకునే టెస్టోస్టీరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లతో హోక్స్ జన్యువులు ఎలా చర్య జరుపుతున్నాయో అనేది ఇంకా స్పష్టంగా బయటపడలేదు. కానీ ఉంగరం వేలు పెద్దగా ఉండటానికీ ఈస్ట్రోజెన్ హార్మోన్‌కూ సంబంధం ఉండటం మాత్రం నిజం. తల్లికడుపులో ఉండగా ఈస్ట్రోజెన్ స్థాయులు ఎక్కువగా గలవారిలో ఉంగరం వేళ్ల కన్నా చూపుడు వేళ్లు పొడవుగా ఉంటున్నట్టు తేలింది కూడా. అందువల్ల హోక్స్ జన్యువులకూ ఈస్ట్రోజెన్, టెస్టోస్టీరాన్ హార్మోన్లకూ గల సంబంధంపై మరింత అధ్యయనం చేస్తే.. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కొత్త చికిత్సలను రూపొందించటమే కాదు, మున్ముందు వేళ్ల పొడవును బట్టే జబ్బు ముప్పును కొంతవరకు అంచనా వేసే వీలుంటుందనీ ఆశిస్తున్నారు.

Saturday, November 7, 2015

వేప దివ్యౌషధం

ఔషధ విలువలు, సౌందర్య ప్రయోజనాలు సమంగా గల అరుదైన చెట్టు వేప. దీని ఆకులు, కాండం, నూనె, పూలు, గింజలు, పండ్లు ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు
సంప్రదాయంగా వేప ఆకులతో తయారు చేసే ఔషధాలు మలేరియా, మధుమేహం, గుండె జబ్బులు, చర్మవ్యాధులకు ఉపయోగపడుతూ వ చ్చాయి. గర్భనిరోధకంగా పనికొచ్చే అంశాలు కూడా వేపలో ఉన్నాయి. యాంటీ అల్సర్‌, యాంటీ ఫంగ్‌సగా ఉపయోగపడే మూలకాలు కూడా వేపలో ఉన్నాయి. అల్సర్లను నయం చేయడంతో పాటు వేపాకుకు అజీర్తి సమస్యను నిర్మూలించే గుణం కూడా ఉంది. ప్రతి రోజూ వేపాకును వాడుతూ ఉంటే, కేన్సర్‌ కణాలు బహుముఖంగా విస్తరించే అవకాశాలు తగ్గిపోతాయి. వేపకు సంబంధించిన వివిధ భాగాలను తీసుకోవడం వల్ల కేన్సర్‌ కణజాలం పెరగడం ఆగిపోతుంది.
ఫ్లూ, కొన్ని ఇతర జ్వరాల్ని తగ్గించడంలో వేప ఔషధాలు ముందు వరుసలో ఉంటాయి. వేప పేస్ట్‌ యాంటీ- బ్యాక్టీరియల్‌ నిర్మూలకంగా పనిచేయడంతో పాటు, స్వల్పంగా ఉన్న చర్మ సంబంధితమైన ఇన్‌ఫెక్షన్లను, గాట్లను, పుండ్లను మాన్పడంలో బాగా ఉపయోపడుతుంది..
ఇన్సులిన్‌ రిసెప్టార్లను చైతన్యపర్చడం ద్వారా వేప ఆకులు రక్తంలోని షుగర్‌ నిలువల్ని తగ్గిస్తాయి. దీనికి తోడు ఆధునిక వైద్యానికి సంబంధించిన యాంటీ-డయాబెటిక్‌ మందుల మీద ఆధారపడటాన్ని బాగా తగ్గిస్తూ మధుమేహం నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేప నూనె దోమల్ని తరిమి కొట్టే రిపెల్‌గా కూడా ఉపయోగపడుతుంది.
సౌందర్య పోషణకు వేపాకులో ఉండే యాంటీ- బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ అంశాల కారణంగా పలు రకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు, దద్దుర్లకు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. వేప నీరును చర్మపు బిగువును పెంచే స్కిన్‌ టోనర్‌ కూడా. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతి వంతంగా మారుతుంది. పొడి చ ర్మపు సమస్యను కూడా ఇది పోగొడుతుంది. తలకు వేపాకు పట్టించడం ద్వారా తల మీదున్న దురద, చుండ్రు సమస్యలు తొలగిపోవడంతో పాటు జుత్తు కూడా బాగా పెరుగుతుంది.

Thursday, November 5, 2015

మెరిపించే సెనగపిండి...!

ఈ కాలంలో రకరకాల చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి. వాటన్నింటికీ సెనగపిండితో పరిష్కారం సాధించొచ్చు.

• సెనగపిండిని అప్పుడప్పుడూ సున్నిపిండిలా వాడుకోవచ్చు. దీనివల్ల చర్మంపై పేరుకొన్న మురికి తొలగిపోయి... శుభ్రపడుతుంది. టాన్‌కూడా వదిలిపోతుంది. చర్మం సున్నితంగా మారుతుంది. మృతకణాలూ తొలగిపోతాయి.

• నాలుగు చెంచాల సెనగపిండిలో చెంచా పాలూ, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమం తయారు చేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి.. ముఖానికి రాసుకోవాలి. పావుగంటపాటు మర్దన చేయాలి. కాసేపు అలా వదిలేసి చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలాచేయడం వల్ల నల్ల మచ్చలు తగ్గి చర్మం కాంతిమంతంగా మారుతుంది.

• జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి వేసవిలోనే కాదు.. చలికాలంలోనూ ఇబ్బంది తప్పదు. అలాంటప్పుడు నాలుగు చెంచాల సెనగపిండిలో కొద్దిగా పెరుగూ, పాలూ కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకుంటే చర్మంపై పేరుకొన్న మురికీ, దుమ్మూ తొలగిపోతాయి. జిడ్డు వదిలిపోతుంది.

• మొటిమల సమస్యలతో బాధపడుతున్నప్పుడు చెంచా సెనగపిండిలో కొద్దిగా గంధం, కొన్ని పాలూ, చిటికెడు పసుపూ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. పూతలా రాసుకొని ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.

• కొందరికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. అలాంటి వారు సెనగపిండిలో పెరుగూ, నిమ్మరసం, పసుపూ చేర్చి నలుగులా పెట్టుకోవాలి. కడిగేసుకున్న తరవాత నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. నిమ్మరసం, పెరుగూ తేమ శాతాన్ని పెంచి నలుపుదనాన్ని పోగొట్టి చర్మాన్ని మెరిపిస్తాయి.

