Friday, October 24, 2014

కాకర కాయ మహాత్మ్యం

కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది.కాకర వంటకాలు తిని ఆ లాభం పొందగలరు. కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.

1. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది.

2. రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాది
నయమవుంతుంది.

3. షుగర్‌ వ్యాది గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను
ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది.

4. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారో
గ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే చాలు.

5. మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు.

6. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి
తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం
కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి.

7. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు.కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు.

8. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు...

Wednesday, September 24, 2014

గులాభి పువ్వులతో మెరిసే చర్మం

గులాభీలు ప్రకృతి ప్రసాదించిన వరం !అటువంటి గులాభిలతో అందం మీ సొంతం!
మొటిమలు ,నల్లటి మచ్చలు తగ్గించడంలో ప్రత్యేకపాత్ర వహిస్తాయి,అంతేకాకుండా అందమైన చర్మం మీ సొంతం!!!!

1) గులాభి రేకుల్ని ఎండబెట్టి ,పొడిచేసి నిల్వచేసుకోవాలి ,ఒక చెంచా నిమ్మరసం లో కలిపి ప్రతిరోజు ముఖానికి రాసుకోవాలి ,30 నిముషాలు తర్వాత కడిగేయాలి. 

2) పచ్చి గులాభి రేకుల్ని ,పెరుగులో కలిపి మెత్తటి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి ,30 నిముషాలు తర్వాత కడిగేయాలి. 

3) నిమ్మరసం ,పచ్చి గులాభిల పేస్ట్ కలిపి ముఖానికి పట్టించాలి. 

4) శనగపిండి ,గులాభిల పేస్ట్ కలిపి ముఖానికి రాయాలి 

పైన తెలిపిన విధంగా చేస్తే 30 రోజులలో అందమైన చర్మం మీ సొంతం అవ్తుంది!!!!

మొటిమలకు - మచ్చలకు

1) వేపాకులను నీటిలో బాగా కడిగి ,మెత్తగా నూరాలి , దానిలో కొద్దిగా పుల్లటి పెరుగు చేర్చి మిశ్రమం లా చేయాలి. దీనిని కొద్దిగా తీసుకొని ముఖం పై మృదువుగా మసాజ్ చేయాలి. మిగతా మిశ్రమాన్ని మందంగా ముఖం మొత్తం ప్యాక్ లా వేసుకోవాలి. 30 మినిట్స్ వెయిట్ చేసి ,గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

2) వేపాకులను ఎండబెట్టి ,మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి , 2 స్పూన్స్ పౌడర్ లో 1 స్పూన్ నిమ్మరసం కలిపి ,ముఖం పై మెల్లగా మసాజ్ చేసి ,30 మినిట్స్ తర్వాత కడిగేయాలి. 


పై వాటిలో ఏదో ఒకటి లేదా ,రెండు తరుచుగా మారుస్తూ ,వారం లో రెండు లేదా మూడు సార్లు చేస్తే ఒక నెలలో నిగనిగలాడే ,మొటిమలు , మచ్చలు లేని ముఖం మీ సొంతం అవుతుంది .  

Friday, September 19, 2014

సొరకాయలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:-

* సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి., మదుమేహ వ్యాధిగ్రస్తురకు సొరకాయ మంచి ఆహారం అని అందరూ ఒప్పుకుంటారు. ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో, వారు సొరకాయను తిని, శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుకోండి.

* బరువు తగ్గిస్తుందిం వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది . ఈ గ్రీన్ వెజిటేబుల్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. కాబట్టి బాటిగార్డ్ ను జ్యూస్ లా తయారుచేసి, త్రాగి బరువు తగ్గించుకోండి.

* కిడ్నీ సమస్యలున్నవారు, ఆల్రెడీ మీరు డయాలసిస్ చేసుకంటున్నట్లేతే, ఈ గ్రీన్ బాటిల్ గార్డ్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే. డయాలసిస్ చేసుకొనే వారిలో ఇది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా ఉంచతుంది.

* అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. సొరకాయను ముక్కలుగా చేసి, జ్యూస్ చేసి, చిటికెడు ఉప్పు వేసి, మూడురోజులు తీసుకొన్నట్లైతే, కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది.

* నిద్రలేమి సమస్య?ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే, ఈ గ్రీన్ వెజిటేబుల్ ను డిన్నర్ లో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నిద్రలేమి వారికి చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఉడికించి లేదా జ్యూస్, చేసి తీసుకోవచ్చు.

* పీచు పదార్థం ప్రధానంగా ఉండడం వల్ల సొరకాయ, అజీర్ణానికి చక్కటి ఔషధంగా పని చేస్తుంది. మలబద్ధకం, మొలలు వంటి అనేక రకాల రోగాలను సొరకాయ నివారిస్తుంది.

* ప్రతిరోజు తినే ఆహారంతో పాటు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగితే ఎంతో మంచిది. మూత్రంలో యాసిడ్‌ అధికంగా ఉన్న కారణంగా మూత్రనాళంలో ఉండే మంటను ఇది తగ్గిస్తుంది. అయితే వైద్యుని పర్యవేక్షణ మాత్రం మరువకూడదు.

* ఆయుర్వేదం ఏం చెబుతోందంటే... ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు సొరకాయ రసం తాగినట్లయితే జుట్టు చిన్నవయసులోనే నెరవకుండా కాపాడుతుంది.

* శరీరం పొడిబారకుండా, నిగనిగ మెరవడానికి సొరకాయ సహాయపడుతుంది. మీ చర్మం అంతర్గతంగా పరిశుభ్రపడడానికి ప్రకృతి సిద్ధంగా లభించే ఔషధంగా సొరకాయను వాడవచ్చు. అనేక రకాల చర్మ సంబంధమైన రుగ్మతల నుంచి సొరకాయ కాపాడుతుంది. శరీరంపై వచ్చే మచ్చలను తొలగించడానికి కూడా సొరకాయ దోహదపడుతుంది.

* తీవ్రమైన అతిసార, మధుమేహం, కొవ్వు అధికంగా ఉన్న, వేయించిన పదార్థాలు తినడం వల్ల సంభవించే విపరీతమైన దాహానికి మంచి విరుగుడుగా సొరకాయ పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. అలసటపాలు కాకుండా కాపాడుతుంది.

* సొరకాయ నిలువెల్లా నీరు నిండి ఉండడం వల్ల ఆహార పదార్థంగా వండి తిన్నప్పుడు సులభంగా త్వరగా అరిగిపోతుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవికాలంలో ఉదయం పూట ఒక గ్లాసు సొరకాయ రసం తాగడం వల్ల వడదెబ్బనుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పని చేయడానికి అయినా వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

Thursday, September 11, 2014

జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు


జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉల్లిపాయ(ఉల్లిగడ్డ) తో పరిష్కారం  
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ , తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.తద్వారా తలలో మూసుకుపోయిన రంద్రాలు తిరిగి తెరవబడతాయి. ఉల్లిపాయ రసం తలకు అప్లై చేయడం వల్ల , జుట్టు బలంగా పెరుగుతుంది.జుట్టు లో ఉన్న ఫంగస్ ని హరింపచేసి చుండ్రును నివారిస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారుతుంది.ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. వారంలో 3 సార్లు ఉల్లిరసం తలకు పట్టిస్తే , రెండు నెలల్లో కొత్త జుట్టు రావడం గమనిస్తారు.
 అప్లై చేసే విధానం  
1)
ఉల్లిపాయలను బాగా మెత్తగా గ్రైండ్ చేసి, ఒక బట్టలో తీసుకొని పిండితే రసం వస్తుంది.
2) ఈ రసాన్ని తలకు పట్టించి , మృదువుగా ఒక 5 నిముషాలు మసాజ్ చేయాలి.
3) 45 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు  
1)
తల స్నానానికి హెర్బల్ షాంపూ మాత్రమే వాడాలి ( nuzen /himalaya /sesa ఈ మూడింట్లో ఒకటి ఎంచుకోవాలి )
2)
మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
3)
తీసుకొనే ఆహారంలో పోషకాలు ఉండేట్లు చూసుకోవాలి.
4)
రోజులో కనీసం 3 లీటర్ల నీటిని త్రాగడం అలవాటు చేసుకోవాలి.

