Saturday, July 9, 2016

సునాముఖి


మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి మనకి ఉప యోగపడే పొదలాంటి మొక్కల్లో ఒకటి సునాముఖి. దీని శాస్త్రయనామం కాసియా అంగుష్టిఫోలియా. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలస్ధానం మధ్య ఆఫ్రికా అటవీ ప్రాంతాలు, అరబ్‌ దేశాలు. కానీ సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. మన దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు సునాముఖికి పట్టుకొమ్మలని చెప్పవచ్చు. ప్రాంతీయతని బట్టి దీనిని ఇంగ్లీషులో ఇండియన్‌ సెన్నా, టిన్నెర్‌వెల్లీ సెన్నా అనీ, హిందీలో సనాయె, సనాకపట్‌ అనీ, కన్నడలో నెలవరికె, సోనాముఖి అనీ, మళయాళంలో సున్నముక్కి, కొన్నముక్కి అనీ, తమిళంలో నిలవిరారు, నెలవరకారు అనీ, తెలుగులో సునాముఖి, నేలతంగేడు అనీ, సంస్కృతంలో స్వర్ణపత్రి అనీ, గుజరాతీలో నట్‌ కి సానా అనీ వ్యవహరిస్తారు. ఇది చాలా చిన్నగా పొదలా పెరిగే మొక్క. దీని ఎత్తు సమారుగు 2 నుంచి 3 అడుగులుండి, సన్నని ఆకుపచ్చని కాండంతో ప్రతి పాయకీ 4-5 జతల ఆకులతో దట్టంగా రెమ్మలు విస్తరించినట్టు పెరుగుతుం ది. సునాముఖి పువ్వులు చిన్నవిగా ఉండి పసుపు రంగులో ఉంటాయి. పొడవుగా ఎదిగే కాడతో 6-7 విత్త నాలు ముదురు కాఫీ రంగులో ఉంటాయి. సునా ముఖి ఆకులు, కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఎంతో ఉపయోగపడతాయి. దీని ఆకులు, కాయలు ఎండబెట్టి నూరడం ద్వారా సునాముఖి పొడిని తయారుచేస్తారు. ఇది అజీర్తి రోగాలకి, శరీరంలో యిన్‌ఫెక్షన్స్‌ని నిర్మూలించడానికి, ఊపిరితిత్తు ల్లోని ఏర్పడిన సూక్ష్మక్రిముల నిర్మూలనకీ, అలాగే ఊపిరి తిత్తులకు మంచి బలాన్ని చేకూర్చడానికీ, కీళ్ళనొపðలకీ, ఉబ్బసవ్యాధికి, ఆయు ర్వేద వైద్య విధానంలో ఔషధ తయారీలో అత్యంత ముఖ్యంగా వాడు తున్నారు. షట్షాకర చూర్ణం, అష్టయాది చూర్ణంగా లభ్యమవుతున్న ఈ ఔషధాలు ఆయుర్వేదపరం గా సునాముఖితో తయారుచేయబడు తున్నవే. అంతే కాక దీనికి ఒంట్లో వేడిని తగ్గించే గుణం విపరీతంగా ఉంది. శరీరానికి మంచి చలువ చేస్తుంది. కంటి సంబంధిత రోగా లని కూడా అరికడుతుంది. సునాముఖి వేరు నుండి తయారు చేయబ డిన ఔష ధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందిం చడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో, రక్త కణాల లోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక దీనిని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు సాగుచేస్తున్నారు. ఇది సాధారణంగా ఎర్రమట్టి నేలల్లో, ఓండ్రుమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. పత్తి పండే నేలల్లో దీని దిగుబడి అధికంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. సునాముఖి ఆకుల్లో డయాన్‌త్రోన్‌ డైగ్లుకోసైడ్‌ అనబడే కొత్త గ్లైకో సైడ్‌ అలోవెూడిన్‌ కనుగొన్నారు. దీని కాయలలో రేయిన్‌, క్రైసోఫానిక యాసిడ్‌ల ఆంత్రాసిన్‌ గ్లైకోసైడ్‌, సైన్నోసైడ్‌ ఏ.బిలు లభ్య మవుతాయి. బీజదళాల్లో క్రిసోఫనోల్‌, పైసియాన్‌, అలో ఎవెూడిరియిన్‌, రీయామ్‌ ఎవెూడిన్‌లు, ఆకులు, విత్తనాలలో పెన్నోసైడ్‌ కాల్షియం, లభ్యమవుతు న్నట్టు శాస్త్రజ్ఞులు పరిశోధనలో కనుగొన్నారు. అయినప్పటికీ దీనిలో లభ్య మయ్యే ప్రధాన మూలకాలు సెన్నోసైడ్‌ ఎ,బిలు ఔషధ తయారీకి చాలా ఉపయోగపడుతున్నాయి. సునాముఖీ మొక్కల్ని గుజరాత్‌లో సముద్రతీర ప్రాంతంలో విస్తా రంగా పెంచుతున్నారు. ఇతర పంటలతో పాటు దీనిని కూడా పెంచుతూ కొందరు రైతులు ఆదాయాన్ని పొందుతు న్నారు. సునాముఖి ఆకులు గృహవైద్య చిట్కాల్లో కూడా విని యోగించడం ఆంధ్రప్రదేశ్‌లో చాలా మందికి పూర్వం నుండీ వాడుకగా ఉన్న విషయం అందరికీ తెలిసినదే. సునాముఖి ఆకు ల్ని కొబ్బరినూనెలో నిల్వచేసి నిత్యం తలకి రాసుకుంటూ వుంటే, కేశాలు ఒత్తుగా పెరిగి, దృఢంగా ఉంటాయి. జుట్టురాలకుండా, చుండ్రు పట్టకుండా కాపాడుతుంది. సౌందర్యసాధనాల్లో కూడా సునాముఖికి ప్రముఖస్థానం ఉందని చెప్పవచ్చు.

హనుమంతుని ఫలం ఔషధ గుణాలు

హనుమంతుని ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. [3]. తమిళనాడు దిందిగుల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మవాధికి ఒక నెల వరకూ హనుమంతుని ఫల ఆకులను స్త్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పూసుకుంటారు [4]. కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలు పెరుగుటకు, జిగట విరేచనాలకు హనుమంతుని ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది. తలలో పేలకు గింజల చూర్ణం ఉపయోగపడుతుంది. నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలో హనుమంతుని ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.
కేన్సర్ కు వాడే విధానం
కేన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకొని త్రాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి

Thursday, June 16, 2016

క్యాన్సర్ కు అద్భుత ఔషధం నిమ్మకాయ

క్యాన్సర్ అని నిర్ధారణ అయిందంటే ఇక 'ప్రాణం క్యాన్సల్' అనే భావన ఉంది. క్యాన్సర్ వ్యాధి ఏ మాత్రం ముదిరినా బ్రతకటం కష్టం. ముదరకముందే నిర్ధారణ జరిగి తగిన చికిత్స లభిస్తేనే బ్రతికే అవకాశముంది. చికిత్సలో కీమోథెరపీ ముఖ్యమైనది. ఈ కీమోథెరపీ కంటే 10వేల రెట్లు గుణాన్ని నిమ్మకాయ ఇస్తుందని వైద్య పరిశోధనలలో తేలింది. నమ్మశక్యం గాకున్నా నిమ్మకాయ ద్వారా క్యాన్సరు నయమవుతుందనేది సత్యం. నిమ్మరసం కలిపిన నీరు త్రాగితే చాలు, క్యాన్సరుకు దూరంగా ఉండవచ్చు. క్యాన్సరు వ్యాధిగ్రస్తులకు కూడా నిమ్మరసం ద్వారా వ్యాధి నయం చేయవచ్చు. ఈ వ్యాస అనువాదకర్త యొక్క బంధువుకు వరంగల్ ఎం.జి.ఎం.ఆసుపత్రిలో తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది. చికిత్స విజయవంతమై రోగి బాగయినాడు. శస్త్రచికిత్స చేసిన డాక్టరు "ఈ పేషంటుకు క్యాన్సరు కూడా ఉంది. దానికి కూడా శస్త్రచికిత్స త్వరలో చేయించుకోమని, లేకుంటే ఏడాదికంటే ఎక్కువకాలం బ్రతకడని" రోగి బంధువు (వ్యాసకర్తతో) తో చెప్పాడు. ఆ బంధువు ఈ వార్తను ఎవరికీ చెప్పలేదు. ఇది జరిగి 25 సంవత్సరాలయింది. ఆ రోగి ఒక వ్యవసాయదారుడు. అతను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకు (రోగికి) యుక్త వయసు నుండే ప్రతి నిత్యం నిమ్మకాయ ముక్కను చప్పరించే అలవాటు ఉందని తెలిసింది. ఇంట్లో నిమ్మచెట్లు, కాయలు ఏడాది పొడవునా లభిస్తాయి. ఇప్పుడా వ్యక్తికి 75 ఏళ్ల వయసు. చక్కటి ఆరోగ్యంతో ఇంకా వ్యవసాయ పనులు చేస్తూనే ఉన్నాడు. నిమ్మకాయ ఆయనను బ్రతికించిందని డాక్టర్లతో సహా చాలామంది చెపుతున్నారు.
నిమ్మకాయను, నిమ్మరసాన్ని ఏ రకంగా వాడినా అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తున్నాయి. నిమ్మకాయను లేదా పండు నుండి 2-3 నిమ్మ తొనలను (Thin slices) తాగే నీళ్ళలో వేసుకొని ఆ నీటిని దినమంతా త్రాగడం అలవాటు చేసుకోవచ్చు. లేదా ఒక నిమ్మకాయ రసం ఓ బిందెడు నీళ్ళలో కలుపుకొని రోజూ త్రాగటం అలవాటు చేసుకోవచ్చు. ఇది క్యాన్సరును అద్భుతంగా నిరోధిస్తుంది. కీమోథెరపీ కంటే పదివేల రెట్లు శక్తివంతమైన ఔషధమిది. దీనివల్ల శరీరంపై ఇతర దుష్ప్రభావాలు (Side Effects) ఏవీ ఉండవు. ఇప్పుడు క్యాన్సరు చికిత్స శరీరంపై ఎన్నెన్నో దుష్ప్రభావాలను కల్గించడం అందరికీ తెలుసు.
నిమ్మకాయ గుణాన్ని ప్రపంచంలోని అత్యంత పెద్ద ఔషధ కంపెనీ (Institute of Health Sciences, 819, N.L.I.C., Cause Street, Baltimore, Md 1201) నిర్ధారించింది. ఈ ఔషధ కంపెనీ వారు 1970 నుండి పరిశోధనలు జరుపుతున్నారు. After more than 20 Laboratory tests జరిపిన పిదప వారీ నిర్ధారణకు వచ్చారు. క్రింది ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
It destroys the malignant cells in 12 Cancers including Colon, Breast, Prostate, Lung and Pancreas. The Compounds of this tree showed 10,000 times better than the product Adriamycin, a drug normally used Chemotherapeutic in the world, slowing the growth of Cancer cells. And what is even more astonishing : This type of therapy with lemon extract only destroys malignant cancer cells and it does not affect healthy cells.
ఇదీ పై ఔషధ కంపెనీవారి నిర్ధారణ. మనం మన తోటివారికి దీని తెలియచేయటం ద్వారా క్యాన్సరు వ్యాధి రహిత ప్రపంచాన్ని నిర్మాణం చేద్దాం.

జలుబుకు తులసి ఆకుల టీ


'జలుబు తగ్గేందుకు మందులు వాడితే వారం, వాడకపోతే ఏడు రోజులు పడుతుంది' అంటారు. ఇది సరదాగా అనే వాడుక మాట. మామూలుగా జలుబు చేసినప్పుడు ఏమీ తినబుద్ధి కాదు. గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఇలా టీ పెట్టుకుని, తరచుగా తాగుతూ ఉంటే, మంచి ఉపశమనం లభిస్తుంది.
కాస్త అల్లం, వాము, జీలకర్ర, తులసి ఆకులు, మిరియాలు, బెల్లం(పంచదార బదులుగా) టీ పొడిలో వేసి, మరిగించి, మరిగాకా, పాలు పొయ్యండి. ఇలా కాచిన టీ ను తరచుగా త్రాగితే, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Sunday, June 12, 2016

లబందతో సర్వరోగ నివారణ

 .సర్వరోగాగాలను నివారించే శక్తి కలబందకు ఉందని అదొక
దివ్యఔషధం అని అరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఇంటికి ధిష్ఠి తగలకుండా పెంచుకునే ఈ మొక్క అందానికి,
ఆరోగ్యానికి మరెన్నో లాభాలు చేచూకూర్చుతుందని
ఆరోగ్యనిపుణులు అంటున్నారు. కలబంద తో ఆరోగ్యానికి,
అందానికి లాభాలను చూద్దాం : కలబందలో 99,.3 శాతం నీరు,
ఏ, బి, కాంప్లెక్స్ విటమిన్లు, ఎంజైమ్స్, మినరల్స్,
ఆంద్రోక్వినొన్ష్, కార్టాసిలిక్ యాసీడ్, అమైనోయాసిడ్సు ఉంటాయి.
కలబంద మిశ్రమం రాసుకుంటే అనేక ధీర్ఘకాలిక రోగాలను
శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు అందుకే ఏ ఇంట
చూసినా కలబంద కనువిందు చేస్తుంది. కలబంద జెల్ ద్వారా
కీళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు, గజ్జి, తామర, మొటిమలు,
సూర్య రశ్మి నుండి వేడి రక్షణ, కీటకాలు, కుట్టినప్పుడు
ప్రధమచికిత్గా వాడుకోవచ్చు. అంతేకాదు కలబంద ఆకులను
సేకరించి గుజ్జును పాల మీగడ, కొబ్బరి నూనె, ఉప్పు వంటి
పధార్థాలన్నింటిని కలుపుకోవాలి. కలబంద రసం పది టీ
స్పూన్లు, నాలమీగడ ఐదు స్పూన్లు, కొబ్బరి నూనెరెండు
స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ ను కలపాలి. కలబంద
గుజ్జు ఒక గ్లాసు, మంచినీరు అరగ్లాసు, తగినంత తేనె,
ఉప్పు తీసుకోవాలి. కలబంద గుజ్చు, మంచినీరు తేనె
ఉప్పులను బాగా మిశ్రమం చేసి శుభ్రమైన పలుచడి వస్త్రతో
పడగట్టాలి. ఉపయోగాలు : కలబంధ రసం తాగడం వల్ల శరీరంలో
గుండె, కెన్సర్, హెపటైటిస్ కిడ్నీ సమస్యలు నివారిస్తుంది.
చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చెవి, ముక్కు, గొంతు
సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.. కలబంద రసం
తాగడం వల్ల శరీరంలో అంతర్గత వ్యాధులు తొలగిపోతాయి.
ఇందులో బ్యాక్టీరియా వైరస్ వ్యాధులు నివారించే శక్తి ఉంది.
పెప్టిక్ అల్సర్ (కడుపులో మంట), గొంతు సమస్యల
నుంచి ఉపశమనం ఉంటుంది. కలబంద రసంలో ముల్లాని
మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై
పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం
చేస్తుంది. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును
పెంపొందిచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో
మోతాదుకు సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15
నిమిసాలు తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే
ముకం పై పేరుకున్న మురికి తొలగిపోయి కొత్త రూపును
సంతరించుకుంటుంది.

పక్షవాతమును నివారించే విషయంలో పాలకూర

పక్షవాతమును నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తలు అధ్య‌య‌నంలో నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జ‌రుగుతుందని శాస్త్రవేత‌లు తెలిపారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందని శాస్త్రవేత‌లు తెలిపారు.

వీరంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నారు.వీరికి ఈ మందుతో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్క‌వ మోతాదులో ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్నిఇవ్వ‌డం జ‌రిగింది. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమంతప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు ప్ర‌మాదం ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గమ‌నించారు. దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని శాస్త్రవేత‌లు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురిత‌మ‌య్యింది.