• మూడు చెంచాల సెనగపిండిలో చెంచా ఓట్స్ పొడీ, అరచెంచా మొక్కజొన్న పిండీ, కొన్ని పాలూ చేర్చి స్క్రబ్ చేసుకోవాలి. తరవాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి.. చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

వ్రణాలకు మూలికా వైద్యం ..!


శరీరంలో ఏ భాగంలోనైనా చిన్న చిన్న గడ్డలుగా ఏర్పడి క్రమేపీ వాపు, నొప్పి, మంటతో పెద్ద గడ్డలుగా మారి అందులో చీము చేరి పుండుగా బాధించే వాటినే ‘వ్రణాలు’ అని ఆయుర్వేదంలో పిలుస్తారు. వీటిలో కొన్ని ప్రాణాంతకంగా ఉంటాయి. అధికశాతం చికిత్స చేయవచ్చు. వ్రణాలకు సంబంధించిన చికిత్సను ఇంట్లోనే చేసుకోవచ్చు.

అవిశె గింజలను మజ్జిగలో మెత్తగా నూరి ఉడకబెట్టి పట్టిస్తే గడ్డలు పగిలి తగ్గిపోతాయి.
రావి ఆకులను వాపుతో కూడిన రక్త గడ్డలపై కప్పి కడితే త్వరగా ఉపశమనం వస్తుంది.

ఎండిన రావి పట్టను చూర్ణం చేసి పగిలిన గాయాలు, గడ్డలపై చల్లుతుంటే త్వరగా తగ్గుతాయి.
అత్తిపాలను వ్రణాలపైన, పుండ్లపైన రాస్తుంటే తగ్గుతాయి.
బచ్చలాకును మెత్తగా నూరి కొద్దిగా ఆముదం కలిపి ఉడికించి వెచ్చగా ఉన్నప్పుడు గడ్డలపై వేసి తడుతుంటే త్వరగా తగ్గుతాయి.
బాగా పండిన అరటి ఆకులను వ్రణాలపై వేసి కడితే చీముతో కూడిన రక్తాన్ని త్వరగా తగ్గిస్తుంది.

కలబంద గుజ్జును తీసి ఉడికించి వెచ్చగా ఉన్నప్పుడే వ్రణాలపై కడుతుంటే త్వరగా తగ్గిపోతాయి.
నల్ల నువ్వులను మెత్తగా నూరి తేనె కలిపి పట్టిస్తే మంచి ఫలితం కలుగుతుంది.

తులసి ఆకుల రసంలో పగిలిన వ్రణాన్ని శుభ్రపరచి ఆ రసంతో దూదిని తడిపి వ్రణంపై కడితే తగ్గిపోతుంది.

పాతబడిన ఎండు కొబ్బరి నుండి తీసిన కొబ్బరి నూనెను వ్రణాలపై రాస్తుంటే త్వరగా తగ్గిపోతాయి.
మెంతి ఆకులను మెత్తగా నూరి నేతిలో ఉడికించి వెచ్చగా ఉన్నప్పుడు పైన వేసి కడితే త్వరగా వ్రణాలు తగ్గుతాయి.
మర్రి పాలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వ్రణాలపై రాస్తుంటే చీము, వాపుతో కూడిన వ్రణాలు త్వరగా తగ్గిపోతాయి.

పొట్టను తగ్గిస్తుంది:

ఈ రోజుల్లో పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. యువతీ, యువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ అనాసపండుకి ఉంది. ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. తర్వాత రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.

ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి.

భోంచేశాక ఇవి తినాలి...!

భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా!

• ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు భోంచేశాక ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోంచేశాక పదిహేను నిమిషాల తరవాత దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగితీసుకుంటే ఇంకా మంచిది.

• అరటిపండ్లు: ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.

• బొప్పాయి: కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

• అనాస: ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

• అంజీరా: గుప్పెడు అంజీరాలో పదిహేను గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

Monday, November 2, 2015

అందానికి కీర ..!

కీరదోసకాయ తింటే శరీరంలో వేడి తగ్గిపోతుంది. కొవ్వుతో పాటు హైపర్‌టెన్షన్‌ను తగ్గించే గుణమున్న దోసతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. 
ఒక టేబుల్‌ స్పూన్‌ ఓట్‌మీల్‌ను, దోసకాయ తురుములో కలపాలి. అందులో మజ్జిగ, నిమ్మరసాలను ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున కలిపి పేస్ట్‌ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చల్లదనం కోసం ఈ ఫేస్‌ ప్యాక్‌ను అందరూ వేసుకోవచ్చు.

• ఆయిలీ స్కిన్‌

ఒక కప్పులో టేబుల్‌ స్పూన్‌ పసుపు, అర కప్పు కీర దోస గుజ్జు కలిపి పేస్ట్‌ చేసుకుని ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.
కీరా గుజ్జుకు తగినంత పెరుగు కలిపి పేస్ట్‌ చేసుకుని ముఖానికి రాయాలి. కాసేపయ్యాక చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

• పొడి చర్మం

కీర దోసకాయ గుజ్జులో టేబుల్‌ స్పూన్‌ ఓట్‌మీల్‌, తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

• మృదువైన చర్మానికి

కీరా గుజ్జులో కొన్ని చుక్కల కలబంద జెల్‌ కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.

• చర్మం మెరుపునకు

కీరా గుజ్జులో రెండు స్పూన్ల పెరుగు కలపాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. కీరా గుజ్జులో పుదీనా ఆకుల్ని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రపరిస్తే చర్మం నిగనిగలాడుతుంది.

వేపాకు... అద్భుత ఔషధం!

వేప ఆకులూ బెరడూ నూనెగింజలూ పండ్లూ పువ్వులూ అన్నీ ఔషధభరితాలే. అందుకే ప్రాచీనకాలంనుంచీ సంప్రదాయ వైద్యంలో వీటిని వాడుతుండేవారు. వేపాకుల్లో బ్యాక్టీరియానీ ఫంగస్‌నీ నిర్మూలించే లక్షణాలు ఉన్నాయి. ఈ ఆకుల్ని ముద్దలా చేసి చర్మవ్యాధులైన అలర్జీలూ, మొటిమలూ, దద్దుర్లూ, నల్లమచ్చల నివారణకు వాడటంవల్ల చక్కని ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని రసాయనాలు పొట్ట, పేగుల్లోని ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియానూ చక్కెరవ్యాధినీ నివారిస్తాయి. వేప పుల్లల్ని నమలడంవల్ల దంతక్షయం, నోట్లో అల్సర్లు ఏర్పడకుండా ఉంటాయి. హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. పోతే వేపనూనెను తలకు పెట్టుకోవడం వల్ల చుండ్రు తగ్గి, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఒంటికి రాసుకోవడం వల్ల దోమల్లాంటివి కుట్టకుండా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, రోజూ కాసిని వేపాకుల్ని తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి పెరగకుండా ఉంటుందన్నది సరికొత్త పరిశోధన. ఈ ఆకుల్లోని రసాయనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట.