ఇలా చేస్తే అందమైన జుట్టు మన సొంతం.

Thursday, August 28, 2014

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే లక్షణాలు

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే ఆ విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని లక్షణాలు స్వయంగా రోగికి అనుభవంలోకి వస్తుంటాయి. 

మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి మూత్రంతోపాటు రక్తం

చలిజ్వరం మూత్రం దుర్వాసన రావడం, రంగు మారడం

వెనుకవైపు ఛాతీకి- పిరుదులకు మధ్య (లోవర్ ఎబ్డామిన్) సన్నగా మెలిపెట్టినట్లు నొప్పి వస్తుంది. నొప్పి తీవ్రత పెరిగినప్పుడు తల తిరగడం, వాంతి కావడం వంటి లక్షణాలు కూడా తోడవుతుంటాయి. ఈ లక్షణాలలో ఏది కనిపించినా పరీక్ష చేయించుకోవడం మంచిది.

గమనిక: రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు మూత్ర విసర్జన సమయంలోనే బయటకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లే క్రమంలో మూత్రవాహిక ఒరుసుకుపోయినట్లు అనిపించవచ్చు. అంతే తప్ప పైన చెప్పిన లక్షణాలు కనిపించవు. మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లు రెండు మీల్లీమీటర్ల కంటే పెద్దవైనప్పుడు పై లక్షణాలు బయటపడతాయి.

Monday, July 7, 2014

సౌందర్యానికి ‘మందారం’

నేటి ప్రపంచంలో అదీ ఈ యాంత్రిక జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు.ఇక కేశ సమ్రక్షణ కోసం మరింత ఖర్చే పెడుతున్నారు.అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు,పోషణకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువే కాక ఖర్చు తక్కువ కూడా.
అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం.మందారం ఉపయోగలను తెలుసుకుందమా..
మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందానీ, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుందా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్లబడకుండా ఉందేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది.కేశాలకు వృధప్య చాయలు దరి చేరకుండ చూస్తుంది.చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.అన్నింటి

Tuesday, June 3, 2014

సున్ని పిండి తయారు చేసుకునే పద్ధతి

 సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం.శనగపిండి, పెసరపిండి వీటికి తోడు కచ్చూరాలని బజారులో దొరుకుతాయి వాటిని కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడి కాని, కుంకుడు కాయ పొడి కాని కలిపివాడుకోవచ్చు.దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో తల రుద్దు కుంటే జిడ్డు తొందరగా వదులుతుంది.తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత స్నానం చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది.మట్టి శరీరం మీద చెమటతో కలిసి నల్లగా పేతుకుపోతుంది, ఇది పోవాలంటే, సబ్బు వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు. మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి శుభ్రపరచు కోవటం కష్టం , అందుకు వారు నూనె రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు సౌందర్యానికి సౌందర్యం !


Wednesday, May 14, 2014

నేత్రదానం

నేత్రదానం మీద సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ అనర్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేత్రదానం చేయకపోతే ఇప్పుడు మాత్రమే నష్టం. కానీ దాని గురించి తెలుసుకోక పొతే వచ్చే తరం, ఆ తర్వాత తరం... అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి తరతరాలు నష్టం కలగటానికి ఇది ప్రధాన కారణం. అందకే నేత్రదానం పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి.నేత్రదానం అనేది 1 సంవత్సరం నుండి వందసంవత్సరాల పైబడినవారు కూడా చేయగల ఏకైక దానం.నేత్రదానం అంటే కళ్ళు మొత్తం స్వీకరించరు కేవలం కంటి పైన గల ఒక పొర మాత్రమే స్వీకరిస్తారు.
నేత్రాలను నేత్రదాత మరణించిన 3 నుండి 5 గంటలలోపు మాత్రమే సేకరించాలి. కనుక వెంటనే దగ్గరలోని ఐ బ్యాంక్‌ కు సమాచారం ఇవ్వాలిఎయిడ్స్‌, పచ్చ కామెర్లు, రేబిస్‌ (కుక్కకాటు) మినహా మిగతా ఏ కారణం తో మరణించినా నేత్రదానం చేయవచ్చు.నేత్రదానం చేయాలి అనుకుంటే అందుకు దగ్గరలో ఉన్న నేత్రనిధికి వెళ్లి మీ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ కార్డు మీదగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవటం మంచిది.
కార్నియా అనేది మన కంటిమీద ఉండే ఒక పొర. కంటిలోకి కాంతి కిరణాలు వెళ్లాలంటే ఈ పొర గుండా మాత్ర మే కంటిలోపలకు వెళ్తాయి. మన శరీరంలో ఏ అవవయం చెడిపోయినా ఆపరేషన్‌ చేసి బాగుచేయవచ్చు. కానీ లివర్‌ (కాలే యం), కార్నియా చెడిపోతే ఏమీ చేయలేము. కేవలం వేరొకరు దానం చేస్తే మాత్రమే తిరిగి చూపు పొందటానికి మార్గం ఉంటుంది. అందుకు నేత్రదానం ఒక్కటే మార్గం.మన శరీరంలో అన్ని అవయవాలు ఆక్సిజన్‌ (ప్రాణ వయవు)ను రక్తం ద్వారా స్వీకరిస్తాయి. కానీ ఈ కార్నియా ఒక్కటే నేరుగా గాలి నుండి ఆక్సిజన్‌ను స్వీకరిస్తుం ది. అందుకే నేత్రదాత మరణించిన వెంటనే అన్ని అవయవాలు చనిపోతే కేవలం ఈ కళ్ళు మాత్రం 6 గంటల వరకు గాలిలోని ఆక్సిజన్‌ను స్వీకరిస్తూ బ్రతికి ఉంటాయి.నేత్రనిధి కేంద్రాల కోసం మీకు దగ్గరలోని ఐ బ్యాంక్‌ యొక్క చిరునామా కోసం క్రింది అడ్రస్‌ను సంప్రదించండి.

Dr S .Chandu
phone : 9440017115
E-mail : drschandu@dr.com , drschandu@gmail.com
Eye bank association of India
Plot No: 12, BNR Colony,
Road No: 14, Banjarahills, Hyderabad - 500034
Phone: 040 23545454, 23544504
Website: www.ebai.org
E-mail: ebai@vsnl.net, admin@ebai.org

రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి !Dr S Chandu

రక్త దానం (Blood donation) అనేది దాదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ కోసం ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు.ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటె ఎక్కువ hemoglobin ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటె తక్కువ hemoglobin ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు.
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడ కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే సుమారు 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితి రావచ్చు.ఏటా మన రాష్ట్రంలో 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే.మానవ రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. రక్తదానం చేయడమం టే ఓ ప్రాణాన్ని కాపాడడమే.ప్రతీ పది నిముషములకు మన రాష్ట్రంలో ఎక్కడోచోట ఒకరికి రక్తం అవసరమ వుతుంది. ప్రతి రోజూ కనీసం 38,000 మంది రక్తదాతల అవసరం ఉంది.
అత్యధికంగా కోరుకునే రక్తం ‘ఒ’ గ్రూప్‌ , మన రాష్ట్రంలో ఏటా కొత్తగా 2.5 లక్షల మంది క్యాన్సర్‌ బాధితులుగా తేలుతున్నారు.కెమోథెరపీ చికిత్స సందర్భంగా తరచూ వారికి రక్తం అవసరం ఉంటుంది.రక్తదానం ఎంతో సురక్షిత ప్రక్రియ.ప్రతీసారి కూడా స్టెరెైల్‌ నీడిల్‌ను ఉపయోగిస్తారు. ఒకసారి ఉపయోగించిన దాన్ని మళ్ళీ ఉపయోగించరు.
రిజిస్ట్రేషన్‌, మెడికల్‌ హిస్టరీ, డొనేషన్‌, రిఫ్రెష్‌మెంట్‌ అనే నాలుగు తేలిక పాటి దశల్లో రక్తదానం పూర్తవుతుంది
రక్తదానం చేసే వారికి ముందుగా టెంపరేచర్‌, బీపీ, పల్స్‌, హిమోగ్లోబిన్‌ తదితర పరీక్షలు చేస్తారు. ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలిగ్గా పూర్తయ్యేవే.రక్తదాన ప్రక్రియ పావుగంటలో పూర్తవుతుంది.
మన శరీరంలో 10 - 12 యూనిట్ల రక్తం ఉంటే, సుమారుగా 1 యూనిట్‌ రక్తా న్ని దానం చేయవచ్చు. దాని వల్ల దాత శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఆరోగ్యవంతుడెైన దాత ప్రతీ 56 రోజులకు ఒకసారి ఎరర్రక్త కణాలను డొనేట్‌ చేయవచ్చుఆరోగ్యవంతుడెైన దాత కనీసం 7 రోజుల విరామంతో సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేయవచ్చు.రక్తానికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌, ఇతర అంటువ్యాధుల సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాతే దాన్ని అవసరమైన వారికి ఎక్కిస్తారుమన శరీరం మొత్తం బరువులో రక్తం బరువు 7 శాతం దాకా ఉంటుంది.
రక్తం నుంచి ఎరర్రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్‌ అనే భాగాలను విడదీసి ఎవరికి ఏది అవసరమో వారికి అది అందిస్తారు. ఒక్కసారి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడవచ్చు. డొనేట్‌ చేసిన ప్లేట్‌లెట్స్‌ను సేకరించిన ఐదురోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుందిమీరు గనుక 18 ఏళ్ళ వయస్సులో రక్తదానం చేయడం ఆరంభిస్తే, 60ఏళ్ళు వచ్చేసరికి మీరు 30 గ్యాలన్ల రక్తాన్ని దానం చేయవచ్చు. కనీసం 500 మంది ప్రాణాలు కాపాడవచ్చు.దేశంలో 7 శాతం మంది మాత్రమే ‘ఒ’ నెగెటివ్‌ కలిగి ఉన్నారు. వారి రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చు. గ్రహీత గ్రూప్‌ తెలియని పరిస్థితుల్లో, అప్పుడే పుట్టిన శిశువులకు రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఈ గ్రూప్‌ రక్తం అవసరం ఉంటుంది.దేశంలో కనీసం 35 శాతంమంది ‘ఒ’ పాజిటివ్‌ గ్రూప్‌ను కలిగి ఉన్నారు. రక్తంలోని ప్రధాన గ్రూప్‌లు ఎ,బి, ఎబి, ఒదేశంలో 0.4 శాతం మంది ఏబి- బ్లడ్‌గ్రూప్‌ను కలిగి ఉన్నారు. వీరి రక్తంలోని ప్లాస్మాను ఎవరికైనా ఉపయోగించచ్చు.రక్తాన్ని దానం చేసే 3 గంటల ముందు మంచి భోజనాన్ని తీసుకోండి. దానం చేసిన తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం. తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది
దానం చేసే రోజు ముందు పొగ త్రాగడం మానండి. దానం చేసిన 3 గంటల తరువాత మీరు పొగ త్రాగవచ్చు
దానం చేసే 48 గంటల ముందు మీరు ఆల్కహాలు సేవించి ఉంటే, మీరు దానం చేయడానికి అర్హులు కారు.

పూర్తి వివరాలకు , మీ సందేహాలకు ఈ చిరునామాలో సంప్రదించండి
Dr S Chandu
phone : 9440017115
Email : drschandu@dr.com , drschandu@doctor.com
Institute Of Transfussion Medicine & Research
phone : 040 - 23300352, 23328956, 23319491
Nims Backside Compound, Road No 1,
Banjara Hills, Hyderabad - 500034

Saturday, May 10, 2014

సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము.

వేసవి రాగానే చల్లని పానీయాల వైపు మనసు మళ్ళుతుంది.శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను సేవిద్దాము.
1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,స
ోడియం,కాల్షియం లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.
2) మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12 లభిస్తాయి.
3) సబ్జా నీరు: మహిళలకు అవసర మయ్యె పాలేట్, నియాసిన్, చర్మాన్నిఅందంగా ఉంచే విటమిన్ E అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4) పుచ్చకాయ : గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN సూర్యరశ్మి లోని U.V కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
5) తాటి ముంజలు :6 అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
6) నిమ్మరసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.విటమిన్ సి ఎక్కువ
7) చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి. ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.
8) రాగి జావ: ఇది మధుమేహం, కీళ్ల నొప్పుల, acidity ని తగ్గిస్తుంది.
ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.

Sunday, May 4, 2014

వేగంగా బరువు తగ్గించే వెజిటేబుల్స్

బరువు తగ్గించుకోవడం కోసం క్రాష్ డైట్ లేదా మోనో డైట్ చేయడం అంత మంచి పరిష్కార మార్గం కాదు. ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకొన్నవారు, సరైన ఆహారాలు తీసుకోవడం వల్ల అవి శరీరానికి కావల్సిన శక్తిని అందివ్వడంతో పాటు, శరీరంలో చేరిన అదనపు కొవ్వును కరిగించే విధంగా సహాయపడాలి. బరువు తగ్గాలనుకొనేవారు తక్కువ క్యాలరీలు, అదే విధంగా తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో అదనపు కొవ్వును కరిగించే ఆహారాలు వివిధ రకాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, శరీరం మంచి ఒక ఆకృతిని పొందవచ్చు.
అటువంటి స్లిమ్ బాడీ పొందాలంటే, సిట్రస్ పండ్లు, నిమ్మ, బెర్రీస్ వంటివి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. అదే విధంగా కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. ఉదాహరణకు : కీరదోసకాయ వంటివి రెగ్యులర్ డైట్ లో ఉండాల్సినటువంటి ఒక వెయిట్ లాస్ వెజిటేబుల్. కీరదోసలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి ఒక హెల్తీ వెజిటేబుల్. బెల్ పెప్పర్ కూడా బరువు తగ్గిస్తుంది. ఎల్లో, రెడ్ మరియు గ్రీన్ బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ లు జీవక్రియలు చురుకుగా పనిచేసి, క్యాలరీలను తగ్గిస్తుంది. ఇంకా శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తాయి. ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ బీన్స్, ఆకుకూరలు, మరియు బ్రొకోలీ వంటివి అదనపు పౌండ్ల బరువును తగ్గించేస్తాయి. కాబట్టి, నేచురల్ గా మీ బరువు తగ్గించే కొన్ని రకాల వెజిటేబుల్స్ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడంతో పాటు, రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తే తప్పనిసరిగా బరువు తగ్గుతారు. వ్యాయామం వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
కాకరకాయ: కాకరకాయలో చేదు కలిగిన వెజిటేబుల్స్ లో ఇది ఒకటి. కాకరకాయ రసం లేదా కాకరకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంతో పాటు, బరువు కూడా తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది.
కీరదోసకాయ: కీరదోసలో నీటి నీరు 90శాతం ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీలుంటాయి. ఈ జ్యూసీ వెజిటేబుల్ బరువు తగ్గాలనే డైటర్స్ కు ఒక బెస్ట్ వెజిటేబుల్.
ఆకుకూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను వైయిట్ లాస్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఆకుకూరలతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . ఇవి చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గడానికి ఇది ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.
సొరకాయ: సొరకాయలో ఫైబర్ కంటెంట్ మరియు నీరు అధికంగా ఉంటుంది. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. కాబట్టి, మీ దినచర్యను బాటిగార్డ్(సొరకాయ)జ్యూస్ తో ప్రారంభించండి. జ్యూస్ చేసిన తర్వాత వడగట్ట కుండా అలాగే తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఫైబర్ అందుతుంది. క్యాలరీలు తగ్గించడంలో ఫైబర్ అద్భుతంగా సహాయపడుతుంది.
బ్రొకోలీ: ఇది మరొక గ్రీన్ వెజిటేబుల్. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని ఉడికించి లేదా ఆవిరి పట్టించి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ న్యూట్రీషియన్స్ అందుతాయి. దాంతో ఎక్కువ ప్రయోజనం.
గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్ లో ఎక్కువ విటమిన్లు మరియు ఫైబర్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. గ్రీన్ బీన్స్ లోని యాంటీఆక్సిడెంట్స్ బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.
బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్: ఇది ఒక ఫ్యాట్ బర్నింగ్ వెజిటేబుల్. ఇదుంలో యాంటీఆక్సిడెంట్ మరియు విటమిన్లు ఉన్నాయి. ఇవి బరువు తగ్గాలనుకొనే వారికి చాలా అవసరం అవుతాయి.
ఉల్లిపాయ: నమ్మలేకపోతున్నారు కదూ? కళ్ళలో నీళ్ళు పెట్టించే ఈ ఉల్లిపాయ, బరువు తగ్గించడానికి సహాయపడుతుందంటే ఆశ్చర్యమే . బరువు తగ్గించడంతో పాటు బ్లడ్ ప్రెజర్, చెడు కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.
క్యాబేజ్: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో ఫైబర్ మరియు నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది పొట్టను నిండుగా ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్యారెట్: క్యారెట్ లో విటమిన్ ఎ, సి మరియు కె, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీర ఆరోగ్యానికి మరియు చర్మ ఆరోగ్యానికి ఒక హెల్తీ వెజిటేబుల్.
సెలరీ: సెలరీని వెయింట్ లాస్ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ మరియు నీటికంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నింపుతుంది మరియు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది.
టమోటో: టమోటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది బరువు తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాలన్ ను కరిగించడంలో, బౌల్ ను శుభ్రం చేయడంలో మరియు చర్మసంరక్షణకు గొప్పగా సహాయపడుతుంది.

పోపులపెట్టే ఫస్ట్ ఎయిడ్ కిట్


మన వంటింట్లో ఉండే మామూలు దినుసులే ఎన్నో చిన్న చిన్న రుగ్మతలను తగ్గించి ఆరోగ్యాన్ని ఉత్సాహంగా ఉంచుకొంటుంది. మనం రోజూ వాడే పదార్థాలతో కలిగే ప్రయోజనాలు...
పసుపు :
నీళ్లలో కాస్తంత పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు మటు మాయమైపోతుంది.
మిరియాలు :
స్వచ్ఛమైన తేనెలో కాస్తంత అల్లం రసంతో పాటు నాలుగైదు మిరియాలు తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇంకా ఇది ఆకలిని కూడా పెంచుతుంది.
కొత్తిమీర :
మనం ఆహారంలో వేసుకునే కొత్తిమీర జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.
కాస్తంత కొత్తిమీర రసాన్ని కొద్దిగా అల్లం రసంతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర రసం, అల్లం రసం ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగాలి. దాంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
ఏలకులు :
నోటి దుర్వాసనను ఏలకులు సమర్థంగా అరికడతాయి.
దాంతో పాటు వికారం, తలనొప్పికి కూడా ఏలకులు మంచి మందుగా పనిచేస్తాయి.
కళ్లు మంటలు, దురదలు తగ్గడానికి కూడా, ఏలకులు బాగా పనిచేస్తాయి.
వెల్లుల్లి :
వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
వెల్లుల్లిని వాడినప్పుడు అందులోని అలిసిన్ అనే పదార్థం (ఇదే వెల్లుల్లికి ఘాటైన వాసన ఇస్తుంది) అధిక రక్తపోటు, గుండెజబ్బుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇంకా రక్తనాళాల్లోని కొవ్వును తగ్గిస్తుంది.
శనగలు :
కఫం తగ్గించడానికి శనగలు బాగా పనిచేస్తాయి.
ఒక టేబుల్‌స్పూన్ శనగపిండిని ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రాత్రివేళ తీసుకుంటే ఆ మిశ్రమం జీర్ణ సంబంధమైన అనేక సమస్యలను నివారిస్తుంది.

అనేక రోగాలపై కత్తి - అత్తిపత్తి


ఈ మొక్కను మీరంతా చూసే ఉంటారు. ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుని కొంత సమయం తరువాత వాటంతట అవే మళ్ళి విచ్చుకుంటాయి. వర్షా కాలంలో మన గ్రామాల చుట్టూ నీటి తడి ఉన్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది. ఇందులో ముళ్ళు లేని మొక్క, ముడ్లు ఉన్న మొక్క అనే రెండు రకాలు ఉంటాయి. ముడ్లున్న అత్తా పత్తి భూమి నుండి జానెడు మొదలు మూరడు వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు తుమ్మకుల్లగా చిన్నగా ఉంటాయి.
కొమ్మలకు ముళ్ళుంటాయి. పూలు ఎరుపు కలిసిన ఉదారంగులో ఉంటాయి. ముడ్లు లేని అట్టి పత్తి నేలపై పరచుకుని ఉంటుంది, ఇది కూడా నీరున్న ప్రాంతాలలో పెరుగుతూనే ఉంటుంది. నెల పైన రెండు ముడు గజాల దాకా పాకుతుంది. దీనికి పసుపు రంగు పూలు ఉంటాయి, సన్నటి కాయలు ఉంటాయి, కాయల్లో గింజలు లక్క రంగులో ఉంటాయి.
అత్తిపత్తి కి అనేక పేర్లు
సంస్కృతంలో లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు.
అత్తిపత్తి-గుణ గణాలు
ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ది చేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది, ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది, పాత వ్రణాలనుమాన్పుతుంది, మేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగాన్ని, స్త్రీరోగాలను హరించి వేస్తుంది.
వీర్య హినతకు – బ్రహ్మాస్త్రం
అత్తిపత్తి గింజలు, చింతగింజల పప్పు, నీరుగోబ్బి గింజలు సమంగా తీసుకుని మర్రి పాలలో ఒక రాత్రి నానా పెట్టి తరువాత గాలికి అరపెట్టి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి. రెండు పుటలా ముడు మాత్రలు నీటితో వేసుకుని వెంటనే నాటు అవు పాలు కండ చెక్కర కలిపి తాగాలి.
నలబై రోజుల్ ముత్రములో వీర్యము పోవడం, శిఘ్రస్తలనం, నపుంసకత్వం, అన్గాబలహింత హరించి ధాతుపుస్టి కలుగుతుంది.
ఆహార నియమాలు: వేడి, పులుపు, కారం పదార్దాలు నిషేదించి భ్రహ్మచర్యం పాటించాలి.

ఎరుపు, తెలుపు, పసుపు శెగలకు
ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోయటం వల్ల గాని, లేక సెగ రోగామున్న వారితో సంబోగం జరపడం వల్ల గాని, ఈ సుఖ రోగం కలుగుతుంది.
ఆ సమస్యకు అత్తిపత్తిఆకు, మంచిగందం పొడి, సమంగా తీసుకుని కలబంద గుజ్జుతో మెత్తగా నూరి మాత్రలు కత్తి నీడలో గాలికి బాగా ఎండబెట్టి నిలువ ఉంచుకోవాలి. రోజు రెండు పుటలా పుటకు ఒక మాత్ర మంచి నీటితో వేసుకుంటుంటే సెగ తగ్గటమే కాక విర్య వృద్ది కలుగుతుంది.
నారికురుపులు నశించుటకు
అత్తిపత్తి ఆకులూ మెత్తగా నూరి నారి కురుపులుపై వేసి కట్టుకడుతూ ఉంటె అవి నశించి పోతాయి.

ఆహార నియమాలు: గొంగోర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.
ఆగిన బహిష్టు-మరలా వచ్చుటకు
అత్తిపత్తి ఆకు పొడి ఒక బాగము, పటిక బెల్లం పొడి రెండు బాగాలు కలిపి పుటకు అర చెంచ పొడి మంచి నీటితో సేవిస్తూ ఆగిన బహిష్టు మరల వస్తుంది, రాగానే చూర్ణం వాడటం ఆపాలి.
ఆహార నియమాలు: బెల్ల నువ్వులు, గంజి, తీపి పదార్ధాలు వాడాలి.
వీర్య స్తంభనకు
అత్తిపత్తి వేర్లను మేక పాలతో గాని, గొర్రె పాలతో గాని, గంధంలా నూరి ఆ గంధాన్ని ఫురుషులు తమ అరికాళ్ళకు మర్దించుకుని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలాసేపటి వరకు విర్యపతనం కాదు.
బోదకాలి మంట, పోటుకు
అత్తిపట్టిఆకు 5గ్రా., మిరియాలు 9 ఒక కప్పు నీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి పరగడుపున 40 రోజుల పాటు సేవించాలి, దీనితో పాటు... అత్తిపత్తి ఆకును ముద్దగా నూరి బోధకాలిపై పట్టులాగా వేసి కట్టు కడుతూ ఉంటె మాట, పోటు,బాద తగ్గిపోతాయి.
ఆహార నియమాలు: మాంసం, చేపలు, నంజుపధర్ధాలు నిషేధం.
స్త్రీల యోని బిగువకు
అత్తిపత్తి ఆకు తేనెతో మెత్తగా నూరి యోనికి పట్టిస్తూ ఉంటె యోని బిగువగా మారుతుంది.
ఆహార నియమాలు: తీపి పదార్ధాలు సేవించాలి.
స్త్రీల స్తనాల బిగువుకు
అత్తిపత్తి సమూలఛుర్నం, అస్వగంద దుంపల చూర్ణం సామగా కలిపి వుంచుకుని రాత్రి పుట తగినంత పొడిని నీటితో నూరి స్తనలపై పట్టించి ఉదయం కడుగుతూ ఉంటె జారిన స్తనాలు బిగువుగా మారతాయి.
ఆహార నియమాలు: పాలు, నెయ్యి, పండ్లు, తీపి తినాలి.
చల్ది, మశూచికములకు
అత్తిపత్తి ఆకు 30గ్రా.. మిరియాలు 2 గ్రా.. ఈ రెంటిని మెత్తగా నూరి ఒక గ్రాము బరువుగల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. రెండు పుటలా ఒక మాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూ చెల్దికురుపులు మసూచికంగండమాల హరించి పోతాయి.
ఆహార నియమాలు: చేపలు, మాంసం, వేడి పదార్ధాలు నిషేధం.
నీళ్ళవిరేచనాలు-రక్తమొలలు
అత్తిపత్తి సమూల చూర్ణం 3 నుండి 5 గ్రా పంచదార ఒక చెంచా కలిపి రెండు పుటల సేవిస్తుంటే అతిసారా విరేచనాలు, రక్త మొలలు హరించి పోతాయి:
ఆహారనియమాలు: విరేచనకర పదార్ధాలు నిషేధం.
సిగ్గు విడచిన – స్త్రీ పురుషులకు
సూర్య గ్రహణము లేక చంద్రగ్రహనము రోజున అత్తిపత్తి ధూపదీప నైవేద్యలతో పూజించి వేరు తెచ్చి కడిగి ఆరపెట్టి దాన్ని రాగి తాయేత్తులోపెట్టి మొలకు గాని చేతికి గాని కట్టిఉంచితే అంతకుముందువరకు సిగ్గు లేకుండా బరితెగించి ప్రవర్తిచే స్త్రీ పురుషులు క్రమంగా తమ తప్పును తామే తెలుసుకుని సిగ్గు పడతారు.
అతిముత్రమునకు-అత్తిపత్తి
పచ్చని పూలు పుసే అత్తిపత్తి చెట్టు కాడలను, తాటి కలకండను సమంగా కలిపి మెత్తగ్గా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా అరపెట్టి రెండు పుటలా మర్రి చెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూ ఉంటె అతి మూత్రం హరిస్తుంది.
వ్రణాలకు-అత్తపత్తి
అత్తపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులుపైన, పుడ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటె క్రమంగా వ్రణాలు మాడిపోతాయి.
అత్తపత్తితో-అద్బుత కాటుక
అత్తపత్తి చెట్టును సమూలంగా ఒక కేజీ తెచ్చి కడిగి నలగొట్టి అందులో 4 కేజీల నీళ్ళుపోసి ఒక రాత్రి నానబెట్టి ఉదయం పొయ్యి మీద పెట్టి ఒక కేజీ కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి ఆ కషాయంలో ఒక కేజీ నువ్వుల నునే పోసి తైలం మిగిలే వరకు మళ్ళి మరగ బెట్టాలి.
తరువాత ఆ నూనెతో దీపం వెలిగించి పైన మంటతగిలేలా మట్టిముకుడు గాని, రాగి పళ్ళెం కాని పెట్టి మసి పారించాలి. తరువాత ఆ మసిని తీసి ఆవునెయ్యి కలిపితే కాటుక అవుతుంది. రోజు రాత్రి కళ్ళకు పెట్టుకుంటుంటే పొరలు, పూతలు మసకలు తగ్గిపోతాయి.

కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించే అనాసపండు

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్ధాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.
పొట్టను తగ్గిస్తుంది:
ఈ రోజుల్లో పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. యువతీ, యువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ అనాసపండుకి ఉంది. ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. తర్వాత రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.
ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి.
పిల్లలకు ఔషధం వంటిది:
అనాసపండు పచ్చకామెర్లను నయంచేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది మూత్ర పిండాలలోని రాళ్ళను కరిగిస్తుంది. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది. పిత్తాన్ని పోగొడుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగు పరుస్తుంది. పిల్లలచేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి.
అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.
మూత్ర పిండాల్లోని రాళ్ళను కరిగిస్తుంది:
అనాసపండు ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరుగుతుంది, నిగారింపును సంతరించుకుంటుంది. అనాసపండును తరచుగా తింటుండడం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అనాసపండు రసాన్ని రోజుకి నాలుగు సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి.
జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది:
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండడం వల్ల త్వరగా జీర్ణ శక్తి పెరుగుతుంది.

స్థూలకాయం-ఆహార విధానము

ఆహార నియమాలు
పొట్టలో గ్యాస్ తయారయ్యే శనగపిండి పదార్ధాలు(మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు, శనగపిండితో చేసిన తీపి పదార్ధాలు మొదలగునవి), మైదాతో తయారయ్యే మైసుర్ బజ్జీలు, మైద రొట్టెలు, మైదా పూరీలు మొదలగునవి సేవించరాదు.
ఆచరించవలసిన ఆహార ఔషధాలు
త్రిపలాదిచూర్ణం తీసుకుని పావు చెంచా నుండి ఒక చెంచా వరకు క్రమంగా పెంచుతూ తేనెతో గాని,
గోరు వెచ్చని నీటితో గాని వేడి శరీరం గలవారు మజ్జిగతో గాని సేవిస్తూ తమ బరువును తగ్గించుకోవాలి.
ఆహారసేవన విదానము
పొట్టలో అజీర్ణం కాకుండా, ఆ ఆజిర్ణము వలన గ్యాస్, మంట పుట్టకుండా ఉంచటానికి, ఆహారము సేవించేటపుడు ప్రతీ ముద్దను పదిహేను నుండి ముప్పై రెండు సార్లు బాగా నమలి మింగాలి, అలా చేయడం వలన నోటిలోని లాలాజలం గ్రంధుల నుండి లాలరసం ఉత్పన్నమయ్యి ఆహారంతో బాగా కలిపి నోటిలోనే కొంతబాగం ఆహారం జీర్ణం కావడం ప్రారంభం అవుతుంది. దీనివలన కొత్తగా కొవ్వు పెరుగకపోగా అప్పటికే పెరిగి ఉన్న కొవ్వు కుడా క్రమంగా తగ్గుతుంది.
అనవసర కొవ్వుకు-ఔషద తైలం
త్రిపలాద్యతైలంను తీసుకుని దానిని రెండు పుటలా స్నానానికి గంట ముందు గోరువెచ్చగా కొవ్వు పెరిగిన అవయవాలుపై మర్దన చేస్తూ ఉంటె క్రమంగా అధిక కొవ్వు హరించిపోతుంది.

జుట్టు రాలకుండా ఉండాలంటే.....

మృదువైన శిరోజాల కోసం ఈ చిట్కాలు పాటించండి. మన వంటింట్లో ఉండే మెంతులు మన శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తాయి.
జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను నివారించడానికి పావు కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పెరుగుతో సహా రుబ్బుకుని తలకు పూతలా వేసుకుని అరగంట తర్వాత తలారా స్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను చాలావరకూ తగ్గించవచ్చు.
అలాగే తలలో ఏవైనా ఇన్‌ఫెక్షన్లు ఉంటే అలాంటి వాటిని తగ్గించడానికి తలకు వేప నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలకు వేపాకును మెత్తగా నూరి పట్టించినా కూడా సమస్యను నివారించవచ్చు. గోరింటాకును ఇలా వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
అలాకాకున్నా వేపాకుల్ని గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో వేపాకుల్ని వేసి మరిగించి, బాగా చల్లారిన తర్వాత వడగట్టి, ఆ నీటితో తలను కడుక్కున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి అరటిపండు గుజ్జును తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టురాలే సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జును కూడా ఇలా తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇంకా తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.

స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా?


ఉరుకుల పరుగుల జీవన విధానం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం మందిలో స్థూలకాయం పెరిగింది. దాన్ని తగ్గించుకోవడానికి అన్వేషణ పెరిగింది. అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నప్పుడు మొదట వినపడే మాట, 'మొలకలు తినండి' అనే! ఆ తరువాత పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు... వగైరా వగైరా. మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల పెరిగాయి. మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి. కేలరీలు పెరగవు. ఇంతకన్నా స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి? మొలకలు ఆరోగ్యకరమే! కానీ, ఏ విధంగానో తెలుసుకోవాలిగా! మొలకలు పోషకాహారంగా ఎల్లప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముల్లంగి, ఆల్ఫాల్ఫా, క్లోవర్, సోయాగింజలు, బ్రఖోలి అద్భుతమైన మాంసకృతులను కల్గి విస్తృత శ్రేణిలో వివిధ పోషకాహారాలతో చక్కటి ఆరోగ్యాన్ని కల్గించడానికి సహాయపడతాయి. మొలకల వల్ల అత్యవసర వైద్యసంబంధ లాభాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మొలకలు మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుండి కాపాడే సామర్థ్యం కల్గి ఉన్నాయని కనుగొన్నారు. మొలకలు తిన్నందు వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు క్రింద తెలపబడ్డాయి: సమృద్ధిగా అత్యవసర పోషకాలు: మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు, మొలకెత్తిన తర్వాత గింజలు చాలావరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. ఎంజైముల అద్భుతమైన మూలాలు: మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి. అధిక మాంసకృతులు: మొలకలలో మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియదు. నిజానికి వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కోలెస్టరాల్ను, క్యాలరీలను తగ్గిస్తుంది. ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు చేయబడ్డాయి. తేలికగా జీర్ణమౌతాయి: మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా ఉత్తమమైనవి. బరువు తగ్గడానికి ఎంతో మంచివి: మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో ఉండి, క్యాలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గించుకొనే ప్రణాళికకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్ లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహార ప్రణాళికలో మొలకలను జత చేయండి. మొలకల్లో కొవ్వు వుండదు. ప్రోటీన్లకు మొలకలు పెట్టింది పేరు. సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ ఇవన్నీ మొలకలు తయారు చేసుకోవడానికి మార్గాలే! గర్భిణులు మొలకలు తింటే వారికే కాదు, పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. ఫైబర్‌, ఐరన్‌, నియాసిన్‌, కేల్షియమ్‌ -ఇవన్నీ మొలకల్లో పుష్కలం. శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి. కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది. మొలకల్లో లభ్యమయ్యే విటమిన్‌ బి, డి శరీరానికి చాలా అవసరం. ఇందులోని ఫాస్పరస్‌ పళ్లకు, ఎముకలకు ఉపయోగ పడుతుంది.

Friday, May 2, 2014

తెల్ల జుట్టు

1) వెల్లుల్లి పొట్టు -10 g ,ఆలివ్ నునే -100 ml వెల్లుల్లి పొట్టు ను బూడిద చేసి ఆలివ్ నూనెలో కలిపి 10 రోజులు ఉంచాలి .తరువాత రాత్రి పూట తలకు నూనె రాసుకొని ఉదయం తల స్నానం చెయ్యాలి.
2) బోడతరం తైలం ¼ spoon సేవిస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారును .
3) చిన్న పిల్లల్లో వెంట్రుకలు తెల్లగా మారడాన్ని బాలనెరుపు అంటారు . ఇది తగ్గడానికి తేనే,నెయ్యి,పాలు,గోమూత్రం కలిపి రోజు రెండు పూటలు త్రాగాలి
4) బోడతరం కషాయం 100 ml ,నువ్వుల నునే 100ml చిన్న మంటమీద తైలం చెయ్యాలి .దీనిని గోరఖ్ నాద్ తైలం అంటారు .ఈ తైలం ను 3 చుక్కలు రెండు ముక్కు రంధ్రాల్లో వేయాలి.మరియు భోజనానికి గంట ముందు spoon తైలం సేవించాలి
5) తిప్పతీగ,ఉసిరి,పల్లేరుకాయలు సమానంగా చూర్ణం చేసి spoon పొడిని spoon తేనే కలిపి తినాలి.
6) కామంచి ఆకురసం ,గుంటగలగర రసం సమానంగా కలిపి తలకు రాయాలి .తరువాత స్నానం చెయ్యాలి .ఇలా 15 రోజులు చెయ్యాలి
7) బోడతరం పూల చూర్ణం ,spoon తేనే లో కలిపి రోజు సేవించాలి
8) త్రిఫల చూర్ణం ,నీలి ఆకుల చూర్ణం, లోహ చూర్ణం, గుంటగలగర చూర్ణం ఈ నాల్గింటిని గొర్రె మూత్రం లో నానబెట్టి తలకు రాయాలి .ఇది గొప్ప అనుభవం. దీనిని కేసరంజక చూర్ణం అంటారు.

బట్టతల


బూరుగు చెట్టు జిగురు ,నేలతాడి దుంపలు ,తామర గింజలు అన్నిటిని గుజ్జు చేసి బట్టతల ఫై రాయాలి
జటామాంసి-100 g ,పుష్కరమూలం-100g ,నల్లనువ్వులు-100g ,సుగందపాల వేర్లు-100 g ,తామర గింజలు 100g కొద్దిగా నీరు కలిపి గుజ్జుగా చేయాలి దీనిలో నెయ్యి 500 g కలిపి దీనిని తలకు పట్టించాలి
అతిమధురం 20 g ,చెంగల్వ కోష్టు-20g ,సారపప్పు-20g,మినపప్పు-20 g ,తెల్ల గురివిందలు-20 g ,సైందవలవణం-20 g,అన్నిటిని చూర్ణం చేసి దీనిలో కొబ్బరి పాలు వేసి గుజ్జు చేసి బట్టతలకు రాయాలి
కలబంద రసం లో జీలకర్ర,పసుపు కలిపి 90 రోజులు సేవిస్తే బట్టతలఫై జుత్తు వచ్చును
మర్రి ఊడలు-50g,జటామాంసి 50g నూరి పేస్టు చేసి బట్టతల ఫై రాయాలి
ఉసిరి,నల్ల నువ్వులు,పల్లేరుకాయలు నూరి లేపనంగా రాయాలి
బట్టతల ఫై ముల్లంగి ముక్కతో రుద్దితే మళ్ళి వెంట్రుకలు వస్తాయి
అతిమడురం 20g, చెంగల్వ కోస్టు 20g,సారపప్పు 20g, మినపప్పు 20g ,తెల్లగురివిందలు 20g, సైందవ లవణం 20g, దీనిలో కొబ్బరి పాలు కలిపి మెత్తగా గుజ్జు చేసి రాత్రి పూట తలకు మర్దన చెయ్యాలి
మర్రి ఊడలు 50g, జటామాంసి 50g, నూరి తలకు రాయాలి
ఉసిరి, నల్లనువ్వులు, పల్లేరు కాయలు నూరి తలకు రాయాలి 2 గంటలు తరువాత కడగాలి.100రోజులు చెయ్యాలి

అశ్వగంధ

శుద్ధి చేసే విదానం : వేరును పాలతో మరిగించి తరువాత ఎండబెట్టాలి . ఇలా 7 సార్లు చేయాలి .
తగ్గించే వ్యాధులు :
1) బరువు తగ్గుట: 3 రోజులకు ఒకసారి spoon చొప్పున ఆకుల రసం ఉదయం పరగడుపున తీసుకోవాలి .ఇలా 15 సార్లు పాటిస్తే అధిక బరువు తగ్గును.
2) మానసిక వత్తిడి : వేరు పొడిని spoon చొప్పున పాలతో 40 రోజులు రెండు పూటలు తీసుకోవాలి .
3) గర్బసంచి శుభ్రపరుచును : వేరు పొడిని రెండు పూటలు పాలతో 40 రోజులు తీసుకొంటే స్త్రీలకూ గర్భసంచి శుభ్రం అగును.
4) తెల్లరక్త కణాలను పెంచును : శుద్ధి చేసిన అశ్వగంధ వేరు పొడిని రెండు పూటలు పాలతో 120 రోజులు తీసుకొంటే తెల్లరక్త కణాలు పెరుగును .
5) కాన్సర్ తగ్గించును : శుద్దిచేసిన వేరు పొడిని నిత్యం పాలతో తీసుకొంటే cancer తగ్గుతుంది .మరియు రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
6) high BP తగ్గించును : వేరు పొడి-100 గ్రాములు మరియు మిరియాలు -50 గ్రాములు రెండిటిని పొడి చేసి రెండు పూటలు నీటితో సేవిస్తే high BP తగ్గును.
7) క్షయ వ్యాధి తగ్గును : అశ్వగంధ వేరు పొడి,పిప్పళ్ళు ,పటిక పంచదార మూడింటిని సమానంగా కలిపి తేనెతో రెండు పూటలు తినాలి .
8) సెగగడ్డలు తగ్గడానికి : ఆకులను నూరి సెగగడ్డలు ఫై రాస్తే తగ్గుతుంది .

సుగందపాల

రసాయనాలు: హెమిడేస్మాల్,హేమిడేస్టిరాల్,రెసిన్,సపోనిన్
1) రక్త శుద్ధి కోసం : వేరు పొడిని నీటితో 40 రోజులు సేవిస్తే రక్తశుద్ది జరుగును.
2) high BP : వేరు పొడిని నీటితో సేవించాలి .
3) మూత్ర నాళ సమస్యలను తగ్గించును:వేరు పొడి నీటితో 40 రోజులు సేవిస్తే మూత్ర నాళ సమస్యలు తగ్గును
4) వాత నొప్పులు తగ్గును: వేరు పొడిని నీటితో 40 రోజులు సేవిస్తే శరీరానికి వచ్చే అన్ని రకాల వాత నొప్పులు తగ్గును.

Tuesday, April 29, 2014

ప్రకృతి


జబ్బుల నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే.. నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో రాసుకుంటాం..
ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు.
curd-పెరుగుతో పొట్ట క్షేమం
మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
Herbal Tea - హెర్బల్ టీ

తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.
cherries -చెర్రీతో కీళ్లు భద్రం
చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.
Turmeric - పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..
ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.

Ginger - ఆర్థరైటిస్‌కి అల్లం
జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
fish - నడుంనొప్పికి చేప
మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది?

 
బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో సంతానం కలగకపోవటానికి 40% వరకు ఆడవరిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు మగవారిలో లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో లోపాలుండవచ్చు, లేదా 10% వరకు దంపతులిద్దరిలోనూ ఇదమిద్దముగా చెప్పలేని కారణాలవల్ల సంతానం కలగకపోవచ్చు. పెళ్లయి భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఏ విధమైన సంతాన నిరోధకాలు వాడకుండా ఉన్నా మొదటి సంవత్సరంలోపు సంతానం కలగనట్లయితే వెంటనే సంతాన సాఫల్యతా నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.

సంతాన లేమికి మగవారిలో ఉండే కారణాలు :

1. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండుట.
2. వీర్య కణాల కదలిక, సారూప్యంలో అధికముగా తేడాలుండుట.
3. వీర్యంలో వీర్య కణాలు లేకపోవటం.
4. వీర్య కణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవటం.
5. హొర్మొన్ల శాతంలో తేడాలుండుట.
6. వీర్యకణాల అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.
7. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు,
8. సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు,

ఆహారాలు :

చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి.

వెల్లులి : ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది.
దానిమ్మ : దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి.
అరటి : మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో
ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.
పాలకూర : ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.
మిరపకాయ : చాల మందికి మిరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మిరపని ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు బాగా విశ్రాంతి తీసుకుంటది. మిరపలో సి, బీ , ఈ.. విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.
టమాటో : అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan) చక్కని వీర్య శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి.
పుచ్చ : దేనిలో సమ్రుదిగా ఉండే లీకోపాస్, నీటి శాతం మగవారి ఫెర్టిలిటీ(male fertility) ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము కౌంట్ ను పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి హైడ్రేషన్‌(hydration) ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది.
విటమిన్ సి : మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఇది కాపాడుతుంది. ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం లోని'సి' విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి.
ఆపిల్ : దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది.
జీడిపప్పు : బోజనాల్లో జీడిపప్పు తీనడం వలన కడుపు నిండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతం పెంచుతుంది జింక్ ఫెర్టిలిటీ నీ మెరుగుపరుస్తాయి.

Sunday, April 27, 2014

శరీరంలో పేరుకొనే వ్యర్థాలు(free radicles)

 

శరీరంలో పేరుకొనే వ్యర్థాలు(free radicles)... అందంతో పాటూ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి.

మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా...
బీట్‌రూట్‌ :
ఈ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. పైగా దీన్ని కూరగానే కాదు, పచ్చిగా, జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.
యాపిల్‌ :
రోజుకో పండు తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు. అదే సమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. దీన్నుంచి అందే విటమిన్లూ, ఖనిజాలూ, ఫ్లవనాయిడ్లూ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతాయి.
దానిమ్మ :
దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి.
యాంటి ఆక్షిడెంట్లు గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును.

తేనె సహజ ఔషధ గుణములు

తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ ‌‌, మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు.
ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి.
చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.
గొంతులో గరగరలను తగ్గిస్తుంది. . నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును ,
తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుంటాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి.
తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.
కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి. ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.
రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి, జీర్ణం సులభం చేస్తుంది.
తేనే ,దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్‌ తగ్గుతుంది.
రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్‌ రానివ్వదు.
వేడినీటిలో ఒక స్పూన్‌ తేనే, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది.
తేనే లో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును,
యాన్తి బ్యాక్తెరియాల్ , యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన ,.. గాయాలు మానును .
తేనే ... వెనిగర్ తో కలిపి 'vermifuge ' గా వాడుదురు .
రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది .
రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది .
నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది .
తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .
రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది .
తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి .

Tuesday, April 15, 2014

రక్తపోటును నివారించే చిట్కాలు:-

ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎవరిని పలకరించినా హై బి.పి ఉందని అంటున్నారు. హై బి.పి. నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. విషయమేమిటంటే మనలో చాలా మంది హై బి.పి. ఉందన్న విషయం తెలియకుండానే గడిపేస్తుంటాం. హై బి.పి. లక్షణాలు అంత తేలిగ్గా తెలియవు. హై బి.పి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు, దాని ప్రభావం శరీరానికి ముఖ్య అవయవాలైన గుండె, కిడ్నీల పైనే మొదట పడుతుంది, అంతే కాదు ఈ హై బి.పి. ఒక లెవెల్ దాటిందంటే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్ర పిండాల సమస్యలు వస్తాయి. ఇలా ఒక్క కారణం చేత వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల భారీన పడకుండా బిపిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా పూర్తిగా హైబిపిని తగ్గించుకోవడానికి క్రింది ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి
1.పుచ్చకాయ :-
నియాసిన్‌, పాంటోథోనిక్‌ ఆమ్లం, విటమిన్‌ సి, మాంగనీస్‌లు దీనిలో అధికంగా ఉంటాయి. బి.పి.ని తగ్గిస్తుంది. హై బిపి నివారణలో ఖర్బూజా చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది.
2.అరటి పండ్లు:-
అరటిపండ్లు ఆన్లైన్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం,అరటి వంటి పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తినడం మరియు ఉప్పు తీసుకోవడం తగ్గించడం ద్వారా భవిష్యత్తులో ప్రతి సంవత్సరంను సేవ్ చేయవచ్చు. పొటాషియం అనేది శరీరంలోని ద్రవాల సంతులనం చేసి తక్కువ రక్తపోటుకు సహాయపడే ఒక ముఖ్యమైన ఖనిజం. మీరు ఐదు అరటిపండ్లను తినే విధంగా చూసుకోవాలి.
3.మొలకలు :-
మంచి ఆరోగ్య పోషకాలు ఉన్న ఆహారం అవసరం. పోషకాలు ఏ సమయంలోనైన లోపం జరిగితే తక్కువ రక్తపోటు కారణమయ్యే సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, పూర్తి పోషకాలున్న మొలకలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.
4.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు:-
ఆరెంజ్, కివి, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష మరియు స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే, అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు పచ్చివిగా లేదా వాటిని రసాలుగా తీసి తాగవచ్చు. మీ బ్లడ్ ప్రెజర్ సహజ నియంత్రణలో ఉండాలంటే, ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవాలి.
5.పెరుగు:-
పెరుగును ఆస్వాదించండి ఒక రోజులో కేవలం ఒక చిన్న కుండలో మూడో వంతు పెరుగు ద్వారా అధిక రక్తపోటు అవకాశాలను తగ్గించవచ్చు. US మిన్నెసోటా విశ్వవిద్యాలయం సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం సహజ కాల్షియం రక్త నాళాలను ఎక్కువ అనువుగా చేయవచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. కొద్దిగా విస్తరించేందుకు మరియు ఒత్తిడి ఉంచడానికి అనుమతిస్తుంది. ప్రతి రోజు 120g పెరుగును15 సంవత్సరాల కాలం తిన్న వారిలో అధిక రక్తపోటు అభివృద్ధి 31 శాతం తక్కువ అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు.
6.నిమ్మకాయ :-
నిమ్మకాయ హై బి.పి. ఉన్నవారికి చాలా విలువైన ఔషధం , ఎందుకంటే నిమ్మకాయలో ఉండే విటమిన్ పి, బి. పి. ని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది
7.వెల్లుల్లి:-
హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది.
8.కొత్తిమీర :-
కొత్తిమీర లో ఉన్న ఔషధ గుణాలు బి.పి. ని అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒకసారి తాగినా చాలు, బి పి కంట్రోల్ లో ఉంటుంది.
9.టమాటాలు:-
ఎర్రగా ఉండి మంచి రసాన్ని ఇచ్చే టమాటా పండులో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు ఈ పండు బాగా పని చేస్తుంది. వీటిలో వుండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా రక్తపోటు నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి,ఎ,ఇ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా రక్తపోటు నియంత్రిస్తాయి.
10.బంగాళాదుంప:-
బంగాళా దుంపలు బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపల పొట్టు తీయకుండా ఉడికించడం వల్ల అందులో ఉండే పొటాషియం వల్ల ఉప్పు వేయకపోయినా ఉడికిన బంగాళాదుంపలు ఉప్పగా ఉండి రుచిగా ఉంటాయి. కాబట్టి బంగాళా దుంపలను రోజుకు ఒకసారైనా ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్తపడాలి.
11.ఉసిరికాయ:-
ఉదయం పూట పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో కాస్త తేనె కలుపుకుని తాగితే బి. పి. లెవెల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మరొక ముఖ్య గమనిక :-
హై బి. పి కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా తిరగబడే అవకాశముంది, కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

Monday, April 14, 2014

రాగులు

రాగులు బలవర్దకమయిన ధాన్యం. రాగి సంగటి అనగానే గుర్తొచ్చేది రాయలసీమ. ఆ జిల్లాల్లో ఇప్పటికీ దానినే ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో, మజ్జిగలో కలుపుకుని తాగేవారు మన పెద్దవాళ్ళు. అయితే ఇంకా చెప్పాలంటే మన ఇళ్ళల్లో కోళ్ళకు వీటినే బలమైన ఆహారంగా పెట్టేవారు ఒకప్పటి తరం వారు. ఎందుకంటే దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంగటికీ రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామా..!
1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
4. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
6. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
7. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

Saturday, April 12, 2014

చెరకు రసం

చెరకు రసం చక్కని పరిష్కారం:-
చెరకు రసం పిల్లాపెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో పొటాషియం అధికం. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం.
1.1. కామెర్లకు విరుగుడు:-
చెరకు రసం కామెర్లును సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలుగా పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ పనితీరు సరిగా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది. కాబట్టి దీని నుండి బయట పడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి.
2. కిడ్నీ(మూత్రపిండం)లో రాళ్ళు:-
చెరకు రసంతో ఇది చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు విచ్చినం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.
3.మధుమేహానికి:-
మధుమేహం ఉన్నవారికి చెరకు రసం బాగా సహాయపడుతుంది . ఇది ముడి షుగర్ కన్నా లేదా ఆర్టిఫిషియల్ షుగర్ కన్నా ఈ చెరకు రసం చాలా మంచిది. మీరు బరువు తగ్గించే పనిలో ఉన్నా లేదా డయాబెటిక్ చెరకు రసం జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరం. ఈ జ్యూస్ వల్ల శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దీకరిస్తుంది.
4.న్యూట్రిషియన్ బెనిఫిట్స్:-
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం.
5.జలుబు, జ్వరం మరియు గొంతు నొప్పి:-
మీరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే. ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరకు రసం జ్యూస్ తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
6.క్యాన్సర్ నివారిణి:-
ఇందులో ఆల్కలీన్ కలిగి ఉండటం వల్ల, చెరకు రసం ముఖ్యంగా ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా రొమ్మక్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
7.రీహైడ్రేషన్:-
సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా నీరు త్రాగరు. దాంతో డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. కాబట్టి శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇంకా వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది

Wednesday, April 9, 2014

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

1.సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.
2.అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
3.మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
4.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
5.ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
6.ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
7.సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి

Saturday, March 29, 2014

త్రిఫల చూర్ణం ఉపయోగాలు

ఉపయోగాలు:
1. కళ్లకు, చేర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
2. జుట్టును త్వరగా తెల్లగా అవనివదు అలాగే జుట్టును బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
3. ముసలితనం త్వరగా రనివదు.
4. జ్ఞాపకశక్తిని బాగా వృది చేస్తుంది.
5. ఎర్ర రక్త కణాలను బాగా వృది చేస్తుంది.
6. ఇమ్మ్యూనిటి నీ బాగా శక్తివంతం చేస్తుంది.
7. ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
8. అసిడిటీ నీ తగ్గిస్తుంది.
9. ఆకలిని బాగా పెంచుతుంది.
10. యురినరి ట్రాక్ట్ ప్రొబ్లెమ్స్ నుంచి బాగా కాపాడుతుంది.
11. సంతాన సామర్ద్యాన్ని బాగా పెంచుతుంది.
12. శ్వాస కొస సంబందమైన ప్రొబ్లెమ్స్ రావు.ఒక వేల ఉన్నాకూడా కంట్రోల్ లో ఉంటాయి.
13. లీవర్ నీ చాల ఆరోగ్యంగా ఉంచుతుంది.
14. సరిరంలోని తొక్షిన్స్ నీ ఎలిమినేట్ చేస్తుంది.
15. కోలన్ నీ క్లీన్ గ ఉంచి కోలన్ కీ ఏమి వ్యాదులు రాకుండా రక్షిస్తుంది.
16. రక్తాన్ని సుద్ది చేస్తుంది.
17. మేతబోలిసం రేట్ నీ పెంచుతుంది.
18. అదిక బరువుని అరికడుతుంది.
19. శరీరంలోని లోని చెడు పదార్దాలను బయటకు పంపిస్తుంది.
20. కోలన్ నూ బాగా శుబ్రంగా ఉంచుతుంది అంటే కాకుండా కోలన్ కు సంబందించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.
21. రక్తాన్ని సుద్దిచేస్తుంది.
22. మేతబోలిసం రేట్ నీ బాగా పెంచుతుంది.
23. అదిక బరువును అరికడుతుంది
24. శరీరంలోని బాక్టీరియా నీ వృద్ది కాకుండా ఆపుతుంది.
25. కాన్సర్ నీ కూడా నీరోదిస్తుంది.
26. కాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుంది.
27. బీపీ నీ అదుపులో ఉంచుతుంది.
28. ఎలర్జీ నీ అదుపులో ఉంచుతుంది.
29. సీరుం కొలెస్ట్రాల్ నీ బాగా తగ్గిస్తుంది.
30. చక్కగా వీరోచనం అయేలా చేస్తుంది.
31. హ్ఐ వీ నీ కూడా నీరోదిన్చాగల శక్తీ త్రిఫల చుర్నంకి ఉంది.
32. నెత్త్రవ్యదులని నీరోదించే శక్తి త్రిఫలకు ఉంది.
33. గర్బవతులు ఈ త్రిఫల చూర్ణం వాడకూడదు.