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే Health Drink

శరీర సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడి , వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
తయారీ విధానం 
నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చని నీరు - 1 గ్లాస్
తులసి ఆకుల పేస్టు - 1 స్పూన్
పుదినా ఆకుల పేస్టు - 1 స్పూన్
కొత్తిమీర పేస్టు - 1 స్పూన్
అల్లం రసం - 1/2 స్పూన్
నిమ్మరసం - 1 స్పూన్
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - చిటికెడు
పై వాటిని బాగా మిక్స్ చేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్త్ డ్రింక్ రెడీ అవుతుంది.
smile ఎమోటికాన్ వాడే విధానం smile ఎమోటికాన్
ఉదయం బ్రష్ చేసాక తీసుకోవాలి. ఒక అరగంట ఏమి తినకుండా ఉండాలి.లేదంటే సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు.వీలైన వాళ్ళు రెండు పూటలా తీసుకోవచ్చు.
ఈ వ్యాధులతో బాధపడేవారికి ప్రయోజనకారిగా ఉంటుంది 
అధికబరువు , కొలెస్ట్రాల్ , డయాబెటిస్ , మొటిమలు , స్కిన్ ఎలర్జీ , లివర్ , కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్,
బీపి సమస్యలు , పైల్స్ , గ్యాస్ సమస్యలు , పొట్టలో బాక్టీరియా , అమీబియాస్, కిడ్నీలో రాళ్లు , కాన్సర్ , HIV , PCOD , ఋతుచక్ర సమస్యలు , తెల్లబట్ట , శ్వాస సమస్యలు , అస్తమా , మోకాళ్ళు & కీళ్ళనొప్పులు, విషజ్వరాలు , దగ్గు , జలుబు మొదలైన రోగాలను తొందరగా తగ్గిస్తుంది.

చింత చిగురు

చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ క్ర మంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది.
2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్‌ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్‌ను పెంచుతుంది.
3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతాయి.
4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.
6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.
8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది.
9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.
10. పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
11. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
14. ఆల్కహాల్‌ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
15. చింత చిగురును పేస్ట్‌లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.
16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్‌లా పనిచేస్తుంది.
17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. All is well

Saturday, June 11, 2016

• సోయాపాలు.

బరువు తగ్గాలన్నా.. ఎముకలు బలంగా ఉండాలన్నా.. ఈస్ట్రోజన్‌లోపాన్ని అధిగమించాలన్నా సోయాపాలు మేలంటున్నారు నిపుణులు. 

ఎందుకంటే....!

ఈ పాలల్లో ఫ్యాటీ ఆమ్లాలూ, మాంసకృత్తులూ, పీచు, విటమిన్లూ, ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినందివ్వడమేకాదు, చురుగ్గా పనిచేసేందుకూ తోడ్పడతాయి. ఈ పాలను తరచూ తీసుకోవడం వల్ల మోనో, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడతాయి.

* ఇందులోని ఒమెగా 3, 6 ఫ్యాటీయాసిడ్లు, అత్యంత శక్తిమంతమైన ఫైటో - యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే హానిని నియంత్రిస్తాయి. దీనివల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా మీ సొంతమవుతుంది.

* సహజంగానే చక్కెర తక్కువగా ఉంటుంది సోయాపాలల్లో. అంతేకాదు కెలోరీల పరంగా ఇది వెన్నతీసిన పాలతో సమానం! కాబట్టి బరువు తగ్గడం సులువు అవుతుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరానికి పీచూ అందుతుంది కాబట్టి.. తరచూ ఆకలి కూడా ఉండదు.

* మెనోపాజ్‌ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోతుంటుంది. హృద్రోగం, మధుమేహం, అధికబరువు వంటి సమస్యలు వీళ్లని వేధిస్తుంటాయి. సోయాపాలు ఇలాంటివాటికి చక్కటి ఉపశమనం. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్‌.. ఆ హార్మోను లోపాన్ని సవరిస్తుంది.

* వయసు పెరిగేకొద్దీ చాలామంది మహిళల్లో కనిపించే మరో సమస్య ఆస్టియోపోరోసిస్‌. ఆ సమస్య తీవ్రతను కొంతవరకూ తగ్గించుకోవాలంటే.. సోయాపాలు సరైన పరిష్కారం. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌ ఎముకలకు తగిన క్యాల్షియం క్యాల్షియం అందేలా తోడ్పడుతుంది.

Tuesday, June 7, 2016

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకర

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరలో ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి. కాకర జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ తీసుకుంటూ వస్తే రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేసుకోవచ్చు. అలాగే రెండు స్పూన్ల కాకర రసంతో కాసింత నిమ్మరసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు.
ఇంకా కాకర ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది. ఇంకా కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్లెం వేస్తుంది. అలాగే కాకర డయాబెటిస్‌కు చెక్ పెడుతుంది. పండిన కాకర రక్తం, మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే కాకర చెట్లలో ఇన్సులిన్ దాగివుండటంతో మధుమేహానికి చెక్ పెడుతుంది
ఇకపోతే కంటి సమస్యలనుకూడా కాకర నయం చేస్తుంది. కాకర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు, దృష్టిలోపాలను దూరం చేసుకోవచ్చు. కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా కాలేయ వ్యాధికి కూడా కాకర చెక్ పెడుతుంది.
ఇంకా అలెర్జీ, చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Hair loss control tips in Telugu

మీ జుట్టు అందంగా పొడువుగా, బలంగా లేదని బాధపడుతున్నరా……..? బ్యుటిపార్లకి వెల్లె సమయం లేదా………….? జుట్టును అసలు పట్టించుకోవడం లేదా…..? చుండ్రు సమ్యస…? వీటన్నిటికి మన ఇంటిలోనె అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయెగించి, చుండ్రు నుండి నివారణ పొందటానికి, బలమైన, దృఢమైన జుట్టును మీ సొంతం చేసుకోవడానికి చిట్కాలు ఎంటో……తెలుసుకుందామా……. మీ జుట్టు పొడవుగా, దృఢంగా, నిగ నిగ లాడుతు ఉండడానికి సూత్రాలు
వారానికి తప్పనిసరి:- కోడిగుడ్డులో తెల్లని సొనను మత్రమే జుట్టుకు బాగ పట్టించి 20 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యండి వారంలో కనీసం ఒకసారి అయీన మీ జుట్టుకు ఈ పాక్ వెసుకొనిన యెడల ఎప్పుడు నిగ నిగ లడే జుట్టున్ని మీ సొంతం చెసుకోవచ్చూ.
పొడవాటి నిగ నిగ లాడే జుట్టు మీ సొంతం:-ఒక అరటిపండు గుజ్జులో ఒక కోడి గుడ్డు ను మూడు స్పూన్ ల పాలు మరియు మూడు స్పూన్ ల తేనె ను వేసి బాగ కలపండి, కలిపిన దాన్ని జుట్టు కి బాగా పట్టించండి. 30 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యండి ఇలా వారంలో కనీసం రెండు సార్లు చెసి, పొడవాటి నిగ నిగ లడే జుట్టున్ని మీ సొంతం చెసుకోండి.
రెండు కోడి గుడ్లు మరియు ఐదు స్పూన్ ల ఆలీవ్ అయిల్ ఒక గిన్నె లొ వెసి బాగ కలిపిన మిస్రమ్మాన్ని జుట్టు కి బాగా పట్టించి 30 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యాలి.
కోడి గుడ్డు- నిమ్మ రసంతో చుండ్రు నివారణ-మేరిసె జుట్టు:- ఒక కోడి గుడ్డు మెత్తంను మరియు ఒక నిమ్మకాయ రసంను బాగా కలపండి తరువాత దాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషములు తరువాత షాంపూతో వాష్ చేస్తె చుండ్రు నివారణ మరియు మేరిసె జుట్టు మీ సొంతం.
దృఢమైన పొడువాటి జుట్టు:- ఒక గిన్నెలో మూడు కప్పుల మెహంది పౌడర్, 1/4 స్పూన్ ఉప్పు, Daber Amla Hair Oli ఒక కప్పు ఐదు స్పూన్ల తేనె,ఒక కప్పు టీ పౌడర్, రెండు కోడి గుడ్లు మొత్తంను బాగా కలిపి జుట్టుకి బాగా పట్టించి ఒక గంట తరువాత షాంపూతో వాష్ చెయ్యాలి అలా కనీసం నెలకి ఒకసారి చేస్తె మీ జుట్టు బలంగా, పొడవుగా, దృఢంగా మరియు తొందరగా పెరిగే అవకాశం ఉంది.
జుట్టు రాలకుండ-నివారణ:- ఉసిరి రసం(Amla Juice) లో మూడు స్పూన్ల నిమ్మ రసంను కలిపి జుట్టు కుదుళ్ల భాగంలో బాగా పట్టించి 30 నిమిషములు తర్వతా నీటితో శుభ్రం చెయ్యాలి ఇలా వారంలో కనీసం రెండు సార్లు చెస్తె మీ జుట్టు రాలకుండా ఉంటుంది.

శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌

ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.
బాదం పప్పు...
బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది.
రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
జీడిపప్పు...
శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
ఎండు ద్రాక్ష...
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
ఖర్జూరపు పండ్లు...
ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.
అంజీర్‌ పండు....
ఎండిన అంజీర్‌ పండులో పీచు, రాగి, మంగనీస్‌, మెగ్నీషియం, పొటాసియం, కాల్షియం, విటమిన్‌-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే‚, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతు ంది.ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే.

Sunday, May 15, 2016

వాము మొక్క

వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది
వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానపుడు 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దది
ఔషధోపయోగాలు
వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు

Saturday, May 7, 2016

కంటి చుట్టూ ఉన్న నరాలు ఆరోగ్యంగా ఉండడానికి చిట్కాలు

1) మన కళ్ళు చుట్టూ ఉన్న ప్రకృతిని చూడడానికి దేవుడు ప్రసాదించిన వరం.దేవుడు ఇచ్చిన ప్రతి అవయవాన్ని కాపాడుకోవడం మన భాద్యత.
2) కళ్ళు అతి సున్నితమైన అవయవాలు.అవయవాల్లో ఎక్కువ అలిసిపోయేవి కళ్ళు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు చూస్తూ అలిసిపోతూ ఉంటాయి.
3) మొబైల్ రేడియేషన్ , కంప్యూటర్ రేడియేషన్ , టీవీ రేడియేషన్ , తగినంత నిద్ర లేకపోవడం, న్యూట్రిషన్ లోపం ఇవ్వన్ని కళ్ళను ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి.వీటిని తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
4) ప్రతి రోజు సాయంత్రం లేదా కళ్ళు అలసటకు గురి అయినప్పుడు కొంచెం కొబ్బరి నూనె తీసుకొని వేడి చేసి , గోరు వెచ్చగా అయ్యాక , కళ్ళు మూసి రెప్పలపై , కనుబొమ్మలపై , కంటి చుట్టూ చాలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
5) ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నరాలు బలంగా తయారవుతాయి.కళ్ళ కింద నలుపు , వలయాలు , కంటి కింద ముడతలు తగ్గుతాయి.
6) కంటి ఆరోగ్యం బాగుండాలంటే A విటమిన్ ఉన్న పండ్లు , కూరగాయలు
ఆహరంలో భాగం చేసుకోవాలి.రోజులో తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.మొబైల్ , కంప్యూటర్ అవసరానికి మాత్రమే వాడుకోవాలి.
7) ముఖ్యంగా క్యారట్ , బీట్స్ , ఆకుకూరలు , బొప్పాయి , పాలు , గ్రుడ్లు , చేపలు , సోయాబీన్స్ లాంటివి తీసుకోవాలి.
ఇలా పాటిస్తే కంటి చూపు మెరుగుపడి , కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆరోగ్య చిట్కాలు

రాత్రి నీటిలో నానబెట్టిన బాదంను మరుసటి రోజు ఉదయం పరగడుపు తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది . ఇందులో విటిమన్స్, మినిరిల్స్ అధికంగా ఉంటాయి . ఇంకా మెగ్నీషియం, మరియు ఐరన్ కూడా అధికంగా ఉంటాయి . ఇందులో ఉండే ఎంజైమ్స్ రెస్పిరేటర్ హీలింగ్ పవర్ ను నయం చేస్తాయి . కాబట్టి మీరు బ్రొకైటిస్ తో బాధపడుతుంటే బాదంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

Sunday, February 14, 2016

చెవి రోగాలు - ( Ear Dieseses ) నివారణ

* ఉత్తరేణి సమూల భస్మం నూనెతో కలిపి చెవిలో 4 నుంచి 5 చుక్కలు వేసిన కర్ణ రోగములు అన్ని హరించి పొతాయి.
* జిల్లేడు ఆకు, వావిలాకు , మునగాకు , కాకరాకు , తులసి ఆకు , గుంటగలగర ఆకు , ఆమూదపు ఆకు రసం తీసి మంచి నూనెలో వేసి కాచిన తరువాత చెవిలొ వేస్తుంటే చెవుడు తగ్గిపోతుంది.

* జిల్లేడు ఆకు రసంలో నువ్వుల నూనె పోసి కాచి రసం ఇగిరిన తరువాత వడపోసుకొని చెవిలొ వేసుకుంటే చక్కగా వినపడుతుంది.
* గోరువెచ్చగా ఉన్న వేపనూనె 2 చుక్కలు ఉదయం , సాయంత్రం వేస్తూ ఉంటే చెవుడు తగ్గిపొతుంది.
* ఉత్తరేణి ఆకురసం , మిరియాలు నూరి ఆ రసం చెవిలొ పోసిన చెవి నొప్పి తగ్గిపోతుంది .
* ఉల్లిపాయ రసం 1, 2 చుక్కలు చెవిలొ వేసి ఉల్లిపాయ వేడిచేసి నూరి చెవికి కడితే చెవినొప్పి తగ్గిపొతుంది.
* మెదడు బలహీనత వలన వచ్చిన చెవుడు కు 3 గ్రా ఎండు నల్ల ద్రాక్ష పండ్లు , 3 గ్రా ధనియాలతో కలిపి నమిలి మింగుతూ ఉంటే చెవుడు తప్పక పోతుంది.
* బావంచాలు , పిల్లితేగలు, సమంగా చుర్ణించి మంచి నీళ్ళతో తీసుకుంటే చెవుడు తగ్గును.
* నీటిపిప్పిలి ఆకు రసం చెవిలొ పిండుతుంటే క్రమంగా చెవుడు తగ్గిపొతుంది .
* ఉత్తరేణి భస్మం , మంచి సున్నం కలిపి నూనెలో వేసి కాచి చెవిలొ వేస్తే చెవుడు , ఇతర బాధలు అన్ని పొతాయి.
* 2 లేక 3 చుక్కలు తమలపాకు రసం చెవిలొ వేస్తుంటే చెవినొప్పి తగ్గుతుంది .
చెవిలొ చీము నివారణ కొరకు -
* బీరాకు రసం 2 చుక్కలు రోజు ఒక పూట చెవిలొ వేస్తే చెవిలొ పుండు , చీము కారుట తగ్గిపొతుంది.
* రసకర్పూరమ్ నువ్వుల నూనెలో కాచి 2 చుక్కలు చెవిలొ వేసిన చీము కారడం తగ్గిపొతుంది.
* వేప ఆకులు నీళ్ళలో వేసి మరిగించి బయటకు వచ్చే ఆవిరి చెవికి పట్టిన చీము , నొప్పి పొతుంది.
* ఆవు పంచితం 2 నుంచి 3 చుక్కలు చెవిలొ వేస్తే చీము కారడం తగ్గుతుంది .
* కొబ్బరి నూనెలో ఇంగువ వేసి కాచి 2 చుక్కలు చెవిలొ వేస్తే చీము తగ్గుతుంది
* నీరుల్లి రసం కొంచం వేడి చేసి 2 చుక్కలు చెవిలొ వేసిన చీము, నొప్పి తగ్గిపోతాయి .
* మందార ఆకుల రసం తో మంచి నూనె చేర్చి నూనె మిగిలేట్టుగా కాచి 2 చుక్కలు చెవిలొ వేస్తూ ఉంటే చీము కారడం , చెడు వాసన రావడం తగ్గిపోతాయి .
* దానిమ్మ పండు రసం వెచ్చ చేసి 2 చుక్కలు వేస్తే పోటు , చీము, దురద తగ్గిపోతాయి .
* చేమంతి ఆకు రసం 2 చుక్కలు వేస్తే చీము కారడం తగ్గిపొతుంది. చెవిలొ పురుగులు చచ్చిపోతాయి.
చెవిలొ కురుపులు - నివారణ
* సబ్జా ఆకు రసం 2 చుక్కలు చెవిలొ వేస్తే కురుపులు , చెవిలొ పోటు పొతుంది.
* వేపాకు రసం , తేనే సమంగా వెచ్చ చేసి 2 చుక్కలు చెవిలొ వేస్తే చెవిలొ కురుపులు మానతాయి.
* బీరఆకు రసం 2 బొట్లు చెవిలొ వేస్తే పుండ్లు, కురుపులు మానతాయి.

