Thursday, June 27, 2013

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?



తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమౌతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహాన్ని అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడని, అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు.

నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.

గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, గ్రహిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, అరుపులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి మాటలు వింటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని సూచిస్తున్నారు.

Wednesday, June 26, 2013

గర్భధరించడానికి చిట్కాలు #m Drs Chandu


మీరు గర్భధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒకదాని తర్వాత ఒకటి చాన్స్ మిస్స్ అవుతన్నట్లైతే మీరు నిరాశ చెందడం సహజం. చాలా మంది పెళ్ళైన కొద్ది రోజులకే చాలా ఫాస్ట్ గా గర్భం ధరిస్తారు. ఒకటి రెండు నెలల్లోనే గర్భం ధాల్చిడం జరుగుతుంది. అయితే ఒకటి రెండు సార్లు వరుసగా రుతు స్రావం జరిగినట్లేతే మీకు సైకలాజికల్ గా ఏదో సమస్య ఉన్నట్లు గమనించాలి. అందువల్లే మీరు తెలుసుకోవడానికి కొన్ని విషయాలను ఇక్కడ పొందుపరుస్తూ మీరు సులభంగా గర్భం ధరించడానికి అవసరమయ్యే చిట్కాలు మరియు సులభ పద్ధతులు కొన్ని ఉన్నాయి.
ఈ టూల్స్ మీరు త్వరగా గర్భ ధరించడానికి సహాయపడుతుంది. మరియు జీవన శైలిలో మార్పులను తీసుకొస్తుంది. ఉదాహరణకు: ఓవెలేషన్ స్ట్రిప్స్ మరియు ఓవొలేషన్ క్యాలెండరు అందుకు బాగా సహాయపడుతుంది. ఓవొలేషన్ స్ట్రిప్స్ గర్భధారణ పొందడానికి అండోత్సర్గం(అండం విడుదలయ్యే సమయాన్ని)అంటే మీరు గర్భధారణ పొందడానికి అనుకూలమైన సమయమని తెలుపుతుంది. మరియు జీవన శైలిలో కొన్ని మార్పుల వల్ల అంటే ఉదా: ధూమపానం వదిలివేయడం వల్ల కూడా గర్భధారణ వేగంగా జరగే అవకాశం ఎక్కువ. అందువల్ల, కాంబినేషన్ ఆఫ్ టూల్స్, జీవనశైలిలో మార్ఫులు మరియు పాత తరహా వ్యూహాల(ఓల్డ్ ఫ్యాషన్డ్ ట్రిక్స్ )ను కలిపి ఫాలో అవ్వడం వల్ల మీరు త్వరగా గర్భం పొందుటకు సహాయపడుతుంది. మరి అందుకు కొన్ని విషయాలను మీకోసం..చూసి ఫాల్లో అవ్వండి..
1) బరువును కంట్రోల్లో ఉంచుకోవడం: మీరు గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బరువు తగ్గడం చాలా మేలు. అధిక బరువు ఉండటం వల్ల గర్భం ధరించే అవకాశాలు తక్కువ.
2) వ్యాయామం: కొన్ని వ్యాయామలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ కండరాలను వదులు చేస్తుంది. దాంతో మీ శరీరంలోని హార్మోనులు క్రమంగా పనిచేయడానికి సమతుల్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అయితే వ్యాయామాల్లో కూడా కఠినమైన లేదా బలమైన వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ఆ ఒత్తిడి యూట్రస్(గర్భశయం) మీద ఎక్కువగా పడుతుంది. దాంతో గర్భధరించే అవకాశాలు తక్కువ కాబట్టి సులభ వ్యాయామాలు ఎంపిక చేసుకోండి.