Sunday, November 1, 2015

డెంగ్యూని తరిమికొట్టే పవర్ ఫుల్ టిప్స్....

తులసి ఆకులు డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి తులసి ఆకులు చక్కటి పరిష్కారం. రోజుకి రెండు సార్లు.. 10 నుంచి 15 తులసి ఆకులు నమలడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.కొత్తిమీర కొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాలి.
ఉమ్మెత్త ఆకులు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి.. జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి.
మెంతులు డెంగ్యూ నివారణలో చక్కటి పరిష్కారంగా మెంతులు చెప్పవచ్చు. మెంతులతో చేసిన టీ తాగితే మంచిది. నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించి.. ప్రశాంతతో కూడిన నిద్రకు మెంతులు సహకరిస్తాయి.
ఉసిరి రసం ఉసిరి జ్యూస్ తాగడం వల్ల.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే.. రోజుకు ఒకసారి ఉరిసి జ్యూస్ తాగండి
.డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.
బొప్పాయి రసం రోజుకి ఒక గ్లాస్ బొప్పాయ రసం తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కి శక్తినిస్తుంది.
దానిమ్మ జ్యూస్ డెంగ్యూ జ్వరంలో ముందుగా వేధించే పెద్ద సమస్య ప్లేట్ లెట్స్ పడిపోవడం. కాబట్టి.. దానిమ్మ జ్యూస్, బార్లీ గ్రాస్ టీ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ ని పెంచవచ్చు. ప్లేట్ లెట్స్ స్థాయిని పెంచడంలో బార్లీ గ్రాస్ టీ బాగా 

కొలస్ట్రాల్‌ తగ్గాలంటే

శరీరంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది తగ్గాలంటే నిత్యం మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి.. 
  • సాల్మన్‌, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్‌ కొలస్ట్రాల్‌ను ఇవి మెరుగుపరుస్తాయి. ఈ ఫిష్‌ని గ్రిల్‌ లేదా బేక్‌ చేసి తినాలి. వేపుళ్లు చేసుకుని మాత్రం తినొద్దు.
  • మొనోసాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అవకాడో, పల్లీలు, బటర్‌, బాదంపప్పులు గుండెకు ఎంతో మంచివి. ఇవి కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఆలివ్‌, పల్లీ నూనెల్లో మొనోసాచ్యురేట్స్‌ పుష్కలంగా ఉంటాయి.
  • నట్స్‌ తినడం వల్ల కూడా కొలస్ట్రాల్‌ బాగా తగ్గుతుంది. వీటిల్లో మొనోసాచ్యురేటెడ్‌, పాలీఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇది ఎల్‌డిఎల్‌ని అంటే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నట్స్‌ అంటే బాదం, వాల్‌నట్స్‌ వంటి వాటిల్లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పీచుపదార్థాలు ఉన్నాయి. అంతేకాదు వీటిల్లో విటమిన్‌-ఇ, సొలీనియంలు కూడా ఉన్నాయి.
  • ధాన్యాలు, ఓట్స్‌ వల్ల కూడా కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. ఓట్స్‌లో ఫైబర్‌ ఉంటుంది. దీన్లోనే కాకుండా బార్లీ, బ్రౌన్‌రై్‌సలు తీసుకుంటే కూడా కొలస్ట్రాల్‌ బాగా తగ్గుతుంది. బీన్స్‌, యాపిల్స్‌, కేరట్స్‌లలో పీచుపదార్థం బాగా ఉంది.
  • బీన్స్‌, కాయధాన్యాలు, బటానీల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. పప్పుల్లో కూడా పీచుపదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్‌ తక్కువగా ఉంటుంది. బీన్స్‌లో లెసిథిన్‌ అనే పోషకపదార్థం ఉంటుంది. ఇది కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
  • పళ్లల్లోని పీచుపదార్థాల వల్ల కూడా కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. యాపిల్స్‌, కమలాలు, ద్రాక్ష వంటి పళ్లల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని ఫైబర్‌ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పీచుపదార్థాలు బాగా ఉన్న సిలీయం, బార్లీ, యాపిల్స్‌, పియర్స్‌, కిడ్నీబీన్స్‌లు తింటే శరీరానికి మంచిది.
  • యాంటీ ఆక్సిడెంట్లు కొలస్ట్రాల్‌దెబ్బతినకుండా కాపాడతాయి.
  • వాల్‌నట్స్‌లో మొనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇది కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా ఎల్‌డిఎల్‌ (బ్యాడ్‌) కొలస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
  • వెల్లుల్లి రోజూ తింటే బ్యాడ్‌ కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. మంచి కొలస్ట్రాల్‌ పెరుగుతుంది.

Friday, October 30, 2015

రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..

ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మిల్లెట్ అనే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల యంటీ ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది.
సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్నేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు

పసుపుతో బ్లాక్‌హెడ్స్ మాయం..!


ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

• చెంచా దాల్చినచెక్క పొడీ, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.

• ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్‌ని రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై రాసి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

• గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

Thursday, October 29, 2015

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 10 ఉత్తమ ఆహారాలు.......

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 10 ఉత్తమ ఆహారాలు....... బొప్పాయి బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.దానిమ్మ ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.గ్రీన్ లీఫ్స్ శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది.వెల్లుల్లి శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు. బీట్ రూట్ ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ మరియు క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .ఎండు ద్రాక్ష: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.ఆప్రికాట్ ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.కర్జూరం ఎండుఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్ లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి

Tuesday, October 27, 2015

పెరటి ఔషధ మొక్కలు..!! బొప్పాయి...!

పెరట్లో సర్వసాధారణంగా పెరిగే పండ్ల మొక్క. కాయలను కూరకు కూడా వాడుకోవచ్చు
బొప్పాయిలో అధిక పీచు ఉండటం వలన కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.
ఇందులో కొవ్వును దగ్ధము చేయగల ఎంజైములు ఉండటం వలన గుండె పోటు రాకుండా చేస్తుంది .
బొప్పాయిలోని ఆంటి యాసిడ్లు చిన్న వయస్సులో వృద్ధాప్య చిహ్నాలు రాకుండా కాపాడుతాయి .
బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వలన జీర్ణ కోశం లోని పురుగులు నశిస్తాయి . మలబద్దకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది . బొప్పాయి రసం పెద్ద పేగులోని, ముఖ్యంగా కోలన్ ద్వార ఏర్పడిన చీము, జిగరును తొలగించి శుద్ధి చేస్తుంది, కాలేయ వ్యాధులను అదుపులో ఉంచుతుంది.
బొప్పాయి లో తక్కువ శక్తి ,ఇతర విటమిన్లు అధికంగా ఉండటం వలన శరీర బరువును తగ్గిస్తుంది ‘ఎ’ , ‘సి’ విటమిన్లు అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .
బొప్పాయి తో తయారు చేసిన షాంపూ జుట్టులోని చుండ్రును అదుపులో ఉంచుతుంది .

దానిమ్మతో పదిలం

ఎండబెట్టిన దానిమ్మ తొక్కని పొడి చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకున్న ఇరవై నిమిషాల తరువాత కడుక్కోవాలి. దానిమ్మ తొక్కలో ఉండే యాంటాక్సిడెంట్లు కురుపులు, మొటిమలను కలగజేసే బ్యాక్టీరియాని దరిచేరనీయవు
దానిమ్మపొడిలో పాలుపోసి మెత్తగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని కొద్దిసేపటి తరువాత కడుక్కోవాలి. దీనివల్ల వయసువల్ల వచ్చే ముడతలు, గీతలు పోయి చర్మం బిగుతుగా అవుతుంది.
దానిమ్మ పొడి చర్మాన్ని యువి కిరణాల నుంచి రక్షించే నేచురల్‌ సన్‌స్ర్కీన్‌లా, అలాగే చర్మంపై ఉండే మృతకణాలను, నలుపుదనాన్ని తొలగించే స్క్రబ్బర్‌లా కూడా ఉపయోగపడుతుంది.
దానిమ్మపొడి మాయిశ్చరైజర్‌లాగా కూడా బాగా పనిచేస్తుంది. అందుకే దానిలో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాసుకొని కొద్దిసేపటి తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే చర్మం పొడిబారడం తగ్గుతుంది

జిలకరతో ఉపయోగములు

భోజనం రుచించకుంటే ,కడుపు ఉబ్బరంగా ఉండి జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే జిలకర రసం సేవించండి దింతో వెంటనే మీకు జీర్ణక్రియలో మార్పులు సంభవించి ఆకలి బాగా వేస్తుంది.....
జలుబుతో బాధ పడుతుంటే వేయించిన జిలకరను వాసన చూస్తే జలుబుతో పాటు తుమ్ముల నుండి ఉపశమనం కలుగుతుంది ....
ప్రసవానంతరం బాలింత జిలకరను సేవిస్తే గర్భశయం శుభ్రమౌవుతుంది......
జిలకరను మరి ఎక్కువగా తీసుకుంటే వాంతులు వచ్చే ప్రమాదం ఉంది అందుకే మోతాదుగా తీసుకోవాలి . ....
జిలకర ఉదరంలో ఉన్న పురుగులను నాశనం చేస్తుంది అలాగే జ్వర నివారిణిగా పని చేస్తుంది . .....
కొందరికి శరీరం నవ్వతో ఇబ్బంది పెడుతుంటుంది ఇలాంటి వారు జిలకరను ఉడకబెట్టిన నీటితో స్నానం చేస్తే నవ్వ తగ్గి ఉపశమనం కలుగుతుంది . ......
జిలకరను ఉప్పు తో కలిపి రుబ్బిన తర్వాత అందులో తేనె లేక నెయ్యి కలిపి కాస్తా వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట పూస్తే విషం తొలగి పోతుంది .
అతిసారంతో బాధ పడుతుంటే జిలకర చూర్ణాన్ని ఆరు గ్రాముల పెరుగులో కలుపుకొని సేవిస్తే అతిసారం తగ్గి పోతుంది ......
నడుం నొప్పి తో బాధ పడేవారు జిలకర పొడిని నాలుగు కప్పుల నీటిలో కలిపి దానిలో కొద్దిగా నెయ్యి, బెల్లం జోడించి అది ఒక కప్పు అయ్యేంత వరకు మరగబెట్టి చల్లారిన తర్వాత నడుము నొప్పి బాధితులచేత తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది ........

పెరటి వైద్యం....!! తులసి

తులసి కుండీలలోనైన సులువుగా పెంచగలిగే మొక్క . సర్వ రోగ నివారిణి అని పేరుంది.తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చేదుగా, వగరుగా ఉంటాయి. కానీ ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి .
6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుండి రసం వడగట్టి అర స్పూన్ తేనెతో కలిపి రోజులో రెండు సార్లు 3- 4 చుక్కలుగా తీసుకోవాలి. గొంతు గరగరను తగ్గించి మృదువుగా చేస్తుంది, కఫాన్ని వదిలేస్తుంది .
జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది.
తులసి ఆకులను పరగడపున కొన్నిరోజుల పాటు 2 - 3 ఆకులను నమిలినట్లైతే ముక్కు దిబ్బడ వంటి శ్వాస లోపాలు సవరించబడతాయి, గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధి నిరోధకశక్తి కలుగుతుంది.
సుగంధభరితమైన తులసి ఆకు చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది, క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది.
ఇంటిచుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమల బాధ ఉండదు.

Sunday, October 25, 2015

మెంతి ఎంతో మేలు ...!

మెంతి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ అంశాలు శ్వాసను తాజాగా ఉంచడంలో బాగా తోడ్పడతాయి. అందుకే ఈ ఆకుల్ని చూయింగ్‌ గమ్‌, మౌత్‌ ఫ్రెష్నర్స్‌, టూత్‌ పేస్ట్‌ తయారీలో ఉపయోగిస్తారు. దీనిలో శ్వాసకోశ వ్యాధులను నిర్మూలించే అంశాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. తులసి కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, జాగరూకతను, ఏకాగ్రతను పెంచుతుంది. శారీరకమైన నీరసాన్ని, నిస్సత్తువులను తొలగించడమే కాదు, మానసికమైన కుంగుబాటును కూడా పారదోలుతుంది. మెంతి రసంలో జీర్ణశక్తిని పెంచే అంశాలు కూడా అపారంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ-సెప్టిక్‌ అంశాలు ఆరోగ్యమైన చర్మాన్ని నిలబెట్టడంతోపాటు, మొటిమలు రాకుండా కూడా ఇది కాపాడతాయి. మెంతి, నిమ్మరసాల మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకుంటే శరీరంలోలని మలినాలన్నీ బయటికి పోయి అంత ర్భాగాల్లో ఎక్కడ ఏ వాపులు ఉన్నా తగ్గిపోతాయి.

Saturday, October 24, 2015

షుగర్ వ్యాధి ఉందా ...!! ? అయితే ఈ శుభవార్త మీకోసమే !!!

మీకు లేదా మీ బంధు, మిత్ర, ఆత్మీయులకు ఎవరికైనా..మధుమేహ౦ ఉండి..అది అదుపులోకి రాక...లేదా దాని తీవ్ర ప్రమాదాలు వేధిస్తున్నా.లేదా పిల్లల్లో హింసించే type 1 షుగర్ వ్యాధిఅయినా......షుగర్ వల్ల గాయాలయి అవయవాలు కోల్పోయే ఉపద్రవాల్లో ఉన్నా.....వారిని తప్పక మా 'మధుధ్వంసి ' కాపాడుతుంది. 
ఎలాంటి గందరగోళo లేకుండా ఒకసారి సికింద్రాబాద్ బాద్ లోని మా క్లినిక్ కి కాని ఇతర బ్రాంచెస్ కి కాని రమ్మనండి..రండి.. ఇకనుండి ప్రతి శని, ఆది వారాలు సికింద్రాబాద్ లోఉంటాను....
సికింద్రాబాద్ -పద్మరావునగర్ లోని సర్దార్ పటేల్
( SP ) కాలేజ్ ఎదురుగా, ఇండియన్ ఓవర్సిస్ ( IOB bank ) పక్కన - మా (veeranjaneya ayurveda pharmacy ) ఫార్మసి ఆఫీస్ లోనేఉంటాను...
బుధవారం ఆర్మూర్ నిజామాబాద్
శుక్రవారం జగిత్యాల
శని ,ఆది సికింద్రాబాద్ .
తప్పకుండా మా వెబ్ చూడండి..వారికి చూపించండి... తప్పక షేర్ చెయ్యండి...!!
వివిధ ప్రాంతాలలో మా బ్రాంచీలు :---
1, Veeranjaneya aurveda pharmacy,
Hanuman wada, Kandlapelli road,
( just beside hanuman temple)
Jagitial. CELL 9440 511239
2, Veeranjaneya aurveda pharmacy,
Padmarao nagar, secundrabad
Opp SP college, (IOB BANK NEAR)
CELL 9908289830
3, Veeranjaneya aurveda pharmacy,
Baswa garden, vinayaka nagar.
Nizambad. CELL99496 59864.
4, VANSTHALI PURAM (HYDERABAD)
N.G.Os colony, CELL 9700779200
పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో..
తప్పకుండా చూడండి పూర్తివివరాలు ఉన్నాయి ...
web ....... http://sugarcure.in/
Twitter ... https://twitter.com/drlaxmanswamy
Facebook .. . https://web.facebook.com/dr.laxmanswamy
Page .. ...... https://web.facebook.com/sugarcurein-233332716814…/timeline/
Youtube .. . https://www.youtube.com/channel/UCF2wZ7LRg9V9ep-zynIBRiw
Goole + .. https://plus.google.com/…/+SimhachalamLaxmanswamyayur…/posts
E MAIL .. dr.laxmanswamy@gmail.com

Friday, October 23, 2015

కరివేపాకుతో జుట్టు సంరక్షణ చిట్కాలు హెయిర్ టానిక్

గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకొని, తాజా కరివేపాకులను కలిపి, ఈ మిశ్రమం నలుపు రంగులోకి మారేవరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని చలర్చండి. ఇపుడు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇంట్లో తయారు చేసిన టానిక్ సిద్దంగా ఉందని అర్థం. ఈ మిశ్రమాన్ని నేరుగా మీ తలపై చర్మానికి అద్దండి. ఇలా 45 నిమిషాల పాటూ వేచి ఉండి, గాడతలేని షాంపూతో కడిగి వేయండి. ఇలా తయారు చేసిన టానిక్ ను వారానికి రెండు సార్లు వాడండి. ఈ మిశ్రమం వెంట్రుకల పెరుగుదలను మాత్రమేకాకుండా, చిన్న వయసులో జుట్టు నెరవటాన్ని కూడా నియంత్రిస్తుంది.

చేపలతో గుండెపోటు దూరం


మీ గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినండి. అది కూడా నూనె ఎక్కువగా ఉన్న చేపలను ఆరగించాలి. దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఆరు నుంచి 12శాతం వరకు తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. చేపల వినియోగానికి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధించారు. ఇందులో భాగంగా ఈ అంశంపై ఇప్పటివరకు జరిగిన 38అధ్యయన ఫలితాలను విశ్లేషించారు. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను తినడం వల్ల గుండె జబ్బులను నిరోధించవచ్చని చివరకు నిర్ధారించారు.

Monday, October 19, 2015

కుంకుమ పువ్వు,

కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖం లేతగులాబీలా మెరిసిపోవాల్సిందే. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం

షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీ ముందుకు వచ్చింది. దీని కోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు.. జస్ట్. . వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు.. మధుమేహం .. మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు.
6 కోట్ల 50 లక్షలు.. ఇది ఓ రాష్ట్రం జనాభా కాదు.. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య. మధుమేహం… ఒకప్పుడు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు పిల్లల్నీ పట్టి పీడిస్తోంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోవడంతో పాటు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్లా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు.
డయాబెటిస్ రెండు రకాలు.. టైప్ వన్.. టైప్ టు.. ప్రపంచంలో 95 శాతం మంది టైప్ టు డయాబెటిస్ తోనే బాధపడుతున్నారు. వీరి శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లో.. లేదంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లో.. ఈ టైప్ టు డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది.
మధుమేహం నియంత్రణకు మహామంత్రం. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్ లో ప్రచురితమైన ఓ పరిశోధన… వారానికి నాలుగు గుడ్లు తింటే.. మధుమేహ నియంత్రణ సాధ్యమే అంటోంది. గుడ్లలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారానికి నాలుగు కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ, అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా టైప్ టు మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్లపాటు ఈ పరిశోధన సాగింది. వారానికి ఒక గుడ్డు తిన్న వారికంటే.. నాలుగు గుడ్లు తిన్నవారిలో… 37 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ రీసెర్చ్ లో తేలింది.

Sunday, October 18, 2015

వెలగపండు

• పోషక భరితం..!

మిగిలిన పళ్లలో మాదిరిగానే ఇందులోనూ పోషకాలకూ లోటు లేదు. 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. వాస్కోడిగామా బృందం ఓసారి కలరా, డయేరియాలతో బాధపడుతుంటే ఈ పళ్ల గుజ్జునే మందుగా ఇచ్చారట.

వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రక్తహీనత లేకుండా చేస్తుంది. గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికీ మంచిది.

ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. 

అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. 

మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి. 

బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తోంది. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కంటికీ మంచిది.

స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. నోటి పుండ్లనీ తగ్గిస్తుంది. పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది. 

పండే కాదు.. ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే. కానీ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయని కేవలం పూజాఫలంగా చూస్తామే తప్ప అమృత తుల్యమైన దాని ఔషధ గుణాల్ని అంతగా పట్టించుకోం. ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే ఇవి చవితి సమయంలో మాత్రమే మార్కెట్లో సందడి చేస్తుంటాయి. కానీ వేసవి వరకూ ఇవి దొరుకుతూనే ఉంటాయి. మరి ఇప్పటికైనా ఈ చెట్లను చేను గట్లమీదా, బీడుపొలాల్లోనూ వేద్దాం.. వెలగపండ్ల రుచుల్నీ ఆస్వాదిద్ధాం!

Friday, October 16, 2015


షుగర్ వ్యాధి ఉందా ...!! ? అయితే ఈ శుభవార్త మీకోసమే !!!



షుగర్ వ్యాధి ఉందా ...!! ?
అయితే ఈ శుభవార్త మీకోసమే !!!
----------------------------------------
మీకు లేదా మీ బంధు, మిత్ర, ఆత్మీయులకు ఎవరికైనా..మధుమేహ౦ ఉండి..అది అదుపులోకి రాక...లేదా దాని తీవ్ర ప్రమాదాలు వేధిస్తున్నా.లేదా పిల్లల్లో హింసించే type 1 షుగర్ వ్యాధిఅయినా......షుగర్ వల్ల గాయాలయి అవయవాలు కోల్పోయే ఉపద్రవాల్లో ఉన్నా.....వారిని తప్పక మా 'మధుధ్వంసి ' కాపాడుతుంది. 
ఎలాంటి గందరగోళo లేకుండా ఒకసారి సికింద్రాబాద్ బాద్ లోని మా క్లినిక్ కి కాని ఇతర బ్రాంచెస్ కి కాని రమ్మనండి..రండి.. ఇకనుండి ప్రతి శని, ఆది వారాలు సికింద్రాబాద్ లోఉంటాను....
సికింద్రాబాద్ -పద్మరావునగర్ లోని సర్దార్ పటేల్
( SP ) కాలేజ్ ఎదురుగా, ఇండియన్ ఓవర్సిస్ ( IOB bank ) పక్కన - మా (veeranjaneya ayurveda pharmacy ) ఫార్మసి ఆఫీస్ లోనేఉంటాను...
బుధవారం ఆర్మూర్ నిజామాబాద్
శుక్రవారం జగిత్యాల
శని ,ఆది సికింద్రాబాద్ .
తప్పకుండా మా వెబ్ చూడండి..వారికి చూపించండి... తప్పక షేర్ చెయ్యండి...!!
వివిధ ప్రాంతాలలో మా బ్రాంచీలు :---
1, Veeranjaneya aurveda pharmacy,
Hanuman wada, Kandlapelli road,
( just beside hanuman temple)
Jagitial. CELL 9440 511239
2, Veeranjaneya aurveda pharmacy,
Padmarao nagar, secundrabad
Opp SP college, (IOB BANK NEAR)
CELL 9908289830
3, Veeranjaneya aurveda pharmacy,
Baswa garden, vinayaka nagar.
Nizambad. CELL99496 59864.
4, VANSTHALI PURAM (HYDERABAD)
N.G.Os colony, CELL 9700779200
పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లో..
తప్పకుండా చూడండి పూర్తివివరాలు ఉన్నాయి ...
web ....... http://sugarcure.in/
Twitter ... https://twitter.com/drlaxmanswamy
Facebook .. . https://web.facebook.com/dr.laxmanswamy
Page .. ...... https://web.facebook.com/sugarcurein-233332716814…/timeline/
Youtube .. . https://www.youtube.com/channel/UCF2wZ7LRg9V9ep-zynIBRiw
Goole + .. https://plus.google.com/…/+SimhachalamLaxmanswamyayur…/posts
E MAIL .. dr.laxmanswamy@gmail.com

* నయనానందం

కొందరికి కళ్ల కింద నల్లటి వలయాలుంటాయి. ఇవి చూడడానికి అస్సలు బాగుండవు. పైగా పెద్దవాళ్లల్లా కూడా కనిపిస్తారు. ఈ నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి.
వాడేసిన బ్లాక్‌ లేదా గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ రెండింటిని అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆతర్వాత వాటిని బయటకు తీసి రెండు కళ్లపై పది పదిహేను నిమిషాలపాటు పెట్టుకొని తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు కొన్ని వారాల పాటు చేయాలి.
తెల్లగుడ్డ ముక్కను చల్లటి నీళ్లల్లో లేదా పాలల్లో వేసి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఆ గుడ్డతో కనురెప్పలపై పలుమార్లు అద్దాలి. లేదా... నాప్‌కిన్‌లో కొన్ని ఐస్‌క్యూబ్స్‌ను వేసి మూటలాకట్టి దాన్ని కళ్లపై పెట్టి తీస్తుండాలి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేయాలి.
గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఆ పేస్టును కళ్లకింద ఉన్న నల్లటి వలయాలపై రాసుకుని 15-20 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయాలి.
పావు టేబుల్‌ స్పూన్‌ పసుపులో రెండు టేబుల్‌స్పూన్స్‌ మజ్జిగ పోసి బాగా కలిపి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును కళ్లకింద ఉన్న నల్లటి వలయాలపై రాసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కళ్ల భాగాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి.

* అందానికి కలబంద

కలబందలో చర్మసౌందర్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి గుణాలున్నాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలూ, మచ్చలూ, చర్మం పొడిబారడం, దద్దుర్లు రావడం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. కలబంద గుజ్జుకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.
• కలబంద ఆకుల్ని నీళ్లలో వేసి కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. తరవాత ఈ ఆకుల్ని మెత్తని పేస్ట్‌లా చేసి కొన్ని చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోయి, ముఖం తాజాగా మారుతుంది.
• చెంచా కలబంద గుజ్జుకి, అరచెంచా చొప్పున కీరదోస రసం, పెరుగూ, కొన్ని చుక్కల గులాబీ నీళ్లూ కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం అందంగా మారుతుంది. చర్మ సంబంధిత సమస్యలూ రాకుండా ఉంటాయి.
• రెండు చెంచాల కలబంద గుజ్జుకి, చెంచా కీరదోస తురుమూ, ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా ఐదు నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

Thursday, October 15, 2015

బెండ రోజూ తినడం మంచిది ..!

బెండకాయలో విటమిన్‌-సి, యాంటాక్సిడెంట్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగించడంలో కూడా తోడ్పడుతుంది.

ప్రతిరోజూ బెండకాయ తినడంవల్ల పెద్దపేగులో వచ్చే కేన్సర్‌ బారినపడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఉబ్బసం ఉన్నవారు వీటిని తినడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.

బెండకాయలో ఫైబర్‌, విటమిన్‌-సి ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది. దీన్ని ప్రతిరోజూ తినడంవల్ల నీరసం దరిచేరదు. అలాగే బ్లడ్‌షుగర్‌ నియంత్రణకు బెండకాయ బాగా ఉపయోగపడుతుంది.

వీటిల్లో విటమిన్‌-కె ఉండడంవల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. బెండకాయల్ని రోజూ తినేవారిలో కీళ్లనొప్పులు త్వరగా రావు.

* మేతీ పనీర్



• కావలసినవి:
మెంతుకూర(తరిగి), పనీర్‌- పావు కేజీ
నూనె- రెండు టేబుల్‌స్పూన్లు
ఎండుమిర్చి- నాలుగు,
టొమాటో గుజ్జు- అరకప్పు
గరం మసాలా- ఒక టీస్పూను
ధనియాలపొడి- రెండు టీస్పూన్లు
ఉప్పు- తగినంత
• తయారీ
మెంతుకూరలో ఒక టీస్పూను పంచదార, కొద్దిగా నీళ్లుపోసి రెండు నిమిషాలపాటు ఉండికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత టొమాటో గుజ్జు వేయాలి. కొన్ని నిమిషాలపాటు ఉడికాక దానిలో ఉప్పు, గరంమసాలా, ధనియాలపొడి, వేసి తిప్పాలి. ఆ మిశ్రమం నుంచి నూనె పైకి తేతేలే వరకు ఉడికనిచ్చి అప్పుడు మెంతుకూర, పనీర్‌ ముక్కలు వేసి కలపాలి. మూడునిమిషాల తరువాత స్టవ్‌ ఆపేస్తే సరి... మేతీ పనీర్‌ రెడీ..!

Wednesday, October 14, 2015

రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపం

రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎందుకు, ఎప్పుడు వస్తుందో కారణాలు తెలియడం లేదు. ఒకప్పుడు నలభై ఐదేళ్లు దాటితేగానీ మహిళల్లో రొమ్ము కేన్సర్ పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ముప్ఫై దాటితే చాలు వస్తోంది. మన దేశంలో ఏటా రెండు లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోనూ రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది.
ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బాధితులు నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రొమ్ము కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి అవగాహన ఉంటే చాలని అంటున్నారు ప్రముఖ బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డా.కె.ప్రవీణ్‌కుమార్ దాదిరెడ్డి. ముప్పయ్ ఏళ్ల వయసు దాటితే చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చునని, ప్రాథమిక దశలో గుర్తించినా దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చునని అంటున్నారు. కారణాలు తెలియకపోయినా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుందన్నదానికి ప్రధానంగా కారణాలు లేకపోవచ్చుగానీ, ఎక్కువగా వస్తుందన్నది మాత్రం తేటతెల్లమైంది. దీనికి గల కారణాలు పరిశీలిస్తే...
- కుటుంబ చరిత్ర కారణంగా వచ్చే అవకాశాలున్నాయి.
- పొగతాగడం, మద్యం సేవించే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం.
- చిన్నవయసులోనే పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది.
- లేటు వయసులో అంటే 40-45 ఏళ్ల మధ్యలో బిడ్డలను కనడం వల్లకూడా వచ్చే అవకాశం.
- కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడమూ ఒక కారణం.
- పీరియడ్స్‌లో భారీగా మార్పులు చోటు చేసుకోవడం.
- ప్రధానంగా ఈస్ట్రొజెన్ కొలెస్ట్రాల్ కారణంగా బ్రెస్ట్ కేన్సర్ వస్తున్నట్టు స్పష్టం.
ఏడాదికో 15 నిముషాలు..
- 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి మామోగ్రఫీ టెస్టు చేయించుకోవాలి.
- ఈ టెస్టు చేయించుకోవడానికి 15 నిముషాలు పడుతుంది. దీనికి రూ.1,500 ఖర్చవుతుంది. దీనివల్ల రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.
- రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉండే డిజిటల్ మామోగ్రఫీ టెస్టులు వచ్చాయి.
- చంటిబిడ్డలకు తల్లి ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల కొంతవరకూ రొమ్ము కేన్సర్‌ను నివారించుకోవచ్చు.
- ముప్ఫై ఏళ్లు దాటిన మహిళలు తరచూ రొమ్ములో వచ్చే మార్పులను గమనించాలి. గడ్డలు, చర్మం రంగుమారడం, మచ్చలు వంటి మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
- దీనివల్ల ప్రాథమిక దశలోనే రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.
- ప్రాథమిక దశలో ఉన్న రొమ్ము కేన్సర్‌లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెస్ట్‌ను తొలగించకుండా నయం చేసే అవకాశాలున్నాయి.
- బీఆర్‌సీఏ జీన్ టెస్టింగ్ అనే పద్ధతి ఇప్పుడు రొమ్ము కేన్సర్ నివారణలో కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు.
- క్రమం తప్పకుండా మామోగ్రఫీ చేయించుకుంటే రొమ్ము కేన్సర్‌ను సులభంగా గుర్తించడం, నివారించుకోవడం సాధ్యమవుతుంది.

పసుపుతో బ్లాక్‌హెడ్స్ మాయం..!

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
• చెంచా దాల్చినచెక్క పొడీ, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.
• ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్‌ని రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై రాసి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
• గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

Monday, October 12, 2015

అందం... కలబంద..!

అందం... కలబంద..!
కలబంద అందుబాటులో ఉంటే చాలు, చక్కని ముఖవర్చస్సు మీ సొంతమవుతుంది. ఎలాంటి చర్మానికైనా సరే కలబందతో తగిన ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఫేస్‌ప్యాక్స్ మీ కోసం... రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల చీజ్, రెండు చెంచాల కీర దోసకాయల గుజ్జు, ఐదారు గింజలు తీసిన ఖర్జూరాలు మెత్తగా కలుపుకోవాలి. దీనికి కాస్త నిమ్మరసాన్ని, చిటికెడు పసుపు చేర్చి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. పొడిచర్మం ఉన్న వాళ్లకు కళాకాంతులు వస్తాయి.
రెండు తాజా కలబంద ఆకులను నీళ్లలో ఉడికించండి. తర్వాత వాటిని గుజ్జుగా చేసి, రెండు చెంచాల తేనె, చిటికెడు గంధం పొడి కలపండి. దీనిని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది.
స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.పువ్వులలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక అందమైన పుష్పం మందార లేదా మందారం (Hibiscus) ఒక అందమైన పువ్వుల చెట్టు. మందారం మలేషియా దేశపు జాతీయ పుష్పం.దేవతల పూజలోను...తలలో అలంకారం గాను వాడతారు.మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు. మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. ఇందులో రేఖమందారం, ముద్దమందారం ,ఎరుపు, తెలుపు,పసుపు,ఆరంజ్, చాలా రంగులు ఉన్నాయి. దీనిని ఆహార పదార్థాలతో కలిపితీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందాన్ని, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో చుండ్రును నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలు తొందరగా తెల్ల బడకుండా చూస్తుంది. చర్మం నునుపుగ ఉండేలా చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ చేస్తే తొందరగా తగ్గుముఖం పడతాయి..మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ మందార ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.మరి మందార యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా రేపు మరొక పుష్పం అందం గురించి, ఉపయోగాలతో రేపు కలుద్దాము..

Sunday, October 11, 2015

అందమునకు ఆయుర్వేదము

నెరసిన వెంట్రుకలు నల్లబడుటకు
కరక్కాయ ,తానికాయ ,ఉసిరికాయ ఈ మూడింటి బెరడు ,నీలి ఆకు ,లోహా చూర్ణము వీటిని సమబాగాలుగా గుంటగలగర నిజరసము జీలకర్ర రసము గొర్రె మూత్రము కలిపి మెత్తగా దంచి రోజు ఉదయం లేక సాయంత్రము తలకు రాసుకుని దట్టముగా లేపనం చేసి 2,3 గంటల తరువాత కుంకుడు శికకాయలతో తలస్నానము చేసిన తెల్లవెంట్రుకలు క్రమంగా తగ్గి పోతాయి.
శరీరము బిగువుగా ఉండుటకు
మేడి పాలు ,మర్రి పాలు నువ్వుల నూనె తో కలిపి కాచి శేరీరానికి మర్దన చేసుకోవాలి.
వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు
మినుములు ,మెంతులు ,ఉసిరిక సమంగా తీసుకుని నానబెట్టి రుబ్బి తలకు పెట్టవలెను.ఆరిన తరువాత కుంకుడు రసం తో స్నానం చేయవలెను అలా చేసిన తరువాత 3 రోజుల్లోనే అద్బుత ఫలితం కలుగుతుంది.
అతి బరువు
తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో వాడిన బరువు తగ్గును.
పులిపిర్లు తగ్గుటకు
ఉత్తరేని ఆకు ,హరిచంధనమును నువ్వుల నూనె తో కలిపి మెత్తగా నూరి పులిపిర్ల పై లేపనం చేయవలెను.
అధిక మాంసం తగ్గుటకు
ఆవనూనెతో మర్దనా చేస్తే అధిక మాంసం తగ్గుతుంది(ex:మోకాలి క్రింద బాగాన..)
జుట్టు తిరుగుటకు
రాత్రి పడుకోబోయే ముందు తలకు ఆముదము రాసి జుట్టును పక్కకు దువ్వాలి ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత పక్కకు తిరిగిన జుట్టును వెనుకకు కూడా దువ్వుకొన వచ్చును.కుంకుడు రసం తోనే తలస్నానం చేయాలి షాంపూ ,సబ్బులు వాడకూడదు.
చుండ్రు
90 వేపాకులు ,9 మిరియాలు కలిపి కొంచెం నీళ్ళు కలిపి మెత్తగా నూరి తలకు ఒంటికి పట్టించుకవాలి సరిపోక పోతే మరికొంత కలుపుకోవచు.ఆరిపోగానే కుంకుడు కాయ రసం తో స్నానం చేయవలెను.వేపాకులు మిరియాల సంక్య కరెక్ట్ గా వుండాలి.
నల్ల మచ్చలు పోవుటకు
ఆముదపు గింజలు 225 తీసుకుని పై పెచ్చులు తీసివేసి ,లోపలి పప్పులో 12gm శొంటి పొడి కలిపి మెత్తగా నూరి ,కుంకుడు గిన్జలంత టాబ్లెట్స్ చేసి ,నిలువ ఉంచుకుని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే 2,3 నెలల్లో నల్ల మచ్చలన్ని నామరూపాల్లేకుండా పొతాయ్.
మొటిమలు
[1].సుగంధి పాల వేళ్ళ బెరడు చూర్ణము ,పెసర పిండి ,హారతి కర్పూరము ఈ 3 సమబాగాలుగా కలిపి ఈ చూర్ణముతో ముకానికి నలుగు పెట్టుకుంటూ వుంటే ,ముకం మీద మొటిమలు ,మచ్చలు హరిన్చిపోతాయ్.
[2].సుగంధపాల వేళ్ళ చూర్ణము వస చూర్ణము ధనియాల చూర్ణము ఈ మూడింటిని సమ బాగాలుగా కలిపి నీటితో మెత్తగా నూరి ముకానికి రాస్తూ వుంటే మొటిమలు మచ్చలు హరించి పొతాయ్.
తల లోని పేలు
సుగంధ పాల వేళ్ళను గో మూత్రములో కలిపి మెత్తగా నూరి తలకు లేపనం చేస్తూ వుంటే తల లోని పేలు హరించి పొతాయ్.
వళ్ళు తగ్గటానికి
వాన నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నెల మేధా పడకుండా పట్టుకుని నిలువ వుంచి రోజు ఉదయం పూట 50gm వాన నీటిలో చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతూ వుంటే 3 నెలల్లో స్థూలశరీరం తగ్గిపోతుంది.