Friday, February 12, 2016

ఉపిరితిత్తుల రోగులకు అత్యద్బుత రసాయనం .

తయారీ విధానం -
తాజాగా ఉండే నల్లద్రాక్ష పండ్లు తెచ్చి బాగా కడిగి నీరు వంచి శుభ్రమైన చేతులతో పిసకాలి. తరువాత శుభ్రమైన గుడ్డలో వడపోసి రసం తీసుకోవాలి . ఆ రసం 16 కిలొలు ఉండాలి. అందులో 3 కిలొల పటికబెల్లం చూర్ణం 3 కిలొల మంచి తేనే కలిపి శుభ్రమైన కొత్తకుండ లొ పోయాలి. అందులొ ఇంకా ఒక్కొటి 25 గ్రాముల చొప్పున నాగకేసర చూర్ణం , దొరగా వేయించిన పిప్పిళ్ళ చూర్ణం , శుద్ది చేసిన చిత్రమూలం చూర్ణం , వావిలి గింజల చూర్ణం , ఆకుపత్రి చూర్ణం , యాలుకల చూర్ణం , దాల్చినచెక్క చూర్ణం దోరగా వేయించిన మిరియాల చూర్ణం , లవంగాల చూర్ణం , జాజికాయల చూర్ణం పోసి కుండపైన మూకుడుతో మూసి వాసిన కట్టు కట్టాలి. పదార్దాలు కుండలో నిండుగా ఉండకూడదు . కుండలో నాలుగో వంతు ఖాళీగా ఉండాలి. కుండ మూతకు శీల మన్నుతో లేపనం చేయాలి .
తరువాత ఎండాకాలం లొ అయితే 3 వారాల పాటు , వర్ష, శీతాకాలలో అయితే ఒక నెలరొజుల పాటు ఆ కుండను ఒక మూలగా కదిలించకుండా భద్రపరచాలి. పైన తెలిపిన సమయానికి కుండలో పదార్దాల మద్య రసయనిక చర్య జరిగి ఆ పదార్దం అంతా అద్బుతమైన అమృత రసాయనం అవుతుంది. తరువాత మూత తీసి కుండలోని పదార్థాన్ని కదలకుండా పై పై తేట నీళ్లని వేరే పాత్రలోకి వంచుకోవాలి.ఈ రసాయనాన్ని గాజు సీసాల్లో నిలువ ఉంచుకొవాలి. పూటకు 25 గ్రాముల మోతాదుగా రోజు రెండుపూటలా సేవించాలి .
ఉపయొగాలు -
* ఉపిరితిత్తులు బలహీనత తగ్గిపొతుంది.
* సహజశక్తి కలుగుతుంది.
* రక్తం శుభ్రపడి కొత్తరక్తం పుడుతుంది.
* ఆస్తమా , క్షయ , ఉపిరితిత్తులు కాన్సర్ , అజీర్ణ రోగులుకు ఇది అమృతం కన్నా ఎక్కువుగా పనిచేస్తుంది .
* శరీరానికి ధృడమైన , శాశ్వతమైన బలం , యవ్వనం , రంగు లభిస్తాయి.
* శరీరకాంతి, బుద్ధిబలం, వీర్యవృద్ధి , కళ్లకు చలువ కలుగుతాయి.
పైన చెప్పిన మూలికలు, చూర్ణం లు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అవుతాయి.

ఎలర్జీ తగ్గుట కొరకు -

శరీరం నందు రక్తంలో తేడా వచ్చి రక్త శుద్ది లేనప్పుడు , శరీరంలో పైత్యం పెరిగిపోయినప్పుడు దాని ప్రభావం శరీరం పైన పడుతుంది. అప్పుడు దద్దుర్లు , చర్మరోగాలు వస్తాయి.

దద్దుర్లు తగ్గించేందుకు సులభ యోగాలు -
* ప్రతిరోజు జీలకర్ర, ధనియాలు , ఎండుద్రాక్ష ఒక్కొటి 10 గ్రాముల చొప్పున కొంచం నీళ్లతో నూరి గుడ్డలో వడపోసుకొని పిండుకొని తాగండి.ఇలా రోజుకీ రెండుమూడు సార్లు చేస్తే పైత్యం ద్వారా వచ్చిన దద్దుర్లు పొతాయి.
* ప్రతిరోజు ఉదయం పూట 1 కప్పు పాలలొ ఒకటి లేక రెండు చుక్కలు ప్రశస్తమైన పలుచటి వేపనూనె కలిపి 20 గ్రాముల పటికబెల్లం చూర్ణం కలిపి తాగండి. దీనితో పాటు 30 వేపాకులు , 3 మిరియాలు 1 టీస్పూన్ మంచి పసుపు ఈ మోతాదుగా ఎంత ఎక్కువైనా కలిపి మంచినీళ్ళు పోసి మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేయండి . అది వంటికి రాసుకొని గంట లేక రెండు గంటల పాటు అలాగే ఉంచి సున్నిపిండితో స్నానం చేస్తూ ఉంటే క్రమంగా రక్తశుద్ది , చర్మశుద్ధి జరిగి బాధ నివారణ జరుగుతుంది.
* ఒక కప్పు పాలలో మంచి ప్రశస్తమైన వేపనూనె 2 చుక్కలు వేసి 20 గ్రాముల పటికబెల్లం పొడి కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే రక్తశుద్ది జరిగి చర్మవ్యాదులు పోతాయి .
* మారేడు ఆకులని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణం గా తయారుచేసుకుని పూటకు రెండున్నర గ్రాముల మోతాదుగా రెండుపూటలా మంచి నీళ్లతో సేవిస్తూ ఉంటే క్రమంగా అన్ని రకాలు చర్మవ్యాదులు హరించి పొతాయి.
* చింతపండును నీళ్లలో కలిపి బాగా పిసికి గుజ్జుని పిండి తీసివేసి ఆ రసాన్ని వంటికి పట్టిస్తూ పైత్యం పెరగడం వలన వచ్చిన దద్దుర్లు పొతాయి.
* నిమ్మరసంలో తులసి ఆకులు వేసి మెత్తగా మర్దించి దద్దుర్ల పైన లేపనం చేస్తే దద్దుర్లు హరించి పోతాయి .
* గరికరసం 4 బాగాలు , ఆవనూనె 1 బాగము కలిపి తైలము మిగిలే టట్లు సన్నసెగ మీద వండాలి. తరువాత వడపోసి ఆ తైలాన్ని చర్మవ్యాదుల పైన లేపనం చేస్తూ ఉండాలి. దీనితో పాటు ప్రతిరోజు రెండుపూటలా గరికరసం 10 గ్రా మోతాదుగా సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే సకల చర్మవ్యాదులు పాముకుబుసం విడిచినట్లు శరీరం నుంచి తొలగిపోతాయి.
* పటికబెల్లం పొడి 24 గ్రా , కటుకరోహిని పొడి 12 గ్రాములు కలిపి నూరి ఉంచుకొని పూటకు ఒక గ్రాము చొప్పున రెండు పూటలా మంచి నీళ్ల అనుపానంతో పుచ్చుకుంటూ ఉంటే క్రమంగా దద్దుర్లు , దురదలు తగ్గిపోతాయి .

గుండెకి బలం కలిగించే ఆహార పదార్దాలు -

గుండెకి బలం కలిగించే ఆహార పదార్దాలు -
* కొబ్బరి నీళ్ళు , కొబ్బరి పచ్చడి.కోడిగుడ్డు
* గులాబీ , గౌజుబాన్ , ఉసిరికాయ .
* అంజీర్ , ఆక్రోట్, యాలుకలు .
* కస్తూరి, ముద్ద కర్పూరం , కుంకుమ పువ్వు.
* జాజికాయ, దాల్చిన చెక్క, తేనే .
* ద్రాక్షరసం, తీపిదానిమ్మ, , కూరల్లో పసుపు .
* వస, లవంగాలు, లవంగపట్ట.
* వాము, వెల్లుల్లి, కొత్తిమీర , మిరియాలు.
* కరకచుర్ణం , ఆవునెయ్యి, శొంటి.
గుండె జబ్బు నివారించే ఔషధం -
* శొంటి కషాయం వేడివేడిగా కొద్దికొద్దిగా సేవిస్తూ ఉంటే గుండె శూలలు( నొప్పి ) , వాత రోగాలు, అజీర్ణం , కడుపు నొప్పి, దగ్గు , ఒగర్పు మొదలయిన బాధలన్ని పటాపంచలు అవుతాయి.
* తెల్ల మద్ది చెట్టు బెరడు తెచ్చి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి అతి మెత్తని చూర్ణం గా తయారుచేయాలి. రోజు 5 గ్రా చూర్ణం లొ 5 గ్రా ఆవునెయ్యి గాని లేక ఆవుపాలు గాని లేక బెల్లపు పానకం గాని ఏదో ఒకటి కలిపి పుచ్చుకుంటూ ఉంటే గుండె రోగాలు , జీర్ణ జ్వరాలు , రక్తం కక్కుకునే రక్తపిత్త వ్యాధి, హరించి పోయి పరిపూర్ణ ఆయుషు , ఆరోగ్యం కలుగుతాయి.
* చెరువుల్లో పెరిగే తామర గడ్డలను తెచ్చి పైన చెప్పిన విధంగా అతిమెత్తని చూర్ణం గా తయారుచేసి ఆ చూర్ణాన్ని రెండు పూటలా 5 గ్రా మోతాదుగా తేనే కలిపి సేవిస్తూ ఉంటే గుండె రోగాలు , శ్వాసరోగాలు , ఎక్కిళ్ళు హరించి పొతాయి.
* గుంట గలిజేరు రసంలో వాముని నానబెట్టి , తరువాత నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని అందులో ఇంగువ చూర్ణం ఒక చెంచా కలుపుకొని దానిని ధనియాల కషాయంతో రెండు పూటలా వారం రోజుల పాటు సేవిస్తూ ఉంటే గుండెలో నొప్పి తగ్గుతుంది.
* పాలతో కలిపిన అన్నం ఎక్కువ తినాలి .
* ఉసిరికాయల పై బెరడు 100 గ్రా , పటికబెల్లం పొడి 100 గ్రా రెండు కలిపి మెత్తగా నూరి పూటకు 5 గ్రా మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే అన్ని రకాల గుండె జబ్బులు హరించి పొతాయి.
* తెల్ల మద్ది చెక్క చూర్ణం పూటకు 5 గ్రా చొప్పున తేనెతో కలుపుకుని సేవిస్తూ ఉంటే అన్ని రకాల గుండెజబ్బులు హరించి పొతాయి. గుండెకి బలం చేకూరుతుంది.
* రోజు ఉదయం , మధ్యాహ్నం సమయాల్లో ఒక నిమ్మ పండు రసంలో 50 గ్రా నీళ్లు , 20 గ్రా కలకండ పొడి కలిపి తాగుతూ ఉంటే గుండె దడ , నీరసం , కడుపులో మంట, మూత్రం బిగింపు, మలబద్ధకం తగ్గిపోతాయి.
గమనిక -
ఆయుర్వేదం నందు యే ఔషధం అయినా ఒక మండలం ( 41 రోజులు ) తప్పక విడవకుండా వాడవలెను . అప్పుడు మాత్రమే దానియొక్క ప్రభావం చూపించును.

Tuesday, February 2, 2016

సైనసైటిస్ కొరకు కొన్ని సులభ యోగాలు -

* రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.
* తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.

గోవుతో వైద్యం .

* ఆవుపాలు - 

ఇవి మధురంగా సమ శీతోష్న్ం గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.

* ఆవుపెరుగు - గర్భిణి స్త్రీకి వరం .

వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.

* ఆవు వెన్న -

ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.

* ఆవునెయ్యి -

ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .

* ఆవుపేడ -

ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.

* గుధస్తానంలో తిమ్మిరి కొరకు -

ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .

* వంటి దురదలకు -

అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి .

* కడుపులోని క్రిములకు -

20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.

ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .

* ఆవుముత్రం -


* ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి .

* గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.

* వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.

* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.

* ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.

* ప్రతిరోజు ఉదయమే గొముత్రాన్ని 30 గ్రా మొతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది.

రక్తపోటు ( BP ) కొరకు సులభయోగాలు -

రక్తపోటు ( BP ) కొరకు సులభయోగాలు -
* శొంటి పొడుము , ధనియాలు పాలతో గాని , అల్లము , జీలకర్ర, ధనియాలు కషాయం చేసి చల్లర్చినది ఒక మండలం ( 41 రోజులు ) తాగవలెను.
* వెల్లుల్లి రసం పాలలొ కలిపి రెండు పూటలా త్రాగవలెను . వాటి మోతాదు వెల్లుల్లి రసం 10 చుక్కలు , పాలు ఒక ఔన్స్ కలిపి ఒక మండలం త్రాగవలెను . ఇది ఒక్క రక్తపోటు కొరకే కాకుండా పక్షవాతముకి కూడా పనిచేయును . వాతవ్యాదులు దగ్గరకి రానివ్వదు.
* శొంటి పొడుము ని రెండు రెట్లు పంచదార గాని బెల్లం న గాని పాకం పట్టి ఉంచుకొనవలెను. తరువాత దానిని రోజు కుంకుడు కాయ అంత తినుచుండిన చాలా మంచిది.
* బావన అల్లం , బావన జీలకర్ర మూడు పూటలా రెండు కలిపి ఒక చెంచా తీసుకొనవలెను.
గమనిక -
వాతం కలగజేసే పదార్దాలను అనగా చామగడ్డ, వేరుసెనగ వంటి వాటిని తినకుండా ఉన్నచొ ఔషదం శక్తివంతంగా పనిచేస్తుంది.
* జటా మామ్సి అనే మూలిక తెచ్చి దానిని మెత్తగా దంచి చూర్ణం చేసుకొని పూటకు 2 గ్రాముల మొతాదుగా మంచి నీళ్లతో వెసుకుంటూ ఉంటే LOW BP తగ్గిపొతుంది.
* నల్ల ఈశ్వరి వేరుని పొడిచేసి పుటకు 250 మిల్లి గ్రాముల చొప్పున మంచి నీళ్లతో రోజుకీ రెండుపూటలా సేవించిన రక్తపోటు నివారించ బడును.

వెంట్రుకలు వూడి పోతున్నందుకు -- నివారణా పద్దతులు .