3) ఓవొలేషన్ క్యాలెండర్: ఓవొలేషన్(అండోత్సర్గం)అంటే అండం విడుదలయ్యే ఖచ్చితమైన సమయం. ఆ తేదీలలో మీరు ఖచ్చితంగా పార్ట్నర్ తో కలవాల్సిన సమయంగా లెక్కిస్తారు. ఇది గర్భం ధరించడానికి అనుకూలమైన సమయంగా భావిస్తారు. ఇది మీరు చివర రుతు చక్రం మొదలైన రోజు నుండి లెక్కిస్తారు. తర్వాత మీ రుతుక్రమ రోజులు 28రోజులకు లేదా 30 రోజులకా అని లెక్కిస్తారు.
4) ఓవొలేషన్ స్ట్రిప్: ఓవొలేషన్ స్ట్రిప్ యోని మార్గంలో ప్రవేశపెట్టి గుర్తిస్తారు. ఈ స్ట్రిప్ రెడ్ కలర్ లో ఉంటే, మీరు అండోత్సర్గానికి రెడీగా ఉన్నట్లు తెలుపుతుంది. ఆ సమయం గర్భం ధరించడానికి చాలా ఉత్తమైన సమయంగా గుర్తించాలి. ఆ సమయంలో పార్ట్నర్ తో పాల్గొన్నట్లైతే గర్బం దాల్చే అవకాశాలు ఎక్కువ.
5) ధూమపానం నివారించాలి: పొగత్రాగడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్( అంటే గర్భసంచి బయట పిండం ఏర్పడుటకు)కారణం అవుతుంది మరియు మీలో సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి మీరు గర్భాధారణకు ప్రయత్నించాలనుకుంటే కనీసం 6-12నెలల ధూమపానం మానేయాలి.
6) సంతాన్పోత్పత్తిని కలిగించే(ఫెర్టిలిటీ)ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం: కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మీలో సంతానోత్పత్తిని పెంచుతుంది. ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు వెన్న తీసిన డైరీ ప్రొడక్ట్స్(పాలు, పెరుగు) వంటివి మహిళలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ముఖ్యంగా గర్భధారణకోసం ప్రయత్నించే వారికి మరింత మేలు చేస్తాయి.
7) పార్ట్నర్ స్పెర్మ్ కౌంట్: సంతానోత్పత్తి పెంచుకోవడానికి మీతో పాటు మీపార్ట్నర్ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీ భాగస్వామి యొక్క వీర్యకణాల సంఖ్య మరియు నాణ్యత సరిగా ఉన్నాయో లేదా తెలుసుకోవాలి. ముఖ్యంగా అతని జీవన శైలి ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి పొగ త్రాగకుండా నివారించాలి మరియు వ్యాయామాలు చాలా అవసరం.
8) వెట్ డేస్: మీకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏటంటే కొన్ని రోజులు సర్వికల్ మ్యూకస్ (గర్భాశయ శ్లేష్మం కారణంగా)తడిగా అనుభూతి చెందుతారు. అంతే కాదు ఇది గర్భం కోసం ప్రయత్నించడానికి సరైన సమయం అని సూచిస్తుంది.
9) ఒత్తిడి తగ్గించుకోవాలి: సంతానోత్పత్తికి బద్ద శత్రువు ఒత్తిడి ఒకటి. కాబట్టి మీరు గర్భంధరించాలనుకుంటున్నట్లేతే మీ ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి. ఒత్తిడి లేకుండా జీవించడానికి మెడిటేషన్ మరియు ఇతర రిలాక్షేషన్ పద్దతులను ప్రయత్నించి ఒత్తిడి లేకుండా గడపండి.
10) అవసరమైన పరీక్షలు చేయించండి: పైన తెలపిన ఉపకరణాలు మరియు సాంకేతిక పద్దతుల వలన గర్భం ధరించలేకున్నట్లైతే.. డాక్టర్ ను తప్పని సరిగా కలవాలి. మరియు సంతానోత్పత్తికి ఇబ్బందులను కలిగి ఉండే అన్ని అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

Saturday, June 22, 2013

Drs Chandu

వర్షాకాలంలో పాటించవలసిన ఆరోగ్యం చిట్కాలు #
సాదారణంగా వర్షపు చినుకులు పడినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఈ వర్షాల వల్ల వైరల్ జ్వరం, మెదడు వాపు, అలెర్జీలు వంటి పలు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ కాలంలో వైరస్ మరియు బాక్టీరియాలనుండి మనల్ని కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించండి. ఈ చిట్కాలు పాటించుట వల్ల మనము వర్షాకాలంను ఆస్వాదిస్తూ చాల వ్యాధులను నివారించుకోవచ్చు.
1) కాచి చల్లార్చిన నీరు=ఈ వర్ష కాలంలో ఫిల్టర్ చేసిన మరియు బాయిల్డ్ చేసిన వాటర్ ను మాత్రమే త్రాగటానికి ఉపయోగించాలి. క్రిముల దాడి నుండి తప్పించుకోవటానికి టీ లేదా అల్లం టీ, నిమ్మకాయ టీ,వేడి కూరగాయల సూప్,మూలికా టీ వంటి వాటిని త్రాగండి
2) ఆహారాల మీద ప్రత్యేక శ్రద్ద=పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా ఆకు కూరలు తినే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వాటిమీద అనేక లార్వాలు , దుమ్ము మరియు పురుగులు ఉంటాయి. వీటిని తొలగించుట కొరకు ఉప్పు నీటిలో 10 నిముషాలు ఉంచాలి. ఇలా చేయుట వలన బాక్టీరియా నిరోధం జరుగుతుంది.
3)ఉడికించిన వాటికి ప్రాధాన్యత=ఈ కాలంలో పూర్తిగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి లేదా వండని ఆహారపు అలవాట్లు ఉంటే మీకు మీరే సమస్యలను ఆహ్వానిస్తున్నట్లే .
4) పండ్లు -కూరగాయలు=గరం-గరం బజ్జీలకు బదులుగా తాజాగా వండిన లేదా తాజా పండ్లు మరియు కూరగాయలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
5) మసాలాలకు దూరం=వర్షాకాలం సమయంలో మన శరీరంనకు త్వరగా ఆహారం జీర్ణం చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగుపర్చే క్రమంలో వెల్లుల్లి, మిరియాలు,అల్లం,పసుపు మరియు కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి.
6) సూపులు=మాంసాహార ప్రేమికులు భారీ మాంసాహారం కాకుండా సూప్ మరియు తేలికపాటి భోజనం తీసుకోవాలి.
7) రోడ్డు పక్క తయారయ్యే వంటలు=వివిధ క్రిముల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అందువలన ఈ కాలంలో సాధ్యమైనంతవరకు రోడ్డు మీద తయారయ్యే ఆహారాన్ని తినటం మానాలి.
8) తాజాగా లేని లేదా మిగిలిపోయిన ఆహారాన్ని తినటం మానివేయాలి., టాయిలెట్ సందర్శించిన తర్వాత, ఆహారం తీసుకున్నాక,ఆహారం వండటానికి ముందు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రత అవసరము.
9) దోమల నివారణకు= దోమలు, ఈగలు, బొద్దింకలు, చెదపురుగులు మొదలైన వాటిని దూరంగా ఉంచటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిమి నిరోధకాలు, క్రిమినాశకాలను ఉపయోగించండి. దోమల యొక్క ఉనికిని తగ్గించేందుకు వేప ,కర్పూరం లేదా లవంగాలను వాడండి.

Drs Chandu

 
 
వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు #

1) మీ జుట్టును పొడిగా ఉంచండి: సాధ్యమైనంత ఎక్కువ సమయం మీ జుట్టు పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మనం సుమారు 50-60 వెంట్రుకలను కోల్పోతాము, కానీ వర్షాకాల సమయంలో మనకు తెలియకుండా 200 వెంట్రుకలను కోల్పోతాము. ఇది అదనంగా జుట్టు రాలడ౦, చుండ్రు వంటి జుట్టు సమస్యలను నివారించి మీ జుట్టు ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోండి
2) తేలికపాటి షాంపూ లను ఉపయోగించండి: మీరు చుండ్రు, జుట్టురాలడమే కాకుండా తల జిడ్డుదనాన్ని కూడా కలిగిఉ౦డవచ్చు. అందువల్ల మీరు మీ జుట్టును ప్రతిరోజూ తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి. ఆయిలీ జుట్టు కలవారు ప్రతిరోజూ షాంపూ పెట్టడానికి వేరొక కారణం కూడా ఉంది, మీ జుట్టు వర్షాకాలంలో దెబ్బతినవచ్చు, షాంపూ చేయడం వల్ల మాత్రమే మీ జుట్టు పరిమాణాన్ని పునరుద్దరించు కుంటుంది. ప్రతిరోజూ మీ జుట్టు వర్షానికి తడిస్తే ప్రతిరోజూ షాంపూ పెట్టండి.
3) ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహార పదార్ధం. అయితే, మీ జుట్టు అందంగా కనిపించాలి అనుకుంటే, చేపలు, గుడ్లు, కారెట్లు, తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ కూరగయలు, చిక్కుళ్ళు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాలుత్పత్తుల వంటి ఎక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి.
4) కనీసం వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయడం : వారంలో ఒక సారి తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
5) పెద్ద పళ్ళ దువ్వేనను ఉపయోగించడం: పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కలగ కుండా ఉంటుంది. చిక్కు సులభంగా వస్తుంది.
6) జుట్టు తడిగా ఉన్నపుడు బిగి౦చకుండా ఉండడం: జుట్టు తేమగా ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వల్ల కేశాలు పెళుసుగా తయారవుతాయి. జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది కనుక పూర్తిగా ఆరనివ్వండి.

Sunday, June 16, 2013

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో నడక యాతన

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో నడక యాతన

మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (తీ్‌ఱశ్రీవ) అనే ప్రొటీన్‌ (ూతీశీ్‌వఱఅ) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (ూవఅశీఙఱశ్రీ ుఱరరవ), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (ూఱఎవఅ్‌ర), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ (వీవఅఱరర), కీలు చుట్టూ ఉన్న కండరాలు (వీరశ్రీవర) క్రమక్రమంగా క్షీణిస్తారుు. పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (ైట్టౌ్ఛ ్చట్టజిటజ్టీజీట) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారుు.


మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పెైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో ఆధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

ఆస్టియో ఆర్థరెైటిస్‌(ైటౌ్ట్ఛ ్చట్టజిటజ్టీజీట)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(గ్చీడ). ఎక్స్‌రే (గ్చీడ)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అవకరం వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

చికిత్స:
ఆస్టియో ఆర్థరెైటిస్‌ (ైటౌ్ట్ఛ ్చట్టజిటజ్టీజీట) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వెైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.

ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి (ఐఊఖీ), అల్ట్రాసౌండ్‌ (్ఖజ్టూట్చటౌఠఛీ), ఐ.ఆర్‌.ఆర్‌. (ఐ), ఎస్‌.డబ్లు.డి (ఖిగిఈ)) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.
  • గుండె బాగా కొట్టుకుంటుంది.
  • శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
  • కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూౌటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
  • మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
  • చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
  • ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది.
  • రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

  • - షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.

    నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు:
    • నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి.
    • రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు.
    • బ్రిస్క్‌ వాకింగ్‌ (ఆటజీటజు ఠ్చీజూజుజీ).


    • తీసుకోవలసిన జాగ్రత్తలు:
      • ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.
      • నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.
      • పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.
      • వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.


      • వ్యాయామం:
        • మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.
        • స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది.
        • ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.


        • ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (ఖీౌ్ట్చజూ ఓ్ఛ్ఛ ్ఛఞజ్చూఛ్ఛిఝ్ఛ్ట) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.
          • క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.
          • ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది.
          • కీళు సులువుగా కదులుతుంది.
          • ఎముకలు బలపడతాయి.
          • బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి.

          • చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.
            గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి.
            సాధారణంగా మార్నింగ్‌ వాక్‌ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.
            మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

Wednesday, June 12, 2013

Drs Chandu

మీ శరీర చర్మం ప్రకాశవంతంగా , అందంగా కనిపించేందుకు చిట్కాలు #

1) ఒక చెంచా తేనెకు ఒక చెంచా విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి,శరీరానికి పట్టించాలి. అరగంట తర్వాత మసాజ్ చేస్తూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్నందిస్తుంది. అద్భుతమైన యవ్వనమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
2) అరటిపండు గుజ్జుకు, రెండు చెంచాల ఓట్స్ పొడి మరియు రెండు చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి శరీరానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
3) ఒక గుడ్డులోని సొన మరియు ఒక టేబుల్ స్పూన్ కివి జ్యూస్ మరియు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల విటమిన్ ఇ వల్ల మరింత ఎక్స్ ట్రా అందాన్ని పొందవచ్చు.
4) మహిళల మేని మెరుగుకు ఈ విటమిన్‌ ఎంతో అవసరం. ప్రీరాడి కల్స్‌ ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. లైటనింగ్‌ రాడ్‌గా పిలవ బడే ఈ విటమిన్‌ అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పొద్దుతిరుగుడు నూనె, బాదం పప్పులు, పాలకూ,టమోటో, బొప్పా యి, ఆలివ్‌ నూనె వంటి వాటిలో ఈ విటమిన్‌ అత్యధికంగా లభిస్తుంది.
మూత్రాశయం లో రాళ్ళు కరిగి పోవుటకు # మెంతి పిండి , ఉలవల చూర్నమ్ సమభాగాలలో వేయించి ఒక స్పూను మోతాదు ప్రకారం ముల్లంగి ఆకు రసంతో రోజుకు 3 సార్లు చొప్పున సేవిస్తే మూత్రాశయం లో రాళ్ళు కరిగి పోతాయి
 
పేను కొరుకుడు - బట్టతలకు # గురువింద గింజలను జీటి నూనెతో అరగదీసి పేనుకొరికిన ప్రాంతంలో మర్దన చేస్తే వెంట్రుకలు మొలుచును .
 
 
 

Tuesday, June 11, 2013

6 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం



ఒక 1/4 కేజి పాత బియ్యం,ఒక 2స్పూన్ల ఛాయ పెసరపప్పు, తీసుకొని బాండిలో కొంచెం వేడి చేసి, దించి మిక్సిలో రవ్వలాగా చేయాలి.దీన్ని ఒక బాటిల్ లో శుభ్రంగా నిల్వ చేసి, ప్రతిరోజూ ఒక 2,3 స్పూన్ల రవ్వను ఉప్పు చిటికెడు వేసి బాగా మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి.ఉడికాక తీసి స్పూన్ తో కలిపితే గుజ్జులా అవుతుంది.అప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి, శుభ్రం చేసిన వాము పొడి చిటికెడు కంటే తక్కువ గావేసి కలిపి పిల్లలకు తినిపిస్తూ, ఆకుకూరల సూప్ కూడా వారం లో 4 సార్లు ఖచ్చితంగా పెడుతూ, వాళ్ళ ఇష్టం గమనిస్తూ మధ్య మధ్య లో పప్పుకట్టు, చింతకాయ ఊరగాయ పలచగా కలిపి పెడుతూ ఉంటే పిల్లలూ ఇష్టం గా తింటారు.

జలుబు :














జలుబుకు వెల్లుల్లి ఔషధంలా పనిచేస్తుందంటారు. పెద్ద వెల్లుల్లిపాయను పై పొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి.

అలా నోట్లో ఉంచుకున్న వెల్లుల్లిని మెల్లగా కొరుకుతూ దాని నుంచి వచ్చే రసాన్ని మింగుతుండాలి.

ఇలా మూడు నాలుగు గంటలకి సారి కొత్త వెల్లుల్లిపాయను నోట్లో ఉంచుకుని రసం మింగితే ఒక రోజులోనే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.


* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

*
పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.

*
తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం.

జలుబు సహజంగా 2 నుంచి 5 రోజుల మధ్య ఉంటుంది. విపరీతమైన జలుబు, దగ్గుతో కూడిన జలుబు వారం నుండి రెండు వారాల వరకు వుండవచ్చంటున్నారు వైద్యులు. జలుబు సోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి పైన, జలుబుకు చెందిన వైరస్ రకాల పై ఆధారపడి వుంటుందంటున్నారు వైద్యులు.
--------------------------------------------------------------------------------------------

జలుబు తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం:

జలుబు ఉన్నప్పుడు, కొవ్వు పదార్ధాలు, మాంసము, పాల వుత్పత్తులు తక్కువగా తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇలాంటి సమయంలో తాజా పళ్ళ రసాలను, కాయగూరలను ఆహారం రూపంలో అధికంగా తీసుకోవాలి.

మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకుంటే జలుబు నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది.

వేడి నీటి ఆవిరి పట్టడం వలన ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి. గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకొంటుంటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.










కాస్త చింతపండు గుజ్జు, టమోటో రసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.










చికిత్స చేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది. చికిత్స చేయకపోతే ఏడురోజులకు తగ్గుతుంది... అనేది జలుబుకు సంబంధించి చెప్పే పాత సామెత. అంటే వైద్యం చేసినా, చేయకపోయినా జలుబుకానీ తగులుకుంటే వారం పాటు బాధపడక తప్పదు అనేదే సామెతలోని అంతరార్థం.

అంతా బాగానే ఉంది. మరి వారం రోజులపాటు జలుబు పెట్టే నరకయాతనతో భరించేదెలా... ? జలుబు బాధలు తగ్గేందుకు ఇంగ్లీషు వైద్యంలో ఇప్పుడు బేషైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే జలుబులాంటి కారణాలకు కూడా అదేపనిగా మందులు మింగుతూ కూర్చుంటే ఎలా... ? అని ప్రశ్నించేవారికోసం ఇవిగో కొన్ని చిట్కాలు...

వేడి పాలల్లో చిటెకెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త శొంఠి పొడి కలుపుకుని వేడి తగ్గకుండా చేస్తే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. గిన్నెలో వేడి నీరు పోసి అందులో పసుపు కాస్త జంఢూబామ్ వేసుకుని ఆవిరిపడితే జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కు వెంటనే తెర్చుకుంటుంది.

వీటితో పాటు తులసి, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే జలుబు తీవ్రత వెంటనే తగ్గుతుంది. గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది. ఇలా పైన చెప్పిన చిట్కాల్లో అవసరమైన వాటిని పాటిస్తే జలుబు తీవ్రత నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ వారం పదిరోజులు దాటినా జలుబు తీవ్రత తగ్గకుంటే వైద్యుని సమక్షంలో పరీక్షలు చేసుకోవడం మంచిది.




జలుబు చేయడం సర్వ సాధారణం. అయితే ప్రస్తుతం జలుబు అంటే స్వైన్ఫ్లూ లక్షణాలున్నాయోమోనని ఆందోళనకు గురికావడం సహజం. జలుబు చేసిన ప్రతివారికీ స్వైన్ఫ్లూ అనుకోవడం పొరపాటు. జలుబు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జలుబు వెంటనే మటుమాయమౌతుందంటున్నారు వైద్యులు.
-------------------------------------------------------------------------------------------------------

** జలుబుతో బాధపడుతుంటే యూకలిప్టస్ఆయిల్‌‌ను నుదుటిపైన, రొమ్ముపైన, వీపు, ముక్కుపైన రుద్దండి. తర్వాత కంటినిండా నిద్రించండి. దీంతో కాస్త ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

** జలుబుతో సతమతమౌతుంటే ప్రతి రోజూ విటమిన్‌-సి మాత్రలు ఒకటి చొప్పున వాడండి. రెండు వేసుకుంటేచాలు.

** మిరియాల చారు ప్రతి రోజూ ఉదయం రాత్రి త్రాగండి. జలుబుకు ఇది చాలా మంచిందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అలాగే విశ్రాంతి చాలా అవసరమంటున్నారు వారు.

** సొంఠి కాఫీ లేదా సొంఠి టీ సేవిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.


* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

*
పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

*
ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.

*
తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం.


** రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్నీటిలో రెండు నిమ్మకాయల రసం పిండి తగినంత పంచదార వేసుకుని త్రాగండి. ఇలా నాలుగు రోజులు సేవిస్తే జలుబు మటుమాయం అవుతుంది.

** అరకప్పు నీటిలో దాల్చిన చెక్క పౌడర్పావు చెంచా కలుపుకుని మరగబెట్టండి. ఇందులో చిటికెడు మిరియాలపొడి, ఒక చెంచా తేనె వేసి రోజూ రెండుమూడు సార్లు త్రాగండి. ఇలా సేవిస్తే జలుబు దూరమౌతుంది.

** అరలీటర్నీటిలో 100 గ్రాముల బెండకాయలు ముక్కలుగా తరిగి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటి ద్వారా వచ్చే ఆవిరిని పీల్చండి. జలుబు మటుమాయం అవుతుందంటు్న్నారు వైద్యులు.

** పసుపు కొమ్మును కాల్చి పొగ పీలిస్తే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.

** అరచెంచా మిరియాల పొడి, ఒక చెంచా బెల్లంపొడి కప్పునీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా సిప్చేయండి.

** కప్పు వేడి పాలలో అరచెంచా సుద్ధమైన పసుపు కలుపుకుని త్రాగండి. ఇలా ప్రతి రోజూ రెండు మూడుసార్లు త్రాగండి.


 * దాల్చిన చెక్కలో కరిగిపోయే పీచుతోపాటు ఇనుము, క్యాల్షియం, మాంగనీస్‌, సి, కె విటమిన్లు లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్సుగుణాలు ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతాయి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాకుండా జలుబును కూడా దాల్చినచెక్క నివారిస్తుంది.* డయేరియా, పంటినొప్పి, కొలెస్ట్రాల్ను తగ్గించే శక్తీ దాల్చిన చెక్కకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయని వైద్యులు చెబుతుంటారు. అందుకే దీనిని కొన్నిరకాల అరోమా నూనెలు, రూం ఫ్రెషనర్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.* మహిళల్లో రుతు సంబంధ వ్యాధుల నివారణకు దాల్చిన దివ్య ఔషధంలా పని చేస్తుంది. దీన్ని తీసుకోవటంవల్ల రుతుస్రావం సరైన సమయంలో వచ్చేలా చేస్తుంది. గర్భదోషాలను కూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచి ఔషధం. దాల్చిన చెక్కను ఉడికించి, పేస్టు చేసి దాంట్లో కాస్తనెయ్యి, పటికబెల్లం కలిపి తీసుకుంటే జిగట విరేచనాలను నియంత్రించవచ్చు.

** జలుబుతో ఇబ్బంది పడుతూ...శ్వాస పీల్చుతున్నప్పుడు ఛాతీలోనుంచి శబ్దం వస్తుంటే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లి రేకులను చిదిమి వేసుకుని తాగండి. ఇలా మూడు రోజలు రెండుపూటలా సేవిస్తుంటే ఫలితం కనపడుతుందంటున్నారు వైద్యులు.

** దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.

మిరియాలతో జలుబు పరార్








సాధారణంగా వర్షాకాలం లేదా చలికాలంలో జలుబు, దగ్గు రావడం సహజం.. దీని కారణంగా ఆయా కాలాల్లో ఒక్కోసారి శ్వాసను పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా అన్పిస్తుంది... అయితే మిరియాలతో సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కొన్ని మిరియాలను పొడిగా దంచుకుని చక్కెరతో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతులో దరుదగా ఉన్నట్లు అనిపించడం గొంతు నెప్పి వంటి సమస్యలను నుంచి ఉపశమనం పొందవచ్చు... ఇలాగే మూడు పూటలా తీసుకంటే ఫలితం కనబడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు..