Thursday, January 28, 2016

మొటిమల నివారణా పద్దతులు -

* కస్తూరి పసుపు , నిమ్మకాయల రసంలో అరగదీసి రాసిన మొటిమలు తగ్గుతాయి .
* మంజిష్ట తేనెతో అరగదీసి పూస్తే పోతాయి .
* చందనం , జాజికాయ , మిరియాలు నూరి పూస్తే పొతాయి.
* గేదే వెన్నను మొటిమలపైన పూయు చున్న పొతాయి.
* రక్తచందనం , పచ్చి పసుపు , గేదే పాలతో నూరి పూస్తే మొటిమలు పొతాయి.
* శొంటి , లవంగాలు, బాగుగా నూరి పట్టిస్తే మొటిమలు పొతాయి.
* వెల్లుల్లి రసం మొటిమల పైన రాస్తే తగ్గుతాయి .
* బియ్యం కడిగిన నీళ్ళు ముఖానికి రాస్తూ 10 నిమిషాలు అయిన తరువాత కడుగుచుండిన మొటిమలు పొతాయి.
* పచ్చపెసల పిండి , హారతి కర్పూరం , సుగంధి పాల వీటిని సమబాగాలుగా కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని ప్రతి రాత్రి ముఖానికి రాస్తూ ఉంటే మొటిమలు , మచ్చలు పోయి ముఖానికి మంచి కాంతి , సౌందర్యం పెరుగుతాయి.
* 50 గ్రా వాముతో , 40 గ్రా పెరుగు కలిపి మెత్తటి పేస్ట్ లాగా నూరి రాత్రి పూట ఫేస్ పేస్ట్ లా నూరి రాత్రి పూట ముఖానికి అవసరం అయినంత వరకు ప్యాక్ లా వేసుకుంటూ ఉంటే మొటిమలు పూర్తిగా నివారించ బడుతాయి.
* అతివస , శ్రీగంధం సమబాగాలుగా తీసి , ఆవుపాలతో నూరి 7 రోజులు ముఖానికి పూసిన మొటిమలు హరించును.
* తులసి ఆకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించిన మొటిమలు పోవును .
* తులసిఆకులు , పుదినా , వేపాకు మెత్తగా నూరి ముఖానికి పుసిన మొటిమలు హరించును.
* బాదంపాలు లేక రసం పుసిన మొటిమలు పోవును .
* బొప్పాయి కాయ రసం రాస్తే మొటిమలు హరించును. కడిగితే జిడ్డు పొతుంది.
* ప్రతిరోజు పడుకునే ముందు పుదిన రసం రాసి అరగంట తరువాత కడిగిన తగ్గును .
* పోకచేక్కతో గంధం తీసి రాసిన మొటిమలు పోవును .
* చిక్కుడు ఆకుల రసం పుసిన ముఖము పైన అన్ని మచ్చలు పోవును .
* వేడినీళ్ళతో నిమ్మరసం పిండి టీస్పూన్ గ్లిసరిన్ కలిపి పట్టించి అరగంట తరువాత కడిగిన పోవును

No comments:

Post a Comment