వెంట్రుకల సమస్యలు - నివారణా పద్దతులు .
వెంట్రుకలు వూడి పోతున్నందుకు -
* మినుములు , మెంతులు సమానంగా మెత్తగా రుబ్బి, ఆ పేస్టు ని తలకు పట్టించి అరగంట తరువాత కుంకుడు కాయలతో స్నానం చేయండి . తొందరలొనే మీ సమస్య నివారించ బడుతుంది .
* గొరింట పువ్వులు , ఆకులు దంచి రసం తీసి కొబ్బరి నూనె తో కాచి వడపోసుకొని ఆ నూనె ని తలకు రాసుకుంటూ ఉంటే వెంట్రుకుల కుదుళ్ళు గట్టిపడి వుడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపడి వూడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా నిగనిగలాడుతూ అందంగా వుంటాయి.
* మంచి నీళ్లలో తగినంత పొగాకు వేసి బాగా నానబెట్టి పిసికి ఆ నీటిని తల వెంట్రుకలకు రాస్తూ వుంటే వెంట్రుకలు రాలడం తగ్గిపొతుంది.
* ఉల్లిపాయ గింజలని నీళ్లతో నూరి తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకలు ఉడి పొవడం ఆగిపొయి వెంట్రుకలు వొత్తుగా పెరుగుతాయి.
* పల్లేరు పువ్వులు , నువ్వుల పువ్వులు సమానంగా తెచ్చి వాటికి సమానంగా నెయ్యి, తేనే కలిపి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు విపరీతంగా పెరుగుతాయి.
* కరకపొడి , ఉసిరికపొడి ,తానికాయ పొడి, నీలిఆకు పొడి, లోహ భస్మం ఇవన్ని సమబాగాలుగా కలిపి గుంటగలగర ఆకు రసంతో , గొర్రె మూత్రంతో మర్దించి వెంట్రుకలకు పూస్తూ ఉంటే ఆకాలంలో వెంట్రుకలు నెరవడం ఆగిపొయి నెరిసిన వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి.
* వెంట్రుకలు మృదువుగా ఉండాలి అంటే మెంతికూర ఆకులను మంచినీళ్ళతో నూరి ఆ ముద్దను తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకల గరుకుతనం పోయి మృదుత్వం వస్తుంది.
* రేగి చెట్టు ఆకులు నీళ్లతో నూరి ఆ ముద్దను తలకు రుద్దుకొని స్నానంచేస్తూ ఉంటే వెంట్రుకలు పగలకుండా చక్కగా వొత్తుగా పెరిగి మృదువుగా ఉంటాయి.
* ఆలివ్ ఆయిల్ లొ గాని , కొబ్బరి నూనె లొ గాని నూనెకి సమానంగా మందార పువ్వుల రసం పోసి ఆ రసం అంతా ఇగిరించి మిగిలిన నూనెని తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు చక్కగా ఎదుగుతాయి.
* వెల్లుల్లిపాయల పొట్టుని కాల్చిన మసిని , ఆలివ్ అయిల్ లో కలిపి రెండు రోజులు నిలువ ఉంచి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు వంకర వంకరగా పెరుగుతాయి.
* మూసాంబరం అన్ని పచారి షాపుల్లో దోరికిద్ధి. దానిని రెండు వంతుల గాటు సారాయిలో కలిపి వెంట్రుకలకు పూస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
* పిచ్చి పుచ్చకాయ విత్తుల నుంచి తీసిన నూనెని నిత్యం తలకు మర్దిస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు అన్ని నల్లగా నిగనిగలాడుతూ మారిపొతాయి.
తరువాతి పొస్ట్ లో అందమయిన వెంట్రుకల కోసం షాంపూ పొడి , లిక్విడ్ హెర్బల్ షాంపూ మొదలయిన వాటిని వివరిస్తాను.
************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

Thursday, January 28, 2016

తెల్ల వెంట్రుకలు నల్లబడటానికి అద్బుత యోగాలు

* మొదటి పద్దతి -
తగినన్ని పచ్చి ఉసిరిక కాయలు కాని , ఎండు ఉసిరికాయలు కాని తీసుకుని ముందుగా లోపలి విత్తనాలు తీసివేయాలి . కాయలపైన ఉండే పై బెరడుని ఒక రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం పూట ఆ నీళ్లు పారబోసి కాయల బెరడు ని ఏడు సార్లు మంచి నీళ్లతో కడగాలి. తరువాత ఆ బెరడుని ఒక పాత్రలో వేసి తగినంత ఆవునెయ్యి కలిపి పొయ్యిమీద పెట్టి , ఆ బెరడు ముక్కలు మెత్తగా అయ్యేదాక ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన బెరడుని అన్నంలో కలుపుకుని గాని లేక విడిగా గాని తినాలి . ఇలా నెలకు అయిదారు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడతాయి. అంతే కాకుండా శరీరానికి మంచి బలం , అద్బుతమైన సౌందర్యం చేకురతాయి.
* రెండో పద్దతి -
ఉసిరికాయల బెరడుని పింగాణి గిన్నెలొ పోసి అవి మునిగేంత వరకు రాత్రిపూట గుంటగలగర ఆకు రసం పోసి ఉదయాన్నే ఎండబెట్టాలి. ఇలా వారం రోజులపాటు గుంటగలగర ఆకు రసం పోయడం పగలు ఎండబెట్టటం చేయాలి . ఎనిమిదో రోజు న ఆ ఎండిన బెరడు ముక్కలని మెత్తటి చూర్ణం గా దంచి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి జాగ్రత్త చేసుకోవాలి .
ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం 3 గ్రా చొప్పున తేనెతో కలిపి సేవిస్తుంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
* మూడొ పద్దతి -
బోడసరం చెట్టు పువ్వులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ప్రతిరోజు ఆ చూర్ణాన్ని ఉదయం పూట 5 గ్రా మోతాదుగా తేనెతో కలిపి తింటూ ఉంటే మెదడుకి , శిరస్సుకి అమితమైన బలం కలిగి తెల్లవెంట్రుకలు నల్లబడతాయి. దాంతో పాటు మానసిక జబ్బులు తగ్గిపోతాయి . జ్ఞాపకశక్తి, ధారణాశక్తి పెరుగుతుంది.
* నాలుగో పద్దతి - అత్యుతమ కేశ తైలం .
మంచి కొబ్బరినూనె అరకిలొ తెచ్చి అందులొ 5 నిమ్మ పండ్ల రసం పిండి సన్నటి సెగ తగిలేలా పొయ్యిమీద పెట్టాలి. క్రమంగా నిమ్మరసం ఇగిరిపొయి నూనె మాత్రమే మిగులుతుంది. దాన్ని వడపోసుకొని భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను తలకు రాస్తూ ఉంటే క్రమంగా వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి పేలు , చుండ్రు, దురద నశించి తెల్లగా ఉన్న వెంట్రుకలు నల్లగా , ఒత్తు గా , పొడవుగా పెరుగుతాయి.

వెంట్రుకల సమస్యలు - నివారణా పద్దతులు .

వెంట్రుకలు వూడి పోతున్నందుకు -
* మినుములు , మెంతులు సమానంగా మెత్తగా రుబ్బి, ఆ పేస్టు ని తలకు పట్టించి అరగంట తరువాత కుంకుడు కాయలతో స్నానం చేయండి . తొందరలొనే మీ సమస్య నివారించ బడుతుంది .
* గొరింట పువ్వులు , ఆకులు దంచి రసం తీసి కొబ్బరి నూనె తో కాచి వడపోసుకొని ఆ నూనె ని తలకు రాసుకుంటూ ఉంటే వెంట్రుకుల కుదుళ్ళు గట్టిపడి వుడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపడి వూడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా నిగనిగలాడుతూ అందంగా వుంటాయి.
* మంచి నీళ్లలో తగినంత పొగాకు వేసి బాగా నానబెట్టి పిసికి ఆ నీటిని తల వెంట్రుకలకు రాస్తూ వుంటే వెంట్రుకలు రాలడం తగ్గిపొతుంది.
* ఉల్లిపాయ గింజలని నీళ్లతో నూరి తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకలు ఉడి పొవడం ఆగిపొయి వెంట్రుకలు వొత్తుగా పెరుగుతాయి.
* పల్లేరు పువ్వులు , నువ్వుల పువ్వులు సమానంగా తెచ్చి వాటికి సమానంగా నెయ్యి, తేనే కలిపి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు విపరీతంగా పెరుగుతాయి.
* కరకపొడి , ఉసిరికపొడి ,తానికాయ పొడి, నీలిఆకు పొడి, లోహ భస్మం ఇవన్ని సమబాగాలుగా కలిపి గుంటగలగర ఆకు రసంతో , గొర్రె మూత్రంతో మర్దించి వెంట్రుకలకు పూస్తూ ఉంటే ఆకాలంలో వెంట్రుకలు నెరవడం ఆగిపొయి నెరిసిన వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి.
* వెంట్రుకలు మృదువుగా ఉండాలి అంటే మెంతికూర ఆకులను మంచినీళ్ళతో నూరి ఆ ముద్దను తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకల గరుకుతనం పోయి మృదుత్వం వస్తుంది.
* రేగి చెట్టు ఆకులు నీళ్లతో నూరి ఆ ముద్దను తలకు రుద్దుకొని స్నానంచేస్తూ ఉంటే వెంట్రుకలు పగలకుండా చక్కగా వొత్తుగా పెరిగి మృదువుగా ఉంటాయి.
* ఆలివ్ ఆయిల్ లొ గాని , కొబ్బరి నూనె లొ గాని నూనెకి సమానంగా మందార పువ్వుల రసం పోసి ఆ రసం అంతా ఇగిరించి మిగిలిన నూనెని తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు చక్కగా ఎదుగుతాయి.
* వెల్లుల్లిపాయల పొట్టుని కాల్చిన మసిని , ఆలివ్ అయిల్ లో కలిపి రెండు రోజులు నిలువ ఉంచి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు వంకర వంకరగా పెరుగుతాయి.
* మూసాంబరం అన్ని పచారి షాపుల్లో దోరికిద్ధి. దానిని రెండు వంతుల గాటు సారాయిలో కలిపి వెంట్రుకలకు పూస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
* పిచ్చి పుచ్చకాయ విత్తుల నుంచి తీసిన నూనెని నిత్యం తలకు మర్దిస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు అన్ని నల్లగా నిగనిగలాడుతూ మారిపొతాయి.

మొటిమల నివారణా పద్దతులు -

* కస్తూరి పసుపు , నిమ్మకాయల రసంలో అరగదీసి రాసిన మొటిమలు తగ్గుతాయి .
* మంజిష్ట తేనెతో అరగదీసి పూస్తే పోతాయి .
* చందనం , జాజికాయ , మిరియాలు నూరి పూస్తే పొతాయి.
* గేదే వెన్నను మొటిమలపైన పూయు చున్న పొతాయి.
* రక్తచందనం , పచ్చి పసుపు , గేదే పాలతో నూరి పూస్తే మొటిమలు పొతాయి.
* శొంటి , లవంగాలు, బాగుగా నూరి పట్టిస్తే మొటిమలు పొతాయి.
* వెల్లుల్లి రసం మొటిమల పైన రాస్తే తగ్గుతాయి .
* బియ్యం కడిగిన నీళ్ళు ముఖానికి రాస్తూ 10 నిమిషాలు అయిన తరువాత కడుగుచుండిన మొటిమలు పొతాయి.
* పచ్చపెసల పిండి , హారతి కర్పూరం , సుగంధి పాల వీటిని సమబాగాలుగా కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని ప్రతి రాత్రి ముఖానికి రాస్తూ ఉంటే మొటిమలు , మచ్చలు పోయి ముఖానికి మంచి కాంతి , సౌందర్యం పెరుగుతాయి.
* 50 గ్రా వాముతో , 40 గ్రా పెరుగు కలిపి మెత్తటి పేస్ట్ లాగా నూరి రాత్రి పూట ఫేస్ పేస్ట్ లా నూరి రాత్రి పూట ముఖానికి అవసరం అయినంత వరకు ప్యాక్ లా వేసుకుంటూ ఉంటే మొటిమలు పూర్తిగా నివారించ బడుతాయి.
* అతివస , శ్రీగంధం సమబాగాలుగా తీసి , ఆవుపాలతో నూరి 7 రోజులు ముఖానికి పూసిన మొటిమలు హరించును.
* తులసి ఆకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించిన మొటిమలు పోవును .
* తులసిఆకులు , పుదినా , వేపాకు మెత్తగా నూరి ముఖానికి పుసిన మొటిమలు హరించును.
* బాదంపాలు లేక రసం పుసిన మొటిమలు పోవును .
* బొప్పాయి కాయ రసం రాస్తే మొటిమలు హరించును. కడిగితే జిడ్డు పొతుంది.
* ప్రతిరోజు పడుకునే ముందు పుదిన రసం రాసి అరగంట తరువాత కడిగిన తగ్గును .
* పోకచేక్కతో గంధం తీసి రాసిన మొటిమలు పోవును .
* చిక్కుడు ఆకుల రసం పుసిన ముఖము పైన అన్ని మచ్చలు పోవును .
* వేడినీళ్ళతో నిమ్మరసం పిండి టీస్పూన్ గ్లిసరిన్ కలిపి పట్టించి అరగంట తరువాత కడిగిన పోవును

Wednesday, January 27, 2016

* మూలికలతో షాంపూ పొడి -

ఉసిరికాయ బెరడు , వేపాకులు , తెల్ల చందనం, బాదంపాలు, యష్టి మధూకమ్ ఇవి సమాన బాగాలుగా తీసుకుని పొడి చేయించి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకొని స్నానానికి వెళ్లబోయే ముందు వెంట్రుకలను పాయలుగా విడదీసి ఈ పొడిని కుదుళ్ళ మద్య చల్లాలి. పది నిమిషాల తరువాత సన్నటి పళ్ళుగల దువ్వెనతో వెంట్రుకలను దువ్వేయాలి. అప్పుడు ఈ పొడితో పాటు వెంట్రుకలను అంటి ఉన్న జిడ్డు, మురికి బయటకు వచ్చేస్తుంది. తరువాత తలారా స్నానం చెయవచ్చు.
యష్టి మధూకమ్ పచారి షాపుల్లో దొరుకుతుంది.
లిక్విడ్ హెర్బల్ షాంపు -
కుంకుడు కాయల పొడి , గుంతగలగరాకు , నిమ్మ కాయ చెక్కలు, టీ పొడి, సామ్బరేణి ఆకులు వీటిలో అన్నింటిని గాని , లేక దొరికిన వాటిని కాని గుప్పెడు తీసుకుని ఒక లోటాడు వేడి నీళ్లలో వేయాలి . తరువాత గిలక్కొట్టి షాంపూ లా వాడవచ్చు.
* బిరుసు జుట్టుకు -
మహా నీలి బృంగరాజ తైలం 3 చెంచాలు
నిమ్మరసం 1 చెంచా .
కోడిగుడ్డు పచ్చసోన 1 చెంచా .
తేనే 1 చెంచా .
వీటన్నింటిని తీసుకుని బాగా కలిపి తలకు పట్టించి కొంచం సేపు ఆగి స్నానం చేయాలి . నిమ్మరసం వెంట్రుకల పైన ఉండే కెరటిన్ పొరని వుబ్బెలా చేసి వెంట్రుకలను మృదువుగా మెరిసేలా చేస్తుంది . కోడిగుడ్ల సోన వెంట్రుకలకు కావలసిన ప్రోటీన్స్, సల్ఫర్ సమకూరుస్తుంది.
గమనిక -
* మహా నీలి బృంగరాజ తైలం ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.
* తేనే వలన వెంట్రుకలు ఎర్రబడటం అన్నది అపోహే .
* కొడిగుడ్డు సొన వాడలేని వారు ప్రత్యామ్నాయంగా పెరుగు వాడుకొవచ్చు.
* జుట్టు ముదురు రంగులో కనిపించడం కోసం -
గుంటగలగర ఆకు , సంబరేణి మొక్క , మరువం వీటిని పేస్ట్ లా చేసి తలకు పట్టించి స్నానం చేయాలి
* గొరింటాకు, నీలిచెట్టు ని నలుగగొట్టి తీసిన రసం , చండ్ర చెట్టు సారం వీటితో మంచి హెర్బల్ డై తయారు అవుతుంది.
* గొరింటాకు ని యధాతధంగా నూరి పేస్టు లా ఉపయోగించ వచ్చు.
* టీ ఆకులని నీళ్లలో వేసి వాటి సారం మొత్తం నీళ్లలో దిగేంత వరకు మరగనిచ్చి ఆ నీళ్లని ఉపయోగించాలి. ఫలితం కొరకు మూడు నుంచి నాలుగు సార్లు ప్రయోగించవలసి ఉంటుంది. అలాగే వీటితో పాటు నిమ్మరసం పూస్తే వెంట్రుకల పై ప్రభావం తొందరగా కనిపిస్తుంది. చాలాకాలం వరకు ఉంటుంది.
జాగ్రత్తలు -
* వేడినీటితో తలస్నానం చేయరాదు .
* మానసిక అందోళన వల్ల కూడా వెంట్రుకల సమస్యలు వస్తాయి.
* శరీరంలోని అధిక కొవ్వు కూడా వెంట్రుకలకు రక్తప్రసరణ అడ్డుకుంటుంది.
కావున తగుజాగ్రత్తలు తీసుకుని సమస్యలు నుండి బయటపడగలరు అని ఆశిస్తున్న.

గోవుతో వైద్యం .

* ఆవుపాలు - 

ఇవి మధురంగా సమ శీతోష్న్ం గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.

* ఆవుపెరుగు - గర్భిణి స్త్రీకి వరం .

వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.

* ఆవు వెన్న -

ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.

* ఆవునెయ్యి -

ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .

* ఆవుపేడ -

ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.

* గుధస్తానంలో తిమ్మిరి కొరకు -

ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .

* వంటి దురదలకు -

అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి .

* కడుపులోని క్రిములకు -

20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.

ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .

* ఆవుముత్రం -


* ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి .

* గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.

* వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.

* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.

* ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.

* ప్రతిరోజు ఉదయమే గొముత్రాన్ని 30 గ్రా మొతